రూ.19,20,000 విలువగల కార్లు,మోటార్ బైక్ ల దొంగలను పట్టుకున్న భవనీపురారం పోలీసులు

అంతిమతీర్పు.24.8.2019


పత్రికా ప్రకటన
తేది. 24-08-2019. 1) పోలీస్ స్టేషన్ 
భవానీపురం 2) క్రైమ్ నెంబర్, సెక్షన్ ఆఫ్ లా
373, 431,527&5512019, సెక్షన్ 379
ఐపిసి 3) నేరస్థలం
భవానీపురం పోలీస్ పరిధిలో 4) విచారణ అధికారులు మరియు సిబ్బంది : భవానీపురం ఇన్ స్పెక్టర్ శ్రీ డి.మోహన్ రెడ్డి
క్రైమ్ ఎస్.ఐ శ్రీ వి.కృష్ణబాబు మరియు సిబ్బంది ఎమ్.డి.మస్తాన్ (హెచ్ సి-1526), కె.శ్రీనివాసరావు (హెచ్సి-446), కె.నాగేంద్ర
(హెచ్సి-625)డి.నాగేంద్ర (పిసి-2817), 5) నేర పరిసోధన
: నేరస్థలంలో దొరికిన ఆధారాలు, సిసిటివి ఫుటేజ్
మరియుటవర్ డేటా 6)అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు :1) కృష్ణాజిల్లా, ఘంటసాలకు చెందిన తాతా ప్రసాద్
అలియాస్ మామిళ్ళపల్లి సెసిధర్.(35 సం||) 2)విజయవాడ, భవానీపురం, ఆర్.టి.సి వర్క్షాపు
రోడ్డుకు చెందిన నామాల నాగరాజు.(27 సం||) 3) కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట మండలం, గౌరవరంకు | చెందిన బానావత్ సురేష్ (28 సం||) 4) కృష్ణాజిల్లా, కంచికచర్ల మండలం, హనుమాన్ పేటకు
చెందిన దొడ్డక గోవర్ధన్. (25 సం||) 5) తమిళనాడు రాష్ట్రం, దిండిగల్ జిల్లా, తాడిగొంబుకు
చెందిన పెరియాస్వామి మారిముత్తు, (38సం.) 7) స్వాధీనం చేసుకున్న సొత్తు
: రూ.19,20,000/- విలువగల 10 కార్లు, 3మోటారు
సైకిళ్ళు 8) నేరం చేసే విధానం
: పగటి మరియు రాత్రి సమయాల్లో కార్లలో సంచరిస్తూ పార్క్చేసి ఉన్న కార్లను మరియు బైక్లను నిశితంగా పరిశీలించి ఎవరికీ అనుమానం రాకుండారాత్రి సమయంలో కారు సైడు ఉన్నటువంటి అద్దాలను పగులగొట్టి కారు దొంగతనాలను మరియు బైకులకు వేసిన హ్యాండిల్ లాక్ ను విరగకొట్టుట ద్వారా నేరాలకు పాల్పడతారు.
అంతరాష్ట్ర కార్లు మరియు మోటారు సైకిళ్ళ చోరీలకు పాల్పడిన ఐదుగురు ముఠా
సభ్యులు అరెస్ట్ వారి వద్ద నుండి 13 కేసుల్లో సుమారు రూ. 19.20లక్షల విలువ చేసే 10 కార్లు, 3మోటారుసైకిళ్ళు స్వాధీనం
ఈ మధ్య కాలంలో నగరంలో జరుగుతున్న దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ సి. హెచ్.ద్వారకా తిరుమలరావు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, దొంగతనాల నియంత్రణ నిమిత్తం పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్థులు, జైలు నుండి విడుదలైన నేరస్తులు మరియు అనుమానాస్పద వ్యక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో వినూత్నంగా ప్రవేశపెట్టిన చేరువ వాహనాల ద్వారా ప్రజలకు వివిధ నేరాల గురించి అవగాహన కలిగించి వారిని అప్రమత్తం చేయడం ద్వారా నేరాల నియంత్రణకు కృషి చేయడం జరుగుతుంది.
ఈ నేపధ్యంలో విజయవాడ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పార్కింగ్ చేసిన కార్లను మరియు మోటారు బైక్ల దొంగతనాలకు పాల్పడిన నిందితుల గురించి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి లా ఆర్డర్-2 డిసిపి శ్రీ విజయరావు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఏడిసిపి-2 శ్రీ ఎల్.టి. చంద్రశేఖర్ గారు మరియు వెస్ట్ జోన్ ఏసిపి శ్రీ సుధాకర్ గారి స్వీయ పర్యవేక్షణలో భవానీపురం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ శ్రీ డి.మోహన్ రెడ్డి, భవానీపురం ఎస్.ఐ శ్రీ కృష్ణ బాబు మరియు సిబ్బందితో అందిన సమాచారం మేరకు ది.23.08.2019న విజయవాడ, భవానీపురం మైలురాయి సెంటర్ వద్ద అనుమానంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image