ఆంధ్రలో బలపడేదెలా?


 నేడు హైదరాబాద్‌లో బీజేపీ చింతన్‌ బైఠక్‌
 సతీశ్‌, రామ్‌మాధవ్‌ సహా 15 మంది నేతలు హాజరు
రాజధాని, పోలవరం, వలసలపై ప్రధానంగా చర్చ
 వైసీపీని ఎదుర్కోవడంపై దృష్టి
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించేందుకు శనివారం హైదరాబాద్‌లో బీజేపీ సీనియర్‌ నేతల చింతన్‌ బైఠక్‌ జరగనుంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి వి.సతీశ్‌, మరో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, జాతీయ కార్యదర్శులు సునీల్‌ దేవధర్‌, వైసత్యకుమార్‌తో పాటు బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌, రాష్ట్ర నేతలు కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరితోపాటు దాదాపు 15 మంది ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఆంధ్రలో బీజేపీని బలోవేతం చేయడం.. వైసీపీని ఎదుర్కోవడం.. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడం.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై అనుసరించాల్సిన వైఖరి మొదలైన అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. రాజధానిని మార్చడం, పోలవరంపై పార్టీ నేతలు రకరకాలుగా మాట్లాడడం సరైంది కాదని, వీటిపై నిర్దిష్టమైన వైఖరిని అవలంబించాలని పార్టీలో పలువురు నాయకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా శంకు స్థాపన చేసి నిధులు విడుదల చేసిన రాజధాని ప్రాజెక్టును కేంద్రంతో చర్చించకుండా విస్మరించడమే గాక.. తమ నిర్ణయాలకు ప్రధాని ఆశీస్సులున్నాయని చెప్పడం, దానిపై కన్నా, సుజనాచౌదరి తీవ్రంగా స్పందించడం తెలిసిందే. కేంద్రం పూర్తిగా నిధులు సమకూరుస్తున్న పోలవరం ప్రాజెక్టు టెండర్లను కూడా జగన్‌ ఏకపక్షంగా రద్దు చేయడంపై ఈ సందర్భంగా చర్చించే అవకాశాలున్నాయి. అసలీ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి ఆ ఘనతను మోదీ దక్కించుకోవాలని కూడా కొందరు పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. ఇక వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్న తీరును ఎదుర్కొనేందుకు బీజేపీ సొంతంగా ముందుకురావాలని, అప్పుడే ఒక ప్రతిపక్షంగా బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు అంటున్నారు. దాదాపు 80 శాతంపైగా హిందువులు ఉన్న రాష్ట్రంలో మైనారిటీ లకు అనుకూలంగా తీసుకునే చర్యలను కూడా ఎండగట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలనే గాక బీసీలు, కాపులు, దళితులు, గిరిజనులను బీజేపీ వైపు తిప్పుకొనేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని, ఈ వర్గాల్లోని ముఖ్య నేతలను బీజేపీకి ఆహ్వానించాలని కూడా కమలనాథులు భావిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీతో బీజేపీకి అవగాహన ఉందనే అభిప్రాయాన్ని జనంలో పోగొట్టాలని, పార్లమెంటులో బిల్లులపై వారు సహకరించడానికీ, పార్టీ రాజకీయాలకూ ముడిపెట్టకూడదని వారు భావిస్తున్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image