జర్నలిస్టుల కు అండగా ఉంటాం
పలువురికి నిత్యావసర వస్తువులు పంపిణీ
ప్రత్యేక వేతనం మంజూరు చేయాలని వినతి
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
గంట్ల శ్రీనుబాబు
విశాఖపట్నం... సమాజం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులకు అండగా ఉంటామని.. వారి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి .. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు... మంగళవారం ఇక్కడ బాలయ్య శాస్త్రి లేఔట్ లో పలువురు జర్నలిస్టులకు.. సంపాదకులకు.,న్యూస్ ప్రెజెంటర్స్ కు తాను సొంతంగా సమకూర్చిన నిత్యవసర వస్తువులను శ్రీనుబాబు చేతులు మీదుగా అందజేశారు.,, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టులకు తన వంతు చేయూతను అందించాలని భావించానన్నారు... ఇప్పటి వరకూ తన సొంత నిధులతోనే నాలుగు విడతలుగా జర్నలిస్టులకు నిత్యవసర వస్తువులు అందజేశామన్నారు,.. .. ఇప్పటివరకూ 306 మందికి , తాను సాయం అందించడం జరిగిందన్నారు,.. ఈ కార్యక్రమంలో గంట్ల హర్షవర్ధన్... పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు
జర్నలిస్టుల కు అండగా ఉంటాం :గంట్ల శ్రీనుబాబు