మళ్లీ విమానాల కళ

మళ్లీ విమానాల కళ
వింటర్‌ షెడ్యూల్స్‌తో కొత్త ఊపిరి
ఢిల్లీ, ముంబాయి, కొచిన్‌, చెన్నై, తిరుపతి, విశాఖలకు..
ఎయిర్‌పోర్టులో విమానాశ్రయ విమానయాన సంస్థల మీట్‌
ఏపీడీ మధుసూదనరావు అధ్యక్షతన సమావే శం
విజయవాడ : విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశీయంగా హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, కొచ్చి న్‌, ఢిల్లీ, ముంబయిలకు విమానసర్వీసులు పెరగబోతున్నాయి.  విజయవాడ ఎయిర్‌పోర్టులో జరిగిన లోకల్‌ ఎయిర్‌లైన్స్‌ మీట్‌లో ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు శుభవార్తను అందుకున్నారు. లోకల్‌ ఎయిర్‌లైన్స్‌ వెలిబుచ్చిన నూతన షెడ్యూల్స్‌లో కొన్నింటికీ తేదీలు ఖరారుకాగా మరికొన్నింటికి అతి త్వరలో ఖరారు చేయను న్నారు. ఏవియేషన్‌ సమ్మిట్‌కు సంసిద్ధమౌతు న్న తరుణంలో డొమెస్టిక్‌గా విమాన సర్వీసు లు పెరుగుతుండటం పట్ల విమానాశ్రయ అధికారులు హర్షంవ్యక్తం చేస్తున్నారు.  విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవియేషన్‌ సలహాదారు భరత్‌ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌, ఇండిగో, ట్రూజెట్‌ విమానయాన సంస్థల మేనేజర్లు పాల్గొన్నారు. ఎయిర్‌లైన్స్‌ సంస్థల నుద్దేశించి ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు భరత్‌రెడ్డి, ఎయిర్‌ పోర్టు డైరెక్టర్‌ మధు సూదనరావులు మాట్లాడుతూ, విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశీయంగా డిమాండ్‌ ఉందని గణాంకాలను వివరించారు. సమా వేశంలో పాల్గొన్న నాలుగు విమానయాన సంస్థలలో మూడు విమానయాన సంస్థలు తమ సర్వీసులకు సంబంధించి షెడ్యూల్‌తో పాటు మరికొన్ని హామీలను ఇచ్చారు.
ఇవీ వింటర్‌ షెడ్యూల్స్‌ :  స్పైస్‌జెట్‌ సంస్థ తరపున సెప్టెంబరు 25వ తేదీ నుంచి విజయవాడ-హైదరాబాద్‌ కు ఉదయం 8.25 గంటలకు సాయంత్రం 8.55 గంటలకు విమాన సర్వీసులను నడప నున్నట్టు ఆ సంస్థ మేనేజర్‌ డొమినిక్‌ తెలి పారు. ఇప్పటి వరకు విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి హైదరాబాద్‌కు ఉదయం 11.25 గంటల తర్వాతే విమానాలు ఉన్నాయి. ఉద యం వేళలో కొత్త విమాన సర్వీసు అందు బాటులోకి వస్తుంది. అక్టోబరు 27 నుంచి కొచ్చిన్‌ - తిరుపతి - వియవాడ రాను, పోను సర్వీసులను తిరిగి పునరుదఽ్ధరించే అవకాశా లు ఉన్నాయని చెప్పారు. దీంతో పాటు విశాఖపట్నం - చెన్నై - విజయవాడ విమాన సర్వీసులను కూడా నడపటానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అక్టోబరు 27 నుంచి ముంబైకి నూతన డైలీ ఫ్లైట్‌కు ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో విజయవాడ నుంచి ఢిల్లీకి నడుస్తున్న విమాన సర్వీసును ఉన్నత స్థాయిలో రద్దు చేయాలన్న ఆలోచన ఉందని, రద్దీ ఉంటున్న నేపథ్యంలో, ఈ ఫ్లైట్‌ను రద్దు చేయవద్దని తాము చెప్పినట్టు తెలిపారు.
ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ తరపున ఇక మీదట ప్రతి శుక్రవారం అలయెన్స్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి విజయవాడ - వైజాగ్‌కు సర్వీసును పునరుద్ధరిస్తున్నట్టు ఆ సంస్థ మేనేజర్‌ తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌లో ఈ విమానం బయలు దేరుతుంది. సాయంత్రం 6.30 గంటలకల్లా విజయవాడకు చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి 6.55 గంటలకు విశాఖ బయలుదేరుతుంది. విశాఖకు 7.55 గంటలకు చేరుకుంటుంది. అక్టోబరు 27 నుంచి రద్దు చేసిన విజయవాడ వయా హైదరాబాద్‌ - ఢిల్లీ విమాన సర్వీసును పునరుద్ధరించనున్నట్టు ప్రకటించారు. ఇండిగో విమానయాన సంస్థ తరపున అక్టోబర్‌ 27 నుంచి ఇటీవ లే రద్దు చేసిన ఢిల్లీ సర్వీసును పునరుద్ధరించనున్నట్టు ఆ సంస్థ మేనేజర్‌ కౌశిక్‌ తెలిపారు. అలాగే ముంబైకి ఫ్లైట్‌ నడిపే విషయంలో ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు. ట్రూ జెట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తరపున ప్రస్తుతం కొత్తగా అదన పు విమానాలు ఏమీ నడపటం లేదని ఆ సంస్థ మేనేజర్‌ కిరణ్‌రాజు తెలిపారు. ఇటీవల కొనుగోలు చేసిన ఆరవ విమానాన్ని ఇక్కడి నుంచి నడిపే పరిస్థితి లేదని ఏడు, ఎనిమిదవ విమానాలుగా వచ్చే వాటిలో తప్పకుండా ఒకదానిని ఇక్కడి నుంచి నడిపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image