ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కేంద్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల సలహా మండలి సభ్యుని లేఖ

*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి* గారికి నమస్కరించి వ్రాయు బహిరంగ లేఖ...


*కేంద్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సలహా మండలి* అధ్యక్షులు *వి.శ్రీ నివాసులు నాయుడు*..


*విషయం:* కరోనావైరస్ కట్టడి చర్యలు బాగంగా లాక్ డౌన్ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్ధిక సహాయం భవన నిర్మాణ కార్మికులకు  అందజేయాలని కోరుతూ...


కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశ వ్యాప్తంగా అనుసరిస్తున్న లాక్ డౌన్ ఎంతో శ్రేయస్కరమైనది. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఎంతో కట్టుదిట్టంగా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అమలు చేస్తున్న తీరు ప్రశంసనీయం. 


కాని నిత్యం రెక్కాడితే గాని, డొక్కాడని పేద, మధ్యతరగతి ప్రజలలో చాలా మంది సగటు కూలీలుగా ఎక్కువ శాతం భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగాలలో పని చేస్తూ వున్నారు. అసలే పనులు కరువై ఈ మధ్య నెలలో సగం దినాలు కూడా సరైన పని దొరక్క పస్తులుండే పరిస్థితులనే కార్మికులు ఎదుర్కొంటున్నారు.  మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు, లాక్ డౌన్ మూలంగా మరింత సంక్షోభంలోకి వారి జీవితాలను నెట్టివేసినట్టైంది. ఎలాగైనా వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం వుంది.
కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు
31000 వేలకోట్ల రూపాయులు కేటాయింపు చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భవన నిర్మాణ కార్మికులుకు ఇంకా సంక్షేమ మండలి భోర్డు నుండి వారికి ఏలాంటి సహాయం అందలేదని రాష్ట్రంలోని గుర్తింపు పోందిన యునియన్లు వారు నా దృష్టికి తీసుకువచ్చారు.


భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నిధిలో వసూలు
సెస్సు డబ్బు ఉండగా, వారి కోసం మాత్రమే కర్చు చేయాల్సిన డబ్బు వారికి ఇవ్వడానికి మీకు ఏ అవరోధాలు ఏర్పడుతున్నాయి?


గతంలో వివిధ కార్పొరేషన్ నిధులు నవరత్నాలు అమలుకు  తరలించినట్లు భవన నిర్మాణం కార్మికుల సంక్షేమ నిధి డబ్బు అంతా వాడేశారా?


స్వయానా కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు భవన నిర్మాణ కార్మికుల నిధి లోని డబ్బును ఆ కార్మికుల సంక్షేమానికి వాడమని చెబితే ఎందుకు నిర్లిప్తత తో వ్యవహరిస్తున్నారు?
 
రిజిష్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు అకౌట్లు కార్మిక శాఖ దగ్గర ఉన్నప్పుడు ఏందుకు వారి ఖాతా ల లోకి ఇంతవరకు నగదు బదిలీ చేయడం లేదు?


పై ప్రశ్నలకు గౌరవ ముఖ్యమంత్రి 
*శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు* సమాధానం చెప్పాలి, వెంటనే భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరగాలి.
వారు ఆకలితో అలమటించకుండా వుండేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రతి కార్మికుడిని ఈ పరిస్థితి నుండి గట్టెక్కించాలి. వారిని ఆదుకునే క్రమంలో కార్మికుల సంక్షేమ మండలి బోర్డు లో నమోదు చేసుకున్న 20 లక్షల మంది కార్మికులుకు  జీవన భృతిని నేరుగా వారి ఖాతాలలో జమచేయాలి. 
అలాగే కార్మికుల సంక్షేమ మండలి బోర్డులో అనివార్య కారణలతో పేర్లు నమోదు కాని ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు,రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు మొత్తం సుమారు 30 లక్షల మంది ఉన్నారు. వారిని వాలెంటీర్ల ద్వారా గుర్తించి, అలాంటి వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం వుంది. అందుకోసం కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి  కార్మిక లోకాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను.
ఇట్లు
*వి.శ్రీ నివాసుల నాయుడు*
అధ్యక్షులు
*కేంద్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల సలహా మండలి*


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image