సర్వం సిద్ధం

సర్వం సిద్ధం
10 లక్షల మంది వస్తారని అంచనా
మూడు షిఫ్ట్‌ల్లో ఉద్యోగుల సేవలు
ఏడు జోన్లుగా పారిశుధ్య పర్యవేక్షణ
24 గంటలూ అందుబాటులో
11 ప్రాంతాలలో పార్కింగ్‌
రొట్టెల పండుగ ఏర్పాట్లపై కమిషనర్‌ మూర్తి
నెల్లూరు  : నెల్లూరులో ప్రతిష్ఠాత్మకంగా జరిగే రొట్టెల పండుగకు సుమారు 10 లక్షల మంది భక్తులు హజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని నగర పాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి తెలిపారు.  దర్గా వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అనంతరం  వివరాలు వెల్లడించారు. 14వ తేదీ వరకు సాగే పండుగలో రొట్టెలను పట్టుకునేందుకు దేశవిదేశాల నుంచి యాత్రికులు వస్తారని, మత సామరస్యానికి ప్రతీక అయినా ఇలాంటి పండుగ మరెక్కడా లేదన్నారు. 
షిఫ్ట్‌కు 300 మంది ఉద్యోగులు : భక్తులకు సేవలు అందించేందుకు కార్పొరేషన్‌ తరపున మూడు షిఫ్టుల్లో అధికారులు, సిబ్బందిని కేటాయించామని కమిషనర్‌ చెప్పారు. షిఫ్ట్‌కు 300 మంది చొప్పున వీరంతా 24 గంటలూ అందుబాటులో ఉంటారని, ప్రతి షిఫ్ట్‌కు డ్రస్‌ కోడ్‌ కూడా విడివిడిగా డిజైన్‌ చేశామని తెలిపారు. అలాగే తాగునీటి కోసం స్టాల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. దర్గా ప్రాంతాన్ని ఏడు జోన్లుగా విభజించి పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. కాగితం కింద పడినా వెంటనే ఏరివేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. అలాగే 240 శాశ్వత మరుగుదొడ్లను అందుబాటులో ఉంటాయని వాటికి రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం కల్పించామన్నారు. ఆ నీళ్లు ఫినాయిల్‌తో కలిసి సరఫరా అవుతాయని చెప్పారు. పుష్కరాల తరహాలో ఏర్పాట్లు చేశామన్నారు. స్నానాలు చేసే స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వసతులు కల్పించామన్నారు. స్వర్ణాల చెరువులో నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు బ్లీచింగ్‌ చేయడమేకాక, మోటార్లతో ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
మున్సిపల్‌ కమిషనర్లతో పర్యవేక్షణ : రొట్టెలు పట్టుకునే ఘాట్‌ వద్ద పర్యవేక్షణ బాధ్యతను జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు కేటాయించినట్లు తెలిపారు. ప్రతీ 60 - 80 మీటర్లకు ఒక కమిషనర్‌ ఘాట్‌ను పర్యవేక్షిస్తూ పారిశుధ్యం, తాగునీరు, ఇతర సౌకర్యాలపై ఆరా తీస్తుంటారని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా వెంటనే తెలిసేలా సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వీఐపీలు, వీవీఐపీల తాకిడి ఉండే నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
11 ప్రాంతాల్లో పార్కింగ్‌ : నగరంలోకి ప్రవేశించే రొట్టెల పండుగ భక్తులు తమ వాహనాలను నిలుపుకునేందుకు 11 చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. ఇరగాళమ్మ గుడి వద్ద, వీఆర్సీ, టీబీ ఆసుపత్రి మైదానాలు, కస్తూరిదేవి గార్డెన్స్‌, ఎన్‌ఎంసీ కార్యాలయం ఎదురుగా తదితర ప్రాంతాలలో వాహనాలు నిలుపుకునేందుకు సౌకర్యాలు సమకూర్చామన్నారు. అక్కడ మొబైల్‌ మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. ఇతర శాఖల సమన్వయంతో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్‌ పేర్కొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image