ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది

29.10.2019
అమరావతి


అమరావతి: విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌కు తన సిఫార్సులను వివరించింది. సచివాలయంలో జరిగిన సమావేశంలో తాము గుర్తించిన అంశాలు, విద్యారంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇందులోని ముఖ్యమైన అంశాలు ఇవి...


*కమిటీ సభ్యులం ఇప్పటివరకు ఆరుసార్లు సమావేశమయ్యాం. 
*నిపుణుల కమిటీ సభ్యులందరం క్షేత్ర స్ధాయిలో పలుమార్లు పర్యటించాం.
*ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. 
*నాణ్యమైన విద్య ఖర్చుతో కూడుకున్నదిగా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు దయనీయంగా ఉన్నాయి.
*బోధనా పద్ధతులు లోపభూయిష్టంగా ఉన్నాయి. 
బోధనా నైపుణ్యాన్ని భారీగా మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. 
*ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల నమోదు  49.28 శాతమే మాత్రమే ఉంది.
*మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో 43శాతం మంది విద్యార్ధులు నమోదవుతున్నారు. ప్రపంచంలో ఇది అత్యధికం.
*ప్రైవేటు విద్యాసంస్ధల్లో పారదర్శకతా లేదు, నియంత్రణ అంత కన్నా లేదు.
సరైన పర్యవేక్షణ ఉండటం లేదు. 
*మరో వైపు ప్రైవేటు పాఠశాలల్లో బోధన సిబ్బంది పరిస్ధితులు అధ్వాన్నంగా ఉన్నాయి. 
*ప్రైవేటు ఉపాధ్యాయ శిక్షణా సంస్ధలు గణనీయంగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. 


*స్కూళ్లలో డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ పై భారీగా ఖర్చు చేయాల్సి ఉంది.
*దీనికోసం ఉపాధ్యాయులకు శిక్షణనివ్వాల్సిన అవసరం ఉంది. 


*విద్యారంగంలో  శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన కమిటీ. 
అమ్మ ఒడి, విద్యా నవరత్నాల కార్యక్రమాలను ప్రశంసించిన కమిటీ
*పాఠశాల, ఉన్నత విద్యారంగాలపై నియంత్రణ, పర్యవేక్షణలకు కమిషన్‌ల  ఏర్పాటును గట్టిగా సమర్ధించిన కమిటీ. 
*కంటి వెలుగు, పాఠ్య ప్రణాళిక మార్పు, పదోతరగతి పరీక్షల్లో సంస్కరణలు, 
*విద్యా హక్కు చట్టం అమలుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడిన కమిటీ. 


*వచ్చే ఐదేళ్ల కోసం లక్ష్యాలను నిర్దేశించిన కమిటీ.
6 నుంచి 16 యేళ్లు లోపు పిల్లలందరూ పాఠశాలలో చదువుకునేలా చేయాలన్న కమిటీ.
*స్టూడెంట్‌ లెర్నింగ్‌ అవుట్‌ కం ప్రతీయేటా 8 శాతం పెరిగేలా చూడాలి. దానిపై థర్డ్‌ పార్టీ నిర్ధారణ జరగాలి. 
*హైస్కూలు స్ధాయిలో ఏ విద్యార్ధి డ్రాప్‌అవుట్‌ కాకూడదు. నూటికి నూరు శాతం విద్యార్ధులు పదో తరగతి పూర్తి చేయాలి. మధ్యలో బడి మానేయకూడదు.
*సమాజంలో పట్టణ, గ్రామీణ విద్యార్ధుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంతో పాటు, సామాజిక, ఆర్ధిక అంతరాలు లేకుండా చూడాలి. 
*అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక, డిజిటల్‌ సదుపాయలు ఉండాలి. 


*తక్షణమే ప్రయోజనం చేకూరే ప్రాజెక్టునలు సిఫార్సు చేసిన కమిటీ ..
*రాత, పఠనా సామర్ధ్యాలను పెంచే విధంగా క్యాంపెయిన్‌ చేయాలి.
*మారుమూల గిరిజన ప్రాంతాల్లో బడి మానేయకుండా ప్రతీ విద్యార్ధి మీద అసెస్‌మెంట్‌ ట్రాకింగ్‌ ఉండాలి. 
*స్కూల్‌ బ్యాగు బరువు తగ్గించాలి. 
ఎనిమిదో తరగతి నుంచి వృత్తి విద్య  ఉండాలి. 
వచ్చే ఏడాది 1 నుంచి 8 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నందున.. ఇంగ్లీషు మీడియంలో ఉపాధ్యాయులకు శిక్షణనివ్వాలి. 
*ఉపాధ్యాయుల నైపుణ్యం మీద తప్పనిసరిగా మదింపు ఉండాలి. నిరంతం వారిలో నైపుణ్యం పెంచడానికి కార్యక్రమాలు చేపట్టాలి. 
ప్రతీయేటా శిక్షణ తప్పనిసరి. 
*ఇంటర్మీడియట్‌ వరకు ఉచిత నిర్భంద∙విద్య అమలు చేయాలి. 
*హైస్కూల్స్‌ అన్నింటినీ కూడా జూనియర్‌ కళాశాలల వరకు అప్‌గ్రేడ్‌ చేయాలి. 
*ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ బోర్డులను కలిపి, ఒకే కమిషనర్‌ పరిధిలోకి తేవాలి. 
*అన్ని స్కూళ్లలో ఎస్సీఈఆర్టీ సిలబస్‌ ఉండాలి. 
రాష్ట్రస్ధాయిలో ప్రాధమిక విద్య ఒకే గొడుగు కింద తీసుకురావాలి.
*అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం మార్గదర్శకాలు రూపొందించాలి. 
ప్రాధమిక విద్యలో అంతర్గతంగా సమన్వయ మండలి ఉండాలి. 
*గురుకుల పాఠశాలల నిర్వహణకోసం ఒక మండలి ఉండాలి. 
*డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ కోసం కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలి.
*ప్రతీనెలా కలెక్టర్లు సమీక్ష నిర్వహించాలి.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image