ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు అన్ని చర్యలు చేపడుతోంది : చిత్తూరు ఎం

 


 *🌹రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు అన్ని చర్యలు చేపడుతోంది : చిత్తూరు ఎం పి రెడ్డెప్ప* 


 *తిరుపతి, సెప్టెంబర్ 14:* రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు అన్ని చర్యలు చేపడుతోందని చిత్తూరు ఎం పి రెడ్డెప్ప పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి ఎస్.వి.యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో ఎం పి మాట్లాడుతూ రుయా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.


          ఎంఎల్సి యండవల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామమని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.


          తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ దాదాపు 57 సం. ల క్రితం ప్రారంభమయిన రుయా ఆసుపత్రి రాయలసీమలోనే తలమానికమైనదని, దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఈ ఆసుపత్రిని అభివృద్ధి పరచారని, సామాన్యునికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రుయాను మరింతగా అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు.


          పలమనేరు శాసన సభ్యులు వెంకటే గౌడ్ మాట్లాడుతూ పలమనేరు లో గల 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చారని కానీ అందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని కోరారు. పలమనేరు నియోకవర్గ పరిధిలోని పి.హెచ్.సి లలో గల డాక్టర్ ల పోస్ట్ లను భర్తీ చేయాలని మంత్రిని కోరారు.


          పీలేరు శాసన సభ్యులు చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో పని చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలను ఇవ్వాలని హాస్పిటల్ కమిటీ లను బలోపేతం చేయాలని, పీలేరు ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని, వాయల్పాడు లో గల 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని పి.హెచ్.సి లలో గల సిబ్బంది కొరతను, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. 


          సత్యవేడు ఎం.ఎల్.ఏ ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గం లో పి.హెచ్.సి లలో రాత్రి వేళల్లో డాక్టర్ లు మరియు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అత్యవసర సమయాలలో వైద్య సేవల కొరకు మద్రాసు మరియు తిరుపతికి వెళ్లాల్సి వస్తుందని ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.


          మదనపల్లె శాసన సభ్యులు నవాజ్ బాషా మాట్లాడుతూ మదనపల్లె ఏరియా ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా చేశారని అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన చేయాలని, ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.


          తంబళ్ళపల్లె శాసన సభ్యులు ద్వారకనాథ రెడ్డి మాట్లాడుతూ తంబళ్ళపల్లె నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అత్యవసర సమయాలలో వైద్య సేవల కొరకు మదనపల్లె, తిరుపతికి వెళ్లాల్సి వస్తోందని, ఈ ప్రాంతం లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు.   


          నగరి శాసన సభ్యులు శ్రీమతి రోజా మాట్లాడుతూ నగరి నియోజకవర్గం లో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం ఊరికి దూరంగా ఉండడంతో పాటు డ్రైనేజ్ కాలువ నీరు మరియు చెత్త ఆసుపత్రి పరిసరాల చుట్టూ చేరడం జరుగుతోందని, ఇలా జరగడం వలన మరింత అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ఇందుకు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. నగరి నియోజకవర్గంలో గల పి హెచ్ సి లు, సి హెచ్ సి లలో వైద్యుల కొరత కలదని, మౌలిక వసతులను కల్పించాలని మంత్రి ని కోరారు


           మండలాలలో గల పి.హెచ్.సిలలో గల డాక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి వైద్య సేవలు అందించేందుకు వాహన సౌకర్యం లేదని, సిబ్బంది కొరత కలదని, స్పెషలిస్ట్ డాక్టర్లు వారి సేవలను మెరుగు పరచుకొనే పరిస్థితి లేదని పలువురు డాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  


          గౌరవ శాసన మండలి, శాసన సభ్యులు తెలిపిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి వివరిస్తూ ప్రతి మండలానికి ఒక 108, 104 వాహనాలను కేటాయించడం జరుగుతుందని, ఈ వాహనాలు పి.హెచ్.సి పరిధిలో ఉంటాయని, పారా మెడికల్ సిబ్బంది సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుందని, వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణల నిమిత్తం సుజాత శర్మ కమిటీ చేసిన సిఫారసులను పరిశీలించడం జరుగుతున్నదని అన్ని పి.హెచ్.సి లు, సి.హెచ్.సి లు ల్యాబ్ ల నిర్వహణ మరియు సిబ్బంది నియామకం, మందుల కొరత నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని, గ్రామ వాలంటీర్ల నియామకం మరియు గ్రామ సచివాలయాలలో వైద్య సిబ్బంది నియకం తో సిబ్బంది కొరత సమస్య తీరుతుందని తెలిపారు. అక్టోబర్ 10 నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.


          ఈ సమీక్షా సమావేశం లో స్విమ్స్ డైరెక్టర్ డా. వెంగమ్మ, రుయా సూపరింటెండెంట్ డా.భవానీ, డి.ఎం అండ్ హెచ్ ఓ డా.రామ గిడ్డయ్య, డి సి హెచ్ సరళా దేవి, జిల్లా లోని ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు, మెడికల్ ఆఫీసర్ లు, ఆయుష్ శాఖ డాక్టర్ లు, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.


Popular posts
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు :శ్రీమతి పద్మశ్రీ సుంకర, ఏ పిసిసి సమన్వయ కమిటీ సభ్యులు
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు