ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి  మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింపు

                                     తిరుపతి, 2019 సెప్టెంబరు 04


ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 


మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింపు


దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం  6,975 చ.అడుగుల (16 సెంట్లు) స్థలాన్ని  కేటాయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌ||శ్రీదేవేంద్ర ఫడ్నవీస్‌ ముంబయిలోని తన అధికార నివాసంలో స్థలం కేటాయింపు ఉత్తర్వులను మంగళవారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీపి.బసంత్‌కుమార్‌కు అందజేశారు.


దేశవ్యాప్తంగా శ్రీవారి దివ్యక్షేత్రాల నిర్మాణానికి టిటిడి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ముంబయిలో స్థలం కోసం చాలాకాలంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వినతి మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ముంబయిలోని ప్రధాన ప్రాంతమైన తూర్పు బాంద్రాలో స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్థలం అనుభవ ఉత్తర్వులను ముంబయి సబర్బన్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీ మిలింద్‌ బోరికర్‌ టిటిడి జెఈవోకు అందజేశారు. ఈ స్థలంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంతోపాటు సమాచార కేంద్రాన్ని టిటిడి నిర్మించనుంది.


ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ సుధీర్‌ ముంగటివార్‌, టిటిడి ఎస్టేట్‌ అధికారి శ్రీ విజయసారధి, డెప్యూటీ ఈవో శ్రీ విశ్వనాథ్‌, స్థానిక సలహా మండలి సభ్యులు శ్రీవి.రంగనాథన్‌, డా.గీతా కస్తూరి, శ్రీ సమీర్‌ కె.మెహెతా తదితరులు పాల్గొన్నారు.


------------------------------------------------------------------------


 


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image