ప్రజలతో మమేకంమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అంతిమతీర్పు.23.8.2019


*నియోజకవర్గ ప్రజలతో మమేకమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


* సొంత నియోజకవర్గం ఆత్మకూరులో ప్రజల కష్టాలు తీర్చేందుకు తీరిక లేకుండా గడిపిన మంత్రి  


* శ్రీ కృష్ణాష్టమి రోజున కృష్ణుడివలె ఆపదలు తీర్చేందుకు మంత్రి తమ ఇంటికి వచ్చినట్లుందని ఆనందబాష్పాలు


* రెండు రోజులు  వాడవాడలా కలియతిరిగి..గడపగడపను పలకరించి, అప్పటికప్పుడే సమస్యలకు పరిష్కారం 


* 'ఎంజీఆర్ హెల్ప్ లైన్'కు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు.. పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు



 నెల్లూరు, ఆగస్ట్,23 ; సొంత నియోజకవర్గం ఆత్మకూరులో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు రోజులపాటు ఊరూర కలియతిరిగారు. వాడవాడలా పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. ముఖ్యమంత్రి నవరత్నాల అమలుతో అందరి సమస్యలు త్వరలోనే నతీరుతాయని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజలకు భరోసానిచ్చారు.  సంక్షేమం, అభివృద్ధి రెండింటిలో  ఆత్మకూరు నియోకవర్గాన్ని ముందుకు నడిపిస్తానని మంత్రి స్పష్టం చేశారు. మాటల్లో కాకుండా చేతలతోనే మీకు  చూపించేందుకే ఎంజీఆర్ హెల్ప్ లైన్ కి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు. నియోజకవర్గంలో ఎవరు ఎలాంటి  ఇబ్బందులను చెప్పినా , ఫిర్యాదులు చేసినా ఆ సమస్యలను తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రెండు రోజుల్లో రెండు మండలాల్లోని ప్రజలను కలుసుకుని ఫిర్యాదులపై చర్యలకు ఉపక్రమించారు.


 నియోజకవర్గంలోని ఏ. యస్. పేట మండలం పొనుగోడు, రాజవోలు, దూబగుంట ఎస్.సి , ఎస్టీ కాలనీలలోని అంగన్ వాడీ భవనాలను పరిశీలించారు. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులను పలకరించి చేయి పట్టుకుని నడుస్తూ పౌష్టికాహారం, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉన్నా వృద్ధాప్య పింఛన్ అందడం లేదని వాపోయిన వారికి వచ్చే నెల నుంచే పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టాలని వారి వివరాలను వెంటనే నమోదు చేసే ప్రక్రియను స్థానిక వాలంటీర్ ద్వారా మంత్రి పూర్తిచేయించారు.   


ఏ.ఎస్ పేట మండలంలోని పొనుగోడు గ్రామంలో ఎస్టీ కాలనీ రచ్చ బండపై కూర్చొని గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. వీధి దీపాలు లేవని, ఉన్న చోట కూడా కొన్ని వెలగడం లేదని గ్రామ ప్రజలు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీధి దీపాల సమస్య పరిష్కారానికి అధికారులకు కావలసిన గడువు ఇచ్చి  ఇచ్చిన ఆ గడువులోగా సమస్యను పరిష్కరించాలని వారికి ఆదేశాలిచ్చారు. గురువారం ఆత్మకూరు మండలంలోని వెన్నవాడ, వాసిలి, నెల్లూరు పాలెం తదితర గ్రామాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. కనపడిన ప్రతి మనిషిని పలకరించి ..సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కూడా అదే పంథాలో పర్యటన కొనసాగించారు. ఏ.యస్ పేట మండలం పొనుగోడు, రాజవోలు, దూబగుంట ప్రాంతాలలో పర్యటించి జనంతో కలిశారు. దూబగుంటలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేస్తూ హత్తుకున్నారు. కాలనీలోని రచ్చబండ వద్ద కూర్చుని ఓపికగా వారి సమస్యలు విన్నారు. త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు.


'ఎంజీఆర్ హెల్ప్ లైన్' ద్వారా ప్రజల ఫిర్యాదులను తీసుకుని వాటిని ఆయనే నేరుగా పరిష్కరించేందుకు  స్వయంగా రావడంతో జనం మనసారా స్వాగతం పలికారు. అధికారులు, వాలంటీర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులను వెంట పెట్టుకుని మంత్రి రావడమే కాక‌, కొన్ని సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించడం పట్ల  వారు హర్షం వ్యక్తం చేశారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image