జ్యుడిషియల్‌ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావు నియామకం

11.09.2019
అమరావతి


జ్యుడిషియల్‌ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావు నియామకం
హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో సంప్రదింపులు, సిఫార్సు తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు
రూ.100 కోట్లు, ఆ పైబడ్డ ప్రతి టెండర్‌ జ్యుడిషియల్‌ ప్రివ్యూ పరిధిలోకి 
ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చట్టం
ఇవాళ జడ్జిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ
దేశంలోనే అత్యుత్తమ పారదర్శక విధానాన్ని తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ 


అమరావతి: అత్యుత్తమ పారదర్శక విధానం దిశగా కీలక అడుగుç పడింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ నిర్ణయం మేరకు తీసుకు వచ్చిన ముందస్తు న్యాయ సమీక్ష చట్టం అమలుకు సర్వం సిద్ధమవుతోంది. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ బి. శివశంకరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ శివశంకరరావు పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 


ప్రభుత్వ టెండర్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పారదర్శక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రమాణ స్వీకారం రోజునే దీనిపై ప్రకటన చేశారు. తన పాలనలో సుపరిపాలన పారదర్శకత కోసం చట్టాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించారు. ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత ప్రక్రియ కోసం జడ్జిని కూడా సూచించాలంటూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు నివేదించారు. దీంట్లో భాగంగా గడచిన అసెంబ్లీ సమావేశాల్లో జులై 26, 2019న బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన 25 రకాల పనులు ముందస్తు న్యాయ పరిశీలన  ద్వారా పారదర్శకత చట్టం పరిధిలోకి వస్తాయి. చరిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకు వచ్చామని, చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటిది జరగలేదని, ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఇది మొదలవుతుందని ఆరోజు శాసనసభలో ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ అన్నారు. పారదర్శకత అనే పదానికి ఇక్కడ నుంచే అర్థం మొదలైతే, దేశం మొత్తం దీన్ని అనుకరిస్తుందని సీఎం ఆరోజు తన ప్రసంగంలో పేర్కొన్నారు. అవినీతికి దూరంగా ఉండే రాష్ట్రమనే సందేశం మన దేశానికే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా వెళ్లాలన్నదే తన ఉద్దేశమని చట్టం తీసుకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. 


జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఇలా...:
ఏ టెండర్‌ లేదా పని విలువ రూ.100 కోట్లు, ఆపై దాటితే టెండర్‌ పత్రాలు న్యాయమూర్తి పరిశీలనకు
ఏడు రోజులపాటు ప్రజా బాహుళ్యంలోకి టెండర్‌ పత్రాలు, సలహాలు, సూచనలు స్వీకరణ
తోడుగా ఉండే టెక్నికల్‌ టీం నుంచి జడ్జి సలహాలు, సూచనలు, వివరాలు పొందవచ్చు. 8 రోజుల పాటు ఈ పరిశీలన జరుగుతుంది. సంబంధిత శాఖాధికారులను పిలిపించి టెండర్లలో మార్పులు, చేర్పులు సూచించవచ్చు.
మొత్తం 15 రోజులు ఈ ప్రక్రియ ఉంటుంది. 
న్యాయమూర్తి సూచనలను తప్పనిసరిగా అమలు చేస్తూ ఆ తర్వాత టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.


ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా టెండర్‌ విధానం ఉంటుంది.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image