అంతిమతీర్పు. ఢిల్లీ తేదీ.. 24.08.2019
విజయవాడకు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు శ్రీమతి. డా. అపర్ణ ప్రసాద్ "నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ" జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
శనివారం ఢిల్లీ ఏపీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్. వేణుగోపాలచారి చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు.
కూచిపూడి నాట్యరంగంలో ఆమె చేసిన విశేషమైన కృషికి గుర్తింపు గా ఈ అవార్డ్ ఢిల్లీ నార్త్ కల్చరల్ అకాడమీ వారు బహుకరించారు.
ఢిల్లీ ఏపీ. భవన్ నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ.S. వేణుగోపాలచారి, సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి
జస్టిస్. మధుసూదన్ రావు, ఎన్డిసిఏ సంచాలకులు డా. బి.నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.