ఉర్దూ ఆకాడిమీ వస్తున్న ఆరోపణల ఫై విచారణ జరపాలి ..
నౌమాన్, జాఫర్ లు తమ బతుకులతో ఆడుకుంటున్నారు
ఉర్దూ అకాడమీ ఉద్యోగస్తుల ఆవేదన ఆందోళన .
ముఖ్య మంత్రి వైస్ జగన్ దృష్టికి తీసుకోని వెళ్తా మాజీ ఎమ్మెల్సీకి రెహమాన్
బాధిత ఉద్యోగులను భరోసా ఇచ్చిన రెహమాన్ ..
విజయవాడ : మొగల్రాజపురం లోని కె స్ట్రీట్ హోటల్ లో బుధవారం నాడు ఉర్దూ అకాడమీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్యోగస్తులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మహమ్మద్ ఉమ్మర్ గారి మాట్లాడుతూ ఉర్దూ అకాడమిలో పనిచేస్తున్నఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలనిఅన్నారు
ఈ కార్యక్రమంలో MLC కత్తి నరసింహ నరసింహరెడ్డి గారు మాట్లాడుతూ జి.ఓ నెం.12, 24 ప్రకారం ప్రతి ఒక్కరికి మినిమమ్ స్కెల్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు
రాష్ట్రంలో 73 ఉర్దూ సెంటర్ లో పనిచేస్తున్న 177 మందికి పెంచిన జీతాలు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారాని తెలిపారు .
ఉర్దూ అకాడమిలో పనిచేస్తున్న వారికి ఉద్యోగభద్రత కల్పించాలని, ఈ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఒకకమిటీ వేశారు అని. ఆ కమిటీలో ఉర్దూ అకాడమి ఉద్యోగులకు న్యాయము జరిగేలా చూస్తామనిఅన్నారు
రాష్ట్రప్రభుత్వం, ఉర్దూ అకాడమీ అధికారులు వీరికి పెంచినజీతాలు వెంటనే చెల్లించాలని.. అన్నారు
వీరిని శాశ్వత ప్రాతిపదికనఉద్యోగుల గా పరిగణనలోకి తీసుకోవాలని..కోరారు
ఉర్దూ అకాడమీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని.. అలాకాకుండా ఉర్దూ అకాడమీని గ్రామాల్లో కూడా తీసుకొని వెళ్లి నైపుణ్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు ..
రెండు రోజులలో ముఖ్యమంత్రి గారిని, సంబంధించిన మంత్రి గారిని, ఉర్దూ అకాడమీలో ఉన్న ఉన్నతఅధికారులు దృష్టిలోకి మీ సమస్య తీసుకొని పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు అనంతరం ఫారూఖ్ శుబ్లీ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ అకాడమి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టిలో తీసుకొని వెళతామని..
ఉర్దూ అకాడమిలో జరుగుతున్నఅవినీతిపై అధికారులు దృష్టి పెట్టాలని.కోరారు .
ఉర్దూ అకాడమీకి సం.కు 20 నుండి 22 కోట్లు కేంద్రం నుండి రాగా, రాష్ట్రము నుండి 5 నుండి 10 కోట్లు ఉర్దూ అకాడమి అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది..అని కానీ
ఈ అకాడమిలో జాఫర్ అనే వ్యక్తి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటునన్నారు..
భవానిపురంలో ఉర్దూ అకాడమి పేరుతో ఉన్న SBI బ్యాంక్ అకౌంట్ ను కూడా క్లోజ్ చేశారు అని.దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచారణజరిపితే 100 కోట్లుపైగా
అవినీతి బయటపడే అవకాశం ఉందని..అన్నారు
ఉర్దూ అకాడమి చైర్మన్ నౌమాన్ గారు టీడీపీ పార్టీలో ఉండగా పదవి చేపట్టి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని భావించి 10 రోజులు ముందు వైసీపీ పార్టీలోకి మారడం జరిగిందని..ఇది రాజకీయ వ్యభిచారం కదా అని ప్రశ్నించారు
అంతరం సభ్యులు బందర్ రోడ్డులోని డివి మనోర్ హోటల్ బస చేస్తున్న మాజీ ఎమ్మెల్స్ రెహమాన్ 13 జిల్లా ల నుండి వచ్చిన ఉద్యో గస్థులు కలిసి తమ గోడు వేళా బోసుకున్నారు
వైసీపీ జాతీయ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోని వెళ్లవలిసిన
డిమాండ్లు..వినతి పత్రాన్నిఅందిచారు
1. ఉర్దూ అకాడమీ ప్రక్షాళన చెయ్యాలి.
2. ఉర్దూ అకాడమీ నిధుల దుర్వినియోగంపై అవినీతిపరులైన చైర్మెన్ నోమాన్ మరియు సూపర్డెంట్ జాఫర్ పై సమగ్ర విచారణ చేపట్టాలి.
3. గత 2018 ఏప్రిల్ మే మరియు జూన్ నెలల్లో చెల్లించినజీతాలను బకాయి లతో చెల్లించాలి.
4. గత 20 నెలలుగా బకాయి ఉన్నఉద్యోగుల EPF మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచెయ్యాలి.
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమి వైస్ ప్రెసిడెంట్ షాదిక్, ముస్లిం హక్కులు పరిరక్షణ సమితి రాష్ట్రఅధ్యక్షుడు ఫారూఖ్ శుబ్లీ, ఉపాధ్యాయ MLC కత్తి నరసింహ రెడ్డి, Md. సాదిక్ జనరల్ సెక్రెటరీ,అబీద్ వైస్ ప్రెసిడెంట్ మరియు 70 మంది ఉర్దూ అకాడమీ ఉద్యోగుల హాజరయ్యారు..