క్రీడాకారిణి ఆశయానికి లోకేష్ ఆసరా

క్రీడాకారిణి ఆశయానికి లోకేష్ ఆసరా 
- గతంలో ఎన్ఆర్ఐ టిడిపి, యూకే టిడిపి ద్వారా రూ.2.5 లక్షలు
-తాజాగా మరో రూ.2.5 లక్షలు అందజేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 
- పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రికకి మొత్తం రూ. 5లక్షలు అందజేసిన టీడీపీ
-ప్రస్తుతం కెనడాలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్న చంద్రిక 


క్రీడాకారిణి ఆశయానికి తెలుగుదేశం ఆసరాగా నిలిచింది. ఆమె లక్ష్యానికి చేరుకునేందుకు టీడీపీ చేయూతనందించింది. పవర్ లిఫ్టర్ బొల్లినేని స్వర్ణచంద్రిక అంతర్జాతీయ పోటీలలో రాణించి మన దేశం సత్తా చాటేందుకు తెలుగుదేశం పార్టీ రూ.5 లక్షలు సాయం అందించింది. మాట ఇవ్వడం..నెరవేర్చుకోవడం అంటే ఇదే. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ దేశం గర్వించేలా అద్భుత ప్రదర్శన చేయండి..మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని క్రీడాకారిణికి  హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన కొన్ని రోజులలోనే దానిని నెరవేర్చారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రికకు తాజాగా రూ.2.5 లక్షలు సహాయంగా నారా లోకేశ్ అందజేశారు. చంద్రిక  పేదరికంలో ఎన్నో కష్టాలు పడింది. తల్లిదండ్రులు లేరు. అయినా ఓ వైపు విద్య కొనసాగిస్తూనే మరో వైపు పవర్ లిఫ్టింగ్ పోటీలలో తన సత్తా చాటుతూనే ఉంది. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని 50కి పైగా పతకాలు సాధించింది. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొంటోంది. పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటుతున్న క్రీడాకారిణికి సాయంచేసేందుకు  టీడీపీ ముందుకొచ్చింది. ఇటీవలే ఎన్ఆర్ఐ టిడిపి,యూకే టిడిపి బృందం సేకరించిన 2.5 లక్షల చెక్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా దేశం గర్వించే క్రీడాకారిణిగా ఎదగాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ పోటీలలో సత్తా చాటి మనదేశం, మన రాష్ర్టం, మన మంగళగిరి సత్తా చాటాలని కోరారు. ఇదే సందర్భంలో చంద్రికకు అవసరమైన శిక్షణ, ఆర్థిక అవసరాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు చంద్రికకి రూ.2.5 లక్షల సాయాన్ని అందజేశారు. దీంతో ఇప్పటివరకూ టీడీపీ నుంచి క్రీడాకారిణికి మొత్తంగా 5 లక్షలు సాయంగా అందింది. క్రీడాకారిణికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి, సాయం అందించిన నారా లోకేశ్ కి చంద్రిక కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image