కల్తీ మహమ్మారిని నిర్మలించడం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

 



కల్తీ మహమ్మారిని నిర్మలించడం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.


సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
*కల్తీ మహమ్మారిని ,కల్తీ ఆహార వస్తువుల నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై -మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలి.


ప్రస్తుత ఆధునిక యుగం లో ఆరోగ్యంగా ఉండాలంటే  ముఖ్యంగా గాలి, నీరు, ఆహరం కల్తీ లేకుండా ఉండాలి.సమాజంలో మనం జీవించడానికి  నిత్యం అవసరమైనవి  గాలి ,నీరు, ఆహారం. అయితే వాయు కాలుష్యం వల్ల గాలి ,నీటి కాలుష్యం వల్ల నీరు ,కల్తీ చెయ్యడం వల్ల ఆహర వస్తువులు కలుషితమైపోతున్నాయి.ఇంక ఆరోగ్యం  కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది . కావున వాతావరణ కాలుష్యం వల్ల కలుషిత ఆహారాల వల్ల  ఇప్పటికే విషకోరల్లో చిక్కుకుని  ప్రతి ఒక్కరం అనారోగ్యం పాలు అవుచున్నాము  రోజు రోజు కు మనిషి ఆయుషు కూడ తగ్గిపోతుంది . కొన్ని సందర్బాలలో మనిషికి ఎటువంటి చెడు అలవాట్లు  లేకపోయినప్పటికి వాతావరణ కాలుష్యాలతో ,కల్తీఆహారపదార్థాలతో అనారోగ్యాలకు గురి అగుచున్నారు. శరీరంలో బ్యాక్టీరియల్  ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని సందర్బాలలో మనిషి మృతి చెందుతున్నాడు. కావున కల్తీ మహమ్మారిని  నిర్మూలించడానికి  సమాజంలోని అన్ని వర్గాల వారు మేధావులు, స్వచ్చంద సేవా సంస్ధలు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు , అధికారులు, ప్రభుత్వాలు , ప్రజలు ఐకమత్యం తో  కల్తీమహమ్మారిని నియంత్రించాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి
వేడుకుంటున్నారు.
ఆరోగ్యం అందరికి అవసరం
*మీరు తినే ఆహారాలలో ఉండే కలుషితాల పై జాగ్రత్త వహించండి*
ఆహార పదార్థాల నిల్వ, రవాణ పద్దతులు మరియు వాటిని పండించే విధానంలో రసాయనాలు అధికంగా వాడటం ,వ్యాపారస్తులు  కల్తీ చెయ్యటం  వంటి ఇతరేతర కారణాల వలన ఆహార పదార్థాలు కలుషితానికి గురవుతున్నాయి. కల్తీ నియంత్రణకు ప్రభుత్వాలకు  ప్రజల సహాయసహకారాలు అందించినప్పుడే సంపూర్ణ కల్తీ నియంత్రణ సాద్యపడుతుంది.
*ఆహార భద్రత  లో కొన్ని జాగ్రత్తలు*
ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహార కలుషితాలను అరికట్టి మరియు శుభ్రమైన ఆహార పదార్థాలను తినాలి. వీటి పైన తగిన శ్రద్ధ చూపకుండా, తెలిసి కల్తీ  ఆహార పదార్థాలను రోజు తింటున్నాము. 100 శాతం శుభ్రమైన మరియు క్రిమిరహిత ఆహార పదార్థాలను పొందలేము. కానీ, కొన్ని పద్దతులను అనుసరించటం ద్వారా ఆహార పదార్థాలలో ఉండే కలుషితాలను దాదాపు నివారించవచ్చని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి తెలిపారు.
ఆరోగ్యకర ఆహార పదార్థాలు పండ్లు లేదా కూరగాయలను తినటానికి లేదా వంటలో వాడటానికి ముందు నీటితో శుభ్రంగా కడగండి. కడగకుండా కూరగాయలను తినకూడదు. అంతేకాకుండా, సురక్షిత ఉష్ణోగ్రతల వద్ద ఆహార పదార్థాలను నిల్వ ఉంచండి.
ఏ రకమైన నీటిని తాగుతున్నారు మరియు వంటలలో వాడుతున్నారనేది చాలా ముఖ్యం. తాగటానికైన, వంటలలోనైన శుభ్రమైన నీటిని వాడటం మంచిది. మీరు శుద్ది చేసిన నీటిని వాడకం పోవటం వలన హానికర రసాయనాలను అనగా సీసం మరియు ప్రమాదకర సుక్ష్మజీవులు (వైరస్ మరియు బ్యాక్టీరియా) మీ శరీరంలో చేరి, చాలా విధాలుగా ఆరోగ్యాన్ని ప్రమాదానికి గురి చేస్తాయి.ఎపుడైనా శుభ్రత ప్రధానంగా ఉండే  దుకాణాలలో ఆహారాలను కొనుగోలు చేయటానికి ప్రయత్నించండి. కాలుష్యం ఎక్కువ లేదా కాలుష్య ప్రాంతాలలో అమ్మే ఆహార పదార్థాలను కొనటం వలన మీరు అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు అధికంగానే ఉన్నాయని సామాజిక కార్యకర్త డోన్ పి .మహమ్మద్ రఫి తెలిపారు
ప్యాక్ చేయని ఆహార పదార్థాలు హానికరమని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆహార పదార్థాలు కలుషితానికి గురై ఉంటాయి మరియు ఇవి కల్తీకి గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల విషయానికి వస్తే, ఇవి తక్కువగా కలుషితానికి గురవుతాయి మరియు కల్తీ కూడా దాదాపు తక్కువే. మీరు వీటిని కొనే ముందు ప్యాక్ సరిగా ఉందా లేదా అని మరియు లేబుల్పై తయారీ మరియు గడువు తేదీలను చూడటం మరవకండి. కల్తీ(కలుషిత) ఆహార పదార్థాలను తీసుకోవటం వలన దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతారు. స్వతహాగా అవగాహన కలిగి ఉండి, తగిన జాగ్రత్తలను తీసుకోవటం వలన ఆహార సమస్యలకు దూరంగా ఉండవచ్చని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు.
కలుషిత ఆహార పదార్థాలను తినటం వలన కడుపు నొప్పి, వాంతులు మరియు విరేచనాలు కలుగుతాయి. వీటితో పాటుగా కలుషిత ఆహారం తీసుకోవటం వలన క్యాన్సర్, నాడీ సంబంధిత రుగ్మతల వంటి దీర్ఘకాలిక వ్యాధుల భారినపడే అవకాశాలు ఉన్నాయి.కొన్ని రకాల పండ్లు మరియు కూరగాయలు రసాయన మందులను లేదా పురుగు నాశక మందులను అధికంగా కలిగి ఉంటాయి. వీటి పైన తగిన అవగాహన కలిగి ఉండి, రసాయనాలు లేని పండ్లు మరియు కూరగాయలను కొనుగోలు చేయండి. పండ్లు మరియు కూరగాయలను శుభ్రంగా కడగటం లేదా వాటి తోలు తీసివేయటం వంటి తగిన జాగ్రత్తలను తీసుకోవడం వలన మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి సుచించారు.


 




 


 

Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image