ఉర్దూ ఆకాడిమీ పై వస్తున్న ఆరోపణల ఫై విచారణ జరపాలి

ఉర్దూ ఆకాడిమీ వస్తున్న ఆరోపణల ఫై విచారణ జరపాలి ..
నౌమాన్, జాఫర్ లు తమ బతుకులతో ఆడుకుంటున్నారు 
ఉర్దూ అకాడమీ ఉద్యోగస్తుల ఆవేదన ఆందోళన .
ముఖ్య మంత్రి వైస్ జగన్ దృష్టికి తీసుకోని వెళ్తా  మాజీ ఎమ్మెల్సీకి రెహమాన్ 
బాధిత ఉద్యోగులను భరోసా ఇచ్చిన రెహమాన్ ..
   విజయవాడ  :     మొగల్రాజపురం లోని కె  స్ట్రీట్ హోటల్ లో బుధవారం నాడు  ఉర్దూ అకాడమీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్యోగస్తులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా  అధ్యక్షుడు మహమ్మద్ ఉమ్మర్ గారి మాట్లాడుతూ  ఉర్దూ అకాడమిలో పనిచేస్తున్నఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలనిఅన్నారు 


   ఈ కార్యక్రమంలో MLC కత్తి నరసింహ నరసింహరెడ్డి గారు మాట్లాడుతూ జి.ఓ నెం.12, 24 ప్రకారం ప్రతి ఒక్కరికి మినిమమ్ స్కెల్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు 


రాష్ట్రంలో 73 ఉర్దూ సెంటర్ లో పనిచేస్తున్న 177 మందికి పెంచిన జీతాలు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారాని తెలిపారు . 


ఉర్దూ అకాడమిలో పనిచేస్తున్న వారికి ఉద్యోగభద్రత కల్పించాలని, ఈ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఒకకమిటీ వేశారు అని. ఆ కమిటీలో ఉర్దూ అకాడమి ఉద్యోగులకు న్యాయము జరిగేలా చూస్తామనిఅన్నారు 


రాష్ట్రప్రభుత్వం, ఉర్దూ అకాడమీ అధికారులు వీరికి పెంచినజీతాలు వెంటనే చెల్లించాలని.. అన్నారు 


వీరిని శాశ్వత ప్రాతిపదికనఉద్యోగుల గా పరిగణనలోకి తీసుకోవాలని..కోరారు 


ఉర్దూ అకాడమీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని.. అలాకాకుండా ఉర్దూ అకాడమీని గ్రామాల్లో కూడా తీసుకొని వెళ్లి నైపుణ్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు ..


రెండు రోజులలో ముఖ్యమంత్రి గారిని, సంబంధించిన మంత్రి గారిని, ఉర్దూ అకాడమీలో ఉన్న ఉన్నతఅధికారులు దృష్టిలోకి మీ సమస్య తీసుకొని పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు  అనంతరం ఫారూఖ్ శుబ్లీ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ అకాడమి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టిలో తీసుకొని వెళతామని..


ఉర్దూ అకాడమిలో జరుగుతున్నఅవినీతిపై అధికారులు దృష్టి పెట్టాలని.కోరారు .


ఉర్దూ అకాడమీకి సం.కు 20 నుండి 22 కోట్లు కేంద్రం నుండి రాగా, రాష్ట్రము నుండి 5 నుండి 10 కోట్లు ఉర్దూ అకాడమి అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది..అని కానీ 


ఈ అకాడమిలో జాఫర్ అనే వ్యక్తి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటునన్నారు..


భవానిపురంలో ఉర్దూ అకాడమి పేరుతో ఉన్న SBI బ్యాంక్ అకౌంట్ ను కూడా క్లోజ్ చేశారు అని.దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచారణజరిపితే 100 కోట్లుపైగా 
అవినీతి బయటపడే అవకాశం ఉందని..అన్నారు 


ఉర్దూ అకాడమి చైర్మన్ నౌమాన్ గారు టీడీపీ పార్టీలో ఉండగా పదవి చేపట్టి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని భావించి 10 రోజులు ముందు వైసీపీ పార్టీలోకి మారడం జరిగిందని..ఇది రాజకీయ వ్యభిచారం కదా అని ప్రశ్నించారు
అంతరం సభ్యులు బందర్ రోడ్డులోని  డివి మనోర్ హోటల్ బస చేస్తున్న మాజీ ఎమ్మెల్స్ రెహమాన్ 13 జిల్లా ల నుండి వచ్చిన ఉద్యో గస్థులు కలిసి తమ గోడు వేళా బోసుకున్నారు 
వైసీపీ జాతీయ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్  ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకోని వెళ్లవలిసిన 
డిమాండ్లు..వినతి పత్రాన్నిఅందిచారు 


1. ఉర్దూ అకాడమీ ప్రక్షాళన చెయ్యాలి.


2. ఉర్దూ అకాడమీ నిధుల దుర్వినియోగంపై అవినీతిపరులైన చైర్మెన్ నోమాన్ మరియు సూపర్డెంట్ జాఫర్ పై సమగ్ర విచారణ చేపట్టాలి. 


3. గత 2018 ఏప్రిల్ మే మరియు జూన్ నెలల్లో చెల్లించినజీతాలను బకాయి లతో చెల్లించాలి.  


4. గత 20 నెలలుగా బకాయి ఉన్నఉద్యోగుల EPF మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచెయ్యాలి.
 ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమి వైస్ ప్రెసిడెంట్ షాదిక్, ముస్లిం హక్కులు పరిరక్షణ సమితి రాష్ట్రఅధ్యక్షుడు ఫారూఖ్ శుబ్లీ, ఉపాధ్యాయ MLC కత్తి నరసింహ రెడ్డి,  Md. సాదిక్ జనరల్ సెక్రెటరీ,అబీద్ వైస్ ప్రెసిడెంట్ మరియు 70 మంది ఉర్దూ అకాడమీ ఉద్యోగుల హాజరయ్యారు..


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image