పాలన లేదు - ప్రచారాలకు పరిమితం

పాలన లేదు - ప్రచారాలకు పరిమితం


విజయవాడ :


బెంజిసర్కిల్ వద్ద గల జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పోతిన వెంకట మహేష్ మరియు అక్కల గాంధీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం పాలన చేతకాక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, దేశంలో ఆర్థిక మాంద్యం ఉంటే రాష్ట్రంలో జగన్ మాంద్యం ఉందని యువజన శ్రామిక రైతు పార్టీ అని పేరు పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతను ఇసుక పాలసీ ఇంతవరకు ప్రకటించకుండా లక్షలాది మంది శ్రామికులను విత్తనాలు యూరియా సకాలంలో సరఫరా చేయకుండా 0% వడ్డీకి రుణాలు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న వైయస్ఆర్సిపి పార్టీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి 1 నుంచి 5 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుతుందని పాదయాత్రలో పదే పదే మాట్లాడిన జగన్ గారు నేడు నవరత్నాల అమలులో అనేక షరతులు విధిస్తూ నవరత్నాలు ను డొల్ల రత్నాలు గా మారుస్తున్నారని రాజధాని అమరావతి మీద గందరగోళ పరిస్థితులను సృష్టించి రాష్ట్ర  అభివృద్ధిని కుంటూపరుస్తున్నారనీ ,రాష్ట్రం నుండి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి దారులు వెళ్ళిపోతున్న స్పందించని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఏ విధంగా సాధించగలదని కృష్ణాజిల్లా లో 3 మంత్రులు ఉన్నా బందరు పోర్టు పనులు ప్రారంభించ లేక పోయారని YSRCP,151 MLA లు రబ్బర్ స్టాంపులు ,చెక్క బొమ్మ ఎమ్మెల్యే లని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇక నుండి ఆయన పరిపాలన సక్రమంగా  చేయాలన్నారు . మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ ) మాట్లాడుతూ 100రోజుల వైసీపీ పాలనపై నిన్న జరిగినటువంటి విలేకర్ల సమావేశంలో పవన్ కల్యాణ్  ప్రభుత్వం విఫలమైందని చెప్పడం,అలాగే 100 రోజుల పాలనపై ఒక పుస్తకం విడుదల చెయ్యడం జరిగింది.అయితే దీనిపై వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నేతలు అయినటువంటి బొత్స గారు,అవంతి శ్రీనివాసరావు ,జక్కంపూడి రాజా ప్రెస్సుమీట్లు పెట్టి లబోదిబోమంటున్నారు. అసలు కళ్యాణ్  మాట్లాడింది ప్రజల్లోకి వెళ్లి వారి ఇబ్బందులు చూసి ఉదాహరణకు ఇసుక కొరత వలన తీవ్రంగా నష్టపోయిన కార్మికులు కల్యాణ్ ని కలిసి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా వారు 28లక్షల మంది ఉపాది లేక రోడ్ మీద పడ్డాం అని చెప్పడం జరిగింది. మీరు ఈ విషయాలపై స్పందించకుండా మీరు రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్లలాగా ఎంతసేపు ప్యాకేజీ,ఎవరో స్క్రిప్ట్ రాస్తే చెబుతున్నారు అని పేలుతున్నారు. మీకు నిజంగా దమ్ముంటే గత ప్రభుత్వం ప్రకటించిన ఐదుశాతం కాపు రిజర్వేషన్లు కాపులకు ఇవ్వాలి అని జగన్మోహనరెడ్డి ని నిలదీయగలరా,ముద్రగడ ఉద్యమానికి మద్దతు పలికారు కదా మరి ప్రభుత్వం రాగానే ఓటు వేసి గెలిపించిన కాపులను మర్చిపోయారా?వీటిమీద దమ్ముంటే చర్చకు రండి అంతే గాని విషయానికి సంబంధం లేకుండా ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఖబడ్దార్ మీకంటే మా పెదాలకు స్పీడ్ ఎక్కువ మీకంటే ఎక్కువ వెటకారాలు వెదజల్లగలం. .ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ఇన్చార్జ్ అంకెం శ్రీనివాసరావు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తిన రామ్మోహన్ రావు పాల్గొన్నారు .


 


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image