అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులకు ఈ- టెండర్లు

అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులకు ఈ- టెండర్లు
- విద్యాధరపురం-50, గన్నవరం-50.. అమరావ తికి-50 బస్సులు
- ఆర్టీసీ షెడ్యూల్‌ రూట్లలో నడపటానికి అనుమతులు
- విలీన వేళ.. అద్దె విధానం మంచిది కాదంటున్న కార్మికులు
విజయవాడ : అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులను తీసుకునేందుకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) టెండర్లను పిలవటంతో ఆ సంస్థ ఉద్యోగ, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 350 ఎలక్ర్టిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఈ-టెండర్లు పిలిచారు. కృష్ణా రీజియన్‌కు సంబంధించి విజయవాడ సిటీ డివిజన్‌ నుంచి మొత్తం 150 ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం టెండర్లను పిలిచింది. సంస్థలో అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులను తీసుకోవాలన్న ఆలోచనతో పాటు ఆర్టీసీ షెడ్యూల్‌ రూట్లను గుత్తంగా ప్రైవేటు బల్క్ ఆపరేటర్ల చేతుల్లో పెట్టడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన వేళ.. ఎలక్ర్టిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలనుకోవడం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 350 ఎలక్ర్టిక్‌ బస్సులను ఐదు లాట్లగా అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఈ-టెండర్లు పిలిచారు. కృష్ణా రీజియన్‌కు సంబంధించి విజయవాడ సిటీ డివిజన్‌ నుంచి మొత్తం 150 ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేందుకు రెండు లాట్లలో ఆర్టీసీ యాజమాన్యం టెండర్లను పిలిచింది. విజయవాడ నగరంలో విద్యాధరపురం బస్‌ డిపో నుంచి ఒక లాట్‌గా 50 బస్సులు, గన్నవరం బస్‌ డిపో నుంచి రెండవ లాట్‌గా 50 బస్సులు వెరసి అమరావతి రాజధానిలో నడి పేందుకు మరో 50 బస్సులకు టెండర్లు పిలిచారు. ఆర్టీసీ యాజమాన్య చర్యకు గుర్తింపు సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) అభ్యంతరం తెలిపింది. ఎలక్ర్టిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవటంతో పాటు, షెడ్యూల్‌ రూట్లను ప్రైవేటుబల్క్‌ అపరేటర్ల చేతుల్లో పెట్టడం సంస్థను నిర్వీర్యం చేయటమేనన్న భావనను కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న చర్య రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని భవిష్యత్తులో ప్రైవేటీకరణ దిశగా నడిపించటమేనని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీని విస్తరించాలంటే నేరుగా సంస్థకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలి తప్పితే.. అద్దెకు బస్సులను తీసుకుని నిర్వహణను వారి చేతిలో పెట్టడం సబబు కాదని మండిపడుతున్నారు. ఆర్టీసీ అధికారులు టెండర్లను ఆహ్వానించటంతో పాటు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)ని కూడా విడుదల చేశారు. ఆర్‌ఎఫ్‌పీ ప్రకారం చూస్తే విద్యుత్‌ బస్సులను 12 సంవత్సరాల కాలానికి తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌ స్కీమ్‌ -2లో భాగంగా కాంట్రాక్టు పద్ధతిన బస్సులను తీసుకుంటామని ప్రకటించింది. బస్సు ప్రయాణించే దూరం ప్రాతిపదికన కిలో మీటర్‌కు నిర్ణయించిన ప్రకారం చెల్లింపు జరుగుతుందని పేర్కొంది. బస్సులను ఆర్టీసీ షెడ్యూల్‌ రూట్లలో నడపటానికి అవకాశం కల్పిస్తుంది. టెండర్లలో కార్పొరేట్‌ సంస్థలు పాలుపంచుకునే అవకాశం ఉంది. ఈ టెండర్‌ను దక్కిం చుకునేందుకు కార్పొరేట్‌ సంస్థల మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంది.
కొత్త ఉద్యోగుల రాక కష్టమే : కార్మిక సంఘాలు సంస్థలో అద్దె బస్సులను తీసుకోవటాన్ని ఏనాడూ అంగీకరించలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం చెబితే కార్మికులు సంతోషించారు. ఈ దశలో అద్దె ప్రాతిపదికన బస్సులను తీసుకోవటానికి ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న చర్యలు అంతే స్థాయిలో కార్మికులను ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినా.. ప్రస్తుత అద్దె విధానాలను చూస్తే భవిష్యత్తులో సంస్థలోకి కొత్తగా ఉద్యోగులను తీసుకోవటానికి ఇక అవకాశాలు ఉండవని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గుర్తింపు సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) నేతలు పి.దామోదరరావు, వైవీ రావులు తక్షణం అద్దె ప్రాతిపదికన పిలిచే టెండర్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
ఎలక్ర్టికల్‌ బస్సులను ప్రవేశపెట్టడానికి తాము వ్యతిరేకం కాదని, ఈ ముసుగులో కార్పొరేట్‌ సంస్థలకు ఆర్టీసీని పంచే పద్ధతిని అంగీకరించబోమని చెబుతున్నారు. ఆర్‌ఎఫ్‌పీలో డ్రైవర్‌తో కలిపి, డ్రైవర్‌ లేకుండానూ అన్న ఆప్షన్‌ను ఆర్టీసీ యాజమాన్యం కల్పించింది. దీని ప్రకారం చూస్తే.. సంస్థలు డ్రైవర్‌ను కూడా తామే నియమించుకునే పరిస్థితులు ఉంటాయి. కండక్టర్లను కూడా తామే నియ మించుకుంటామని బల్క్‌ సప్లయిర్‌ ప్రతిపాదించే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే ఎలక్ర్టిక్‌ బస్సుల నిర్వహణ అంతా పూర్తిగా ప్రై వేటు బల్క్‌ ఆపరేటర్‌ చేతుల్లోనే ఉంటుంది.
ఎవరికి లాభం : సంస్థలోకి అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ బస్సులను తీసుకోవటం ఆర్టీసీకి అంతగా ప్రయోజనకరంగా ఉండదు. అద్దెకు కాబట్టి ఆదాయం ఎక్కువుగా ఆపరేటర్‌కే వెళుతుంది. ఆర్టీసీ షెడ్యూల్‌ రూట్లను ఇవ్వటం వల్ల ఈ రూపేణా ఆర్టీసీ ఆదాయానికి గండి పడే అవకాశాలు ఉంటాయి. ఈ ఎలక్ర్టికల్‌ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తే సంస్థకు అధిక ప్రయోజనం కలుగుతుంది. డీజిల్‌ ధర కలిసి వస్తుంది. పూర్తి ఆదాయం సంస్థకు చెందుతుంది. మధ్యలో కార్పొరేట్‌ శక్తులు ప్రతిఫలాన్ని పొందటానికి అవకాశం ఉండదు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image