ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాం:అజయ్ కలామ్


తేది : 09-09-2019
అమరావతి


•  ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాం : సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం


•  ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తాం: పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్


•  సచివాలయ ఉద్యోగాల ప్రశ్నాపత్రంలో 25శాతం మాత్రమే కఠినంగా ఉంది  : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది


•  ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం: పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్



ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాం: ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం


గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాల ఏర్పాటు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లాం అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ,  తక్కువ సమయంలో ఒకేసారి లక్షా 34 వేల ఉదోగాలు భర్తీ చేయడం ఒక రికార్డు అన్నారు. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించాలని, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని మరోసారి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ.. రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు.   పరీక్షల నిర్వహణలో ఎవరూ కలగజేసుకోకుండా పకడ్భంధీగా నిర్వహించామని తెలిపారు. అందరూ హర్షించే విధంగా పరీక్షలను నిర్వహించడం అద్భుతమన్నారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది , పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్, అధికారులు, సిబ్బంది తదితరుల సహాయంతో పరీక్షలు పకడ్భందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించగలిగామన్నారు. గతంలో మాదిరి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా  పరీక్షలు సాఫీగా నిర్వహించగలడం చరిత్ర అన్నారు.


ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తాం: పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్


క్షేత్రస్థాయి నుండి పై స్థాయి వరకు అధికారులు, సిబ్బంది కష్టపడటం వల్ల, బాధ్యతగా ఉండటం వల్ల పరీక్షను సమర్థవంతంగా నిర్వహించగలిగామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ పేర్కొన్నారు. నవరత్నాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు  రాష్ట్రంలోని 5,314 పరీక్షా కేంద్రాల్లో  గ్రామసచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన పరీక్షలకు వివిధ కేటగిరీల్లో 21.69 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆరు రోజుల పాటు పరీక్షలు సమర్థవంతంగా  నిర్వహించామన్నారు. 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. అభ్యర్థుల రవాణ సౌకర్యం కోసం 6వేల బస్సులను ఉపయోగించామన్నారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచామని, జిల్లా కేంద్రాలలో ఓఎమ్మార్‌ షీట్ల స్కానింగ్‌ చేపడుతున్నామన్నారు.. ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తామని గిరిజా శంకర్‌ పేర్కొన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు నిర్వహించగలిగామన్నారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారిచామని, గ్రామ సచివాలయాలకు సంబంధించిన పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలు సెప్టెంబర్ 20వ తేదీలోగా వెల్లడిస్తామని చెప్పారు. ఎలక్షన్ తరహాలో పరీక్షలు పకడ్భంధీగా నిర్వహించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి దిశా నిర్దేశాల ప్రకారం రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా వారి గుమ్మం ముంగిటే అందచేయటానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలను తెచ్చారన్నారు. క్రొత్తగా ఏర్పాటుచేసే 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు సుమారు 35 రకాల సేవలతో అక్టోబర్ 2 నుండి అమలులోకి తీసుకొని రావటానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.. అభ్యర్ధుల ఎంపిక  ప్రక్రియ వ్రాత పరీక్షా  ఫలితాల  మెరిట్ ఆధారితంగానే వుంటుందని స్పష్టం చేశారు.  పరీక్షలకు సంబంధించి విడుదల చేసిన “కీ” కు సంబంధించిన అభ్యర్థుల నుండి 52 వేల అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఒకే ప్రశ్నకు 2 నుండి 3 వేల అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి, సహకరించిన అభ్యర్థులకు, పరీక్షల విధానంపై అనుక్షణం అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించిన మీడియాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు
సచివాలయ ఉద్యోగాల ప్రశ్నాపత్రంలో 25శాతం మాత్రమే కఠినంగా ఉంది  : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది


పరీక్ష ప్రశ్నపత్రాల తయారీలో ఏపీపీఎస్సీ ప్రమాణాలనే పాటించామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరిగిందని తెలిపారు. ప్రశ్నపత్రాలు కఠినంగా వచ్చిందని పలువురు అభ్యర్థులు చర్చించుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పరీక్ష ప్రశ్నపత్రాల తయారీలో ఏపీపీఎస్సీ ప్రమాణాలనే పాటించామని తెలిపారు. కఠినంగా  25 శాతం, తేలికైనవి 25 శాతం, సాధారణ ప్రశ్నలు 50 శాతం ఉండేలా ప్రశ్నాపత్రాలు రూపొందించామని వెల్లడించారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరగలేదన్నారు. ఇదొక రికార్డన్నారు. పరీక్షలను చాలా పకడ్భంధీగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికను తయారు చేసుకున్నామన్నారు. అందుకనుగుణంగానే కష్టపడి పని చేశామని తెలిపారు. తమకు ఏపీపీఎస్సీ, ఎస్సీఈఆర్టీ, ఏపీపీఎఫ్ఎస్ఎస్, టాటాటెక్ లాంటి పలు సంస్థలు దోహదపడ్డాయని తెలిపారు. అత్యంత వేగంగా ప్రశ్నాపత్రాల స్కానింగ్‌ చేపట్టామని, ఈనెల 20లోపు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. జిల్లాలవారిగా మెరిట్‌ లిస్ట్‌ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, 1500 చోట్ల సచివాలయ భవనాలను నిర్మిస్తామని ద్వివేది పేర్కొన్నారు..పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ ఆలోచనలకు, అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించడంలో మీడియా పాత్ర ప్రశంసనీయమన్నారు. సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తడం సంతోషంగా ఉందన్నారు.


ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం: పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్


అందరి సహకారం వల్లే సచివాలయ పరీక్షలను ప్రశాంతంగా ముగిశాయని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. తమపై నమ్మకంతో ప్రభుత్వం అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులు, సిబ్బంది, మీడియా ఇలా అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్ల పరీక్షల నిర్వహణ విజయవంతమైందన్నారు. ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని ఆయన వెల్లడించారు. పారదర్శకంగా, స్వేచ్ఛగా పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి సూచనల మేరకే తాము ఇంత విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఇప్పటిదాకా యూపీఎస్సీ స్థాయిలోనే 14 లక్షల మంది పరీక్షలు రాసిన రికార్డు ఉండేది. హాజరుశాతం కూడా 50 శాతంగా ఉండేది. కానీ దేశంలోనే తొలిసారిగా 20 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాయడం, 88 శాతంకు పైగా హాజరు అవడం రికార్డు అని అభివర్ణించారు.ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించడం గొప్ప విజయంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలతో పాటు  కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారన్నారు. ప్రతిరోజూ 3.50 లక్షల పేపర్లను (ఓఎమ్ఆర్) స్కానింగ్ చేస్తూ ఇప్పటికే స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి, సహకరించిన అభ్యర్థులకు, పరీక్షల విధానంపై అనుక్షణం అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించిన మీడియాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 20 నాటికి అభ్యర్థులకు మార్కులతో పాటు ర్యాంకింగ్ ను విడుదల చేస్తామన్నారు. మార్కులు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image