గత 5 ఏళ్ళూ అమరావతి, పోలవరం భజన చేసి చంద్రబాబు ఓడారు

అమరావతి
ఆగస్టు 28, 2019                                                                                                                                                                                                                 
*రాజధాని అమరావతి, పోలవరంపై సెక్రటేరియేట్ లో మీడియాతో మంత్రి కొడాలి నాని కామెంట్స్*
*- గత 5 ఏళ్ళూ అమరావతి, పోలవరం భజన చేసి చంద్రబాబు ఓడారు*
*- మళ్ళీ అదే భజన చేస్తే..  టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు*
*- రాజధాని మారుస్తామని శ్రీ వైయస్ జగన్ ఎక్కడా చెప్పలేదు*
*- పోలవరం ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదు*
*- పోలవరం, అమరావతితో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలు మాకు ప్రధానమే*
*-  రాజధాని అంశంలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశామనడం కరెక్ట్ కాదు..*
*- బాబు మాటలు వింటుంటే.. మరి ఆ సామాజికవర్గం కోసమే అక్కడ కట్టారా..* 
*- ఒక కులాన్నో.. మతాన్నో.. ప్రాంతాన్నో దృష్టిలో పెట్టుకొని శ్రీ జగన్ పాలన చేయరు*
*- 13 జిల్లాల అభివృద్ధే మాకు ముఖ్యం..*
-  రాజధానిని మారుస్తామని.. పోలవరం ప్రాజెక్టును నిలిపేస్తామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఎక్కడా చెప్పలేదని, దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. 
- ఈరోజు సచివాలయంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా అమరావతి, పోలవరంపై ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు. 
-  గత ఐదేళ్లుగా కేవలం అమరావతి-పోలవరం భజన చేయడం వల్లే చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018లో నీళ్లు ఇస్తాం.. అని రాసుకో అని అన్నారు. 5 ఏళ్ళ  పాలన పూర్తైన తర్వాత కూడా అవే మాటలు చెప్పారు. దాంతో ప్రజలు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు. 
-  మళ్లీ ఇప్పుడు చంద్రబాబు అదే భజన చేస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
-  గత ఐదేళ్లు పగలంతా పోలవరం.. మధ్యాహ్నం అమరావతి అన్నట్టుగానే చంద్రబాబు వ్యవహరించారు. అమరావతిని బ్యాంకాక్ చేస్తా.. సింగపూర్ చేస్తానంటూ రాష్ట్రంలోని సమస్యలు, ప్రజల కనీస అవసరాలు గాలికొదిలేశారన్నారు.
- పోలవరం, అమరావతి భజనను చంద్రబాబు ఆపకుంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒక్కటి కూడా టీడీపీ గెలవదని అన్నారు. 
- ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు సమీక్షించకుండా..  ఇంకా అమరావతి-పోలవరం భజనను చంద్రబాబు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అతిదారుణంగా  చంద్రబాబును ప్రజలు ఓడించారు. ఈ భజన ఆపకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని కొడాలి నాని.. వ్యాఖ్యానించారు.
- పోలవరం ఆపుతామని సీఎం శ్రీ వైయస్ జగన్ ఎక్కడా చెప్పలేదన్నారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్తాం.. కాకపోతే 3నెలలు, 4 నెలలు ఆలస్యం అవుతుంది. ప్రాజెక్టు పేరుతో..  రాష్ట్ర ఆదాయాన్ని గత పాలకులు దోచుకున్నారు. దాన్ని అరికట్టడానికే రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్నామని అన్నారు. 
- రాజధానిపై అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, వీటిని సమీక్షించుకొని ముందుకువెళ్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారని కొడాలి గుర్తు చేశారు.  
- చంద్రబాబు వైఖరి ఇదే విధంగా ఉంటే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కూకటివేళ్లతో పెకలించుకుపోతుందని కొడాలి నాని తెలిపారు. 
- పోలవరం-రాజధానులతో పాటుగా ఇతర జిల్లాల అభివృద్ధీ మాకు ముఖ్యమని.. ఈ రెండింటిని పట్టుకుని వేలాడి మిగిలిన ప్రాంతాలను గాలికొదిలేయలేమని నాని అన్నారు.
- మరోవైపు ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుని రాజధానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామనేది పూర్తిగా అవాస్తవం అని ఆయన కొట్టిపారేశారు. 
- ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారనే విషయం ప్రతిపక్షం చెబితే.. రాజధానిలో ఆ వర్గానికే ప్రాధాన్యతనిచ్చారని చంద్రబాబే రాజముద్ర వేసినట్టు కాదా..? అని కొడాలి ప్రశ్నించారు. 
-ఒక కులాన్నో, మతాన్నో, పార్టీనో దృష్టిలో పెట్టుకొని సీఎం శ్రీ వైయస్ జగన్ పనిచేయటం లేదు. 13 జిల్లాలు మాకు సమానమే అని నాని తెలిపారు.  - పోలవరం, అమరావతితో పాటు మారుమూల అభివృద్ధికి దూరంగా ఉన్న శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు కూడా అంతే అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వం ఉద్దేశం అని కొడాలి నాని స్పష్టం చేశారు. 
- రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రలను కూడా ఎలా అభివృద్ధి చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తోందని కొడాలి నాని తెలిపారు. 
- చంద్రబాబులా బుద్ధి తక్కువ పనులు చేయం. చంద్రబాబులా జనాలు తిరస్కరించే పరిస్థితి తెచ్చుకోమని మంత్రి కొడాలి నాని తెలిపారు.
*ప్రజలు తినే నాణ్యమైన బియ్యం పేదలకు ఇస్తాం..*
- ప్రజలకు తినేవిధంగా నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు తెలిపారు. సన్నబియ్యం అంటే పలావు బియ్యం, బాస్మతి బియ్యం  ఇచ్చే లభ్యత మనవద్ద లేదు. సన్న బియ్యమని మేము ఎక్కడా చెప్పలేదు. స్వర్ణా, బీపీటీ వంటి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.
- పీడీఎస్ ద్వారా సేకరించిన బియ్యంలో మనకు 27లక్షల టన్నులు సరిపోతాయి. అయితే, ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం నుంచి పేదలకు రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నాం.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image