హైదరాబాద్‌కు చేరుకున్న కొత్త గవర్నర్‌ తమిళిశై

 



హైదరాబాద్‌: తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిశై సౌందరరాజన్‌ ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర రెండో గవర్నర్‌గా ప్రమాస్వీకారం చేయనున్నారు. ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 1100 మంది అతిథులను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్‌తో పాటు విపక్ష నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు