*Gudur ఏప్రిల్ 8 :
కష్ట కాలంలో ప్రజలకు అండగా చేగువేరా ఫౌండేషన్*
*సంఘటితంతో కరోనా పై పోరాడదాం*
*లాక్ డౌన్ లో చిక్కుకున్న వలస కార్మికులకు, నిరాశ్రయులకు చేగువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ*
*గూడూరు ఉప రవాణా శాఖ అధికారి మల్లికార్జున రెడ్డి చేతుల మీదుగా ఆహారం పంపిణీ*
*కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో అన్ని వర్గాల ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారని ఈ కష్ట కాలంలో చేగువేరా ఫౌండేషన్ అభాగ్యులకు అండగా నిలవడం అభినందనియమని గూడూరు ఉప రవాణా అదికారి మల్లికార్జున రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల సురేష్ బాబు,అధ్యక్షులు గుండాల ఆది నారయణ ల ఆధ్వర్యంలో ఒరిస్సా కార్మికులకు,ఉపాధి లేక సతమత మవుతున్న ప్రజలకు ఆహారం పంపిణీ కార్యక్రమం విజయ వంతంగా జరుగుతోంది.8వ రోజు ఆహార పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రవాణా అధికారి మల్లికార్జున రెడ్డి,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు మురళి మోహన్,రాఘవరెడ్డి,M.W.N.W అధ్యక్షులు,మైనార్టీ నాయకులు అబ్దుల్ రహీమ్ లు హాజరై పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ పేద వర్గాల ప్రజలకు చేగువేరా ఫౌండేషన్ వర ప్రదాయిని అన్నారు. సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు అండగా వైయస్అర్ కాంగ్రెస్స్ పార్టీ, రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అండగా వున్నారని ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.జగనన్న పిలుపుతో కోవిడ్-19 కారణంగా ఉపాధి లేక సతమత మవుతున్న బాధితులకు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనునిత్యం ఆహార పంపిణీ జరగుతోందన్నారు.లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి చవటపాలెం,చిల్లకూరు ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా ఆహారం అందిస్తున్నామన్నారు.కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కవ అయినందున ప్రజలు అధికార యంత్రాంగం తెలిపిన సూచనలు పాటించి జాగ్రత్త పడాలనీ సూచించారు.ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు చేగువేరా టీమ్ శక్తివంచన లేకుండా పనిచేస్తుందన్నారు.ఈ కార్య కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతికుమార్. మదురెడ్డి,ఆన్సర్ భాష,నరేష్ రెడ్డి మరియు పైలట్ టీమ్ వినోద్,పవన్,భాస్కర్,అజయ్, సంతన్, సాయి మహేష్,లక్ష్మి నారాయణ,తరుణ్ తదితరులు పాల్గొన్నారు*