అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేయాలి: మంత్రి వనిత

సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిది 
* సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల రూపకల్పన చేయాలి 
* కొన్ని స్వచ్ఛంధ సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తుండటం గర్వించదగ్గ విషయం 
* అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేయాలి
* రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత
అమరావతి: సమాజంలోని కడుపేద వ్యక్తి సైతం సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయమని, అందుకు అనుగుణంగా సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాల రూపకల్పన చేయాలని  స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంధ సేవా సంస్థలను ఉద్దేశించి మంత్రి తానేటి వనిత మాట్లాడారు. జాతి పునర్నిర్మాణంలో సేవ ఒక భాగం కావాలని, సేవా భావం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని తెలిపారు. ప్రస్తుత సమాజంలో సేవా భావం ప్రతి ఒక్కరిలో పెరిగిందని ఆమె వెల్లడించారు.  పలు స్వచ్ఛంధ సంస్థలు వృద్ధాశ్రమాలు, వికలాంగుల నిలయాలు, అనాధ శరణాలయాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లు, గ్రంథాలయాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, కోచింగ్‌ సెంటర్లు ఇలా ప్రతీది నడుపుతూ సమాజాభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు.  దుఖితులు, పీడితులు, అణగారిన వర్గాలు కోసం ప్రతి స్వచ్ఛంధ సంస్థ పనిచేయాలని సూచించారు. మన సమాజంలో దివ్యాంగులు, మానసిక వికలాంగులు, మూగ, బధిర అలాగే చలన సంబంధమయిన లోపం కలవారు అనేక మంది ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనకు భగవంతుడు అన్నీ ఇచ్చారు మరి వాళ్ల సంగతి ఏమిటి? అని  ప్రశ్నించి ఆలోచింపజేశారు.  వీళ్లందరిలో ఆత్మన్యూనతా భావం లేకుండా చేయాలని ఎన్జీవోలకు దిశానిర్ధేశం చేశారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వారు తమ అంగవైకల్యాలను జయించి జీవితంలో ముందుకు సాగేలా చేయాలని కోరారు. సేవను పొందేవారు సైతం సేవ చేసేవారిగా మార్చాలని అందుకు తగిన ప్రేరణ నింపాలన్నారు. ఏ రక్తసంబంధం లేని వారిని స్వచ్ఛంధ సంస్థలు చేరదీయడం గొప్ప విషయమని అభినందించారు. అయితే సామాజికబాధ్యత పేరుతో  ఒకట్రెండు స్వచ్ఛంధ సంస్థలు చేస్తున్న తప్పులు, పొరపాట్ల వల్ల మిగతా సంస్థలపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. సంపాదించేదాంట్లో కొంత సేవ చేయాలనుకోవడం మంచి పరిణామమన్నారు. సమాజంలో పలువురు ఏదో ఒక రూపంలో సేవ చేస్తుండటం అభినందనీయమన్నారు.  కష్టాలను దూరం చేసేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహించి వారికి తోడు నీడగా, ఆపన్నహస్తం అందించే విధంగా పలు స్వచ్ఛంధ సంస్థలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందజేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున చేయగలిగింది ఏది ఉన్నా అది చేస్తామని సీఎం పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.  మంచి చేయడానికి ముందుకొచ్చే స్వచ్ఛంధ సంస్థలకు అవసరమైతే నిధులు అందజేస్తామని మంత్రి అన్నారు. సామాజిక బాధ్యత పేరుతో నిధులు పక్కదోవ పట్టినా, దుర్వినియోగం చేసినా సదరు సంస్థలపై, కారణమైన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వమిచ్చే సహాయంతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కొన్ని స్వచ్ఛంధ సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తుండటం గర్హనీయమన్నారు. 
                                స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె. దమయంతి మాట్లాడుతూ మంత్రి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని స్వచ్ఛంధ సంస్థలను కలిపించే ప్రయత్నం చేశామన్నారు. సుమారు 117 ఎన్జీవోలు మీటింగ్ కు హాజరవటం మంచి పరిణామమన్నారు. రాష్ట్రంలోని పలు స్వచ్ఛంధ సంస్థలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు.  ఈ సందర్భంగా కొన్ని స్వచ్ఛంధ సంస్థలు మద్యపాన నిషేధం అమలుకు కృషి చేస్తుండటం గర్వించదగ్గ విషయమన్నారు. మత్తుపానియాలు మాన్పించేలా, చెడు అలవాట్లు తగ్గించేలా మరికొన్ని ఎన్జీవోలు ఆ దిశగా అవగాహన సదస్సులు కల్పించడంతో పాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ రక్తసంబంధం లేని వ్యక్తుల కోసం అహర్నిశలు కష్టపడుతూ వారిని చేరదీస్తున్న స్వచ్ఛంధ సంస్థలను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి చేరే విధంగా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు డా.కిషోర్ కుమార్, జనరల్ మేనేజర్ రవిప్రకాష్, 13 జిల్లాల శాఖాధికారులు,  రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 117 స్వచ్ఛంధ సేవా సంస్థలు, రాష్ట్రీయ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image