కష్ట కాలంలో ప్రజలకు అండగా చేగువేరా ఫౌండేషన్

*Gudur ఏప్రిల్ 8 :


కష్ట కాలంలో ప్రజలకు అండగా చేగువేరా ఫౌండేషన్*
*సంఘటితంతో కరోనా పై పోరాడదాం*


*లాక్ డౌన్ లో చిక్కుకున్న వలస కార్మికులకు, నిరాశ్రయులకు  చేగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ*


*గూడూరు ఉప రవాణా శాఖ అధికారి మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా ఆహారం పంపిణీ*


*కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో అన్ని వర్గాల ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారని ఈ కష్ట కాలంలో చేగువేరా ఫౌండేషన్ అభాగ్యులకు అండగా నిలవడం అభినందనియమని గూడూరు ఉప రవాణా అదికారి మల్లికార్జున రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు,అధ్యక్షులు గుండాల ఆది నారయణ ల ఆధ్వర్యంలో ఒరిస్సా కార్మికులకు,ఉపాధి లేక సతమత మవుతున్న ప్రజలకు ఆహారం పంపిణీ కార్యక్రమం విజయ వంతంగా జరుగుతోంది.8వ రోజు ఆహార పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రవాణా అధికారి మల్లికార్జున రెడ్డి,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు మురళి మోహన్,రాఘవరెడ్డి,M.W.N.W అధ్యక్షులు,మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీమ్ లు హాజరై పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ పేద వర్గాల ప్రజలకు చేగువేరా ఫౌండేషన్ వర ప్రదాయిని అన్నారు. సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు అండగా వైయస్అర్ కాంగ్రెస్స్ పార్టీ, రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అండగా వున్నారని ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.జగనన్న పిలుపుతో కోవిడ్-19 కారణంగా ఉపాధి లేక సతమత మవుతున్న బాధితులకు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనునిత్యం ఆహార పంపిణీ జరగుతోందన్నారు.లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి చవటపాలెం,చిల్లకూరు ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా ఆహారం అందిస్తున్నామన్నారు.కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కవ అయినందున ప్రజలు అధికార యంత్రాంగం తెలిపిన సూచనలు పాటించి జాగ్రత్త పడాలనీ సూచించారు.ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు చేగువేరా టీమ్ శక్తివంచన లేకుండా పనిచేస్తుందన్నారు.ఈ కార్య కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్‌. మదురెడ్డి,ఆన్సర్ భాష,నరేష్ రెడ్డి మరియు పైలట్ టీమ్ వినోద్,పవన్,భాస్కర్,అజయ్, సంతన్, సాయి మహేష్,లక్ష్మి నారాయణ,తరుణ్ తదితరులు పాల్గొన్నారు*


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image