వైసిపి వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3నుంచి టిడిపి ప్రత్యక్ష కార్యాచరణ: చంద్రబాబు
మంగళవారం నుంచి గుంటూరులో వైసిపి బాధితుల పునరాశ్రయ శిబిరం
పల్నాడుతో సహా ఇతర ప్రాంతాల బాధితులు అందరికీ ఆశ్రయం కల్పిస్తాం
బాధితులు అందరికీ గుంటూరు శిబిరంలో రక్షణ కల్పిస్తాం. ఆశ్రయం కోల్పోయిన వారికి ఆశ్రయం కల్పిస్తాం.
గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా శిబిరాల్లోనే బాధితులు. నేనే దగ్గరుండి బాధితులను ఆయా గ్రామాలకు తోడ్కొని వెళ్తాను.
ఇళ్లపై దాడులు చేస్తున్నారు, భూములు సాగు చేయనివ్వకుండా అడ్డం పడుతున్నారు. గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు.
మనది స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం. పౌరులు అందరికీ నివసించే హక్కు ఉంది. అందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అలాంటిది నివసించే హక్కును కాలరాస్తారా..? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తారా..? అధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేస్తారా..?
బాధితులు అందరికీ న్యాయపరంగా రక్షణ కల్పిస్తాం.
వేధింపులకు నిరసనగా సెప్టెంబర్3 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ