అందరూ ప్రభుత్వసూచనలను పాటించాలిః ప్రభుత్వ ప్రజావ్యవహాారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి


తాడేపల్లి ,ఏప్రిల్ 09.:


కరోనా నియంత్రణ విషయంలో అందరూ ప్రభుత్వసూచనలను పాటించాలిః ప్రభుత్వ ప్రజావ్యవహాారాల సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి


కరోనా (కోవిడ్ -19)నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు నాగార్జున యూనివర్శిటి సమీపంలోని రెయిన్ ట్రీ పార్క్ విల్లా ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన సూక్ష్మక్రిములు,బాక్టీరియాలను నివారించే సేఫ్ టన్నెల్ ను ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు  సజ్జల రామకష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా  సజ్జల రామకష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పరిశుభ్రతే ధ్యేయంగా రెయిన్ ట్రీ పార్క్ లో విల్లాలఎంట్రన్స్ వద్ద సేఫ్ టన్నెల్ ను ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు.
 కోవిడ్ -19కు ప్రస్తుతం వ్యాక్సిన్ గాని,మందు గాని లేదని పరిశుభ్రతే దానికి సరైన ఆయుధం అన్నారు.పరిశుభ్రతతో ఉంటూ  భౌతిక దూరాన్ని  పాటిస్తూ ఉంటే ఆ వైరస్ దరిచేరదని అన్నారు.రాష్ర్ట ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ నుంచి రాష్ర్టాన్ని ,ప్రజలను రక్షించడానికి రేయింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు.ముఖ్యంగా వైద్యఆరోగ్య శాఖ,పోలీసు,పారిశుధ్య,రెవిన్యూ తదితర శాఖలు నిత్యం అప్రమత్తంగా ఉండేలా తగు ఆదేశాలు ఇస్తున్నారని తెలియచేశారు.లాక్ డౌన్ వల్ల కొన్ని 
తాత్కాలిక ఇబ్బందులు ఉన్నప్పటికి ప్రజలు కూడా సహకరిస్తున్నారని అన్నారు.కరోనానుంచి రక్షించుకోవడానికి ప్రస్తుతం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అధికారయంత్రాంగం తక్షణం స్పందించేలా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవస్దలను బలోపేతం చేశారని వివరించారు.
పొన్నూరు ఎంఎల్ఏ  వెంకటరోశయ్య మాట్లాడుతూ కరోనా నియంత్రణ ప్రజలచేతిలోనే ఉందని అన్నారు.ప్రభుత్వం చేస్తున్న సూచనలు తూచతప్పకుండా పాటిస్తూ అత్యవసరమై ,తప్పనిసరైతే తప్పితే ఇంటినుంచి బయటకు రాకూడదని తెలియచేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్  చల్లా మధుసూధనరెడ్డి మాట్లాడుతూ కరోనానుంచి రక్షించుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ,లోకల్ కమ్యూనిటి అసోసియేషన్ అధ్యక్షులు నరసరాజు,పుల్లాప్రసాద్త్,సమాచారహక్కు కమీషనర్ బివి రమణకుమార్, పార్టీ రాష్ర్ట కార్యదర్శి శ్రీ సిద్దారెడ్డి,ఎస్సిసెల్ రాష్ర్ట ప్రధానకార్యదర్శి శ్రీ గోచిపాత శ్రీనివాస్ , సిమ్స్ విద్యాసంస్ధల డైరక్టర్ భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image