పేద పిల్లలు చదివే ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనే నాడు – నేడు : జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


14.11.2019
తిరుపతి


పేద పిల్లలు చదివే ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనే నాడు – నేడు : జిల్లా ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


తిరుపతి, నవంబర్ 14 : రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం రెండే నని ఒకటి విద్యావ్యవస్థ పారిష్టం, యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం అని అందుకే పేదలు చదివే  ప్రభుత్వ బడుల్లో దశలవారిగా వసతులు కల్పించ నున్నారని జిల్లా ఇంచార్జి మంత్రి మరియు పరిశ్రమల శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి  అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక మంగళం కాలనీలో  జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల లో నాడు –నేడు కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి ముఖ్య అతిధిగా, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, తుడ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి అతిధిలుగా పాల్గొన్నారు. 


జిల్లా ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం ప్రారంభించినా శుభ  సూచికంగా  తప్పనిసారి వరుణుడు అభయ మిస్తూ వర్షం వస్తుందని నేడు అదేవిధంగా జరిగిందని అన్నారు. తొమ్మిది అంశాలతో పేదపిల్లలు చదివే బడులను నాడు గతంలో వున్నది , రాబోవు రోజుల్లో నేడు  కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దే వుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేడు బాలల దినోత్సవంలో పండుగా ప్రారంభించుకుంటున్నామని అన్నారు. తెలుగు మాతృబాషకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంగ్లీస్ అమలు పెద పిల్ల భవిష్యత్ కోసమేనని అన్నారు. అమ్మఓడి అమలు చేసి పేదపిల్లలు బడికి రావడానికే నని బంగారు భవిషత్ ముందుందని అన్నారు. 


 డిప్యూటీ సి ఏం మాట్లాడుతూ ఇంగ్లీస్ విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అమలు ఎస్.సి., ఎస్.టి.,బీసీలకు , పేదలకు మేలుకలుగుతుందని డబ్బుల్లేక ఎంతోమంది తల్లి దండ్రులు కార్పొరేట్ విద్యలో చేర్పించాలని  వున్నా చేయలేక పోతున్నారని పేదల ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి విద్యాలయాల్లో వసతులకు శ్రీకారం చుట్టారని అన్నారు. తల్లిదండ్రుల కమిటీల సూచనల మేరకు విద్యాలయాలు కొత్తదనం రూపుదిద్దుకోనున్నదని అన్నారు.
 
తుడా ఛైర్మన్ మాట్లాడుతూ అమ్మఒడి పతకంద్వారా జనవరిలో పెద విద్యార్థుల తల్లులు రూ 15 బిలు అందుకొనున్నారని అన్నారు. పిల్లల భవిష్యత్ దృష్టిలో వుంచుకుని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీస్  అమలు ముఖ్యమంత్రి అమలుకు శ్రీకారం చుట్టారని అన్నారు. నేను పూర్తిగా పి.హెచ్.డి.వరకు తెలుగులో చదివానని నేడు కనీసం ప్రక్క రాష్టంలోకి వెళ్ళి ఇంగ్లీస్ లో మాట్లాడలేకున్నానని అన్నారు. తెలుగు మాతృ బాషకు తక్కువ చేయడం లేదని, ఇంగ్లీష్ తో పిల్లలకు భరోసా, భవిష్యత్ వుంటుందని అన్నారు. నేడు ప్రవేట్ విద్యాసంస్థల్లో ఎక్కడా  తెలుగు  పాఠశాలలు లేవనే విషయం మనం గ్రహించాలని అన్నారు. 
 
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాడు – నేడు మంచి కార్యక్రమం నేడు జిల్లాలో ప్రారంభించుకోవడం ఆనందంగా వుందని మెదటి విడతలో మన జిల్లాలో 1504 పాఠశాలల్లో మార్చి 2020 నాటికి పూర్తి స్థాయి వసతులు కల్పించనున్నామని అన్నారు. వసతులు పూర్తి అయితే ఒక మంచి వాతావరణం గల పాఠశాలలో చదువుతున్నామనే అనుభూతి కలగనున్నదని అన్నారు. 


 సభ ప్రారంభానికి ముందుగా ముఖ్యఅతిధిలు   విద్యావిదానంలో అమలు చేస్తున్న స్టాల్స్ ను పరిశీలించి, జిల్లాలో మనబడి - నాడు - నేడు కార్యక్రమం శిలా పలకాన్ని ప్రారంభించి నెహ్రూ చిత్రపటానికి పూలు సమర్పించి, జ్యోతిప్రజ్వలన చేశారు. 
 ఈ సమావేశంలో నగరపాలక కమిషనర్ గిరిశా, డి ఈ ఓ నరసింహారెడ్డి, పాఠశాల ప్రధానోపాద్యాయులు కేశువులు నాయుడు, విద్యాశాఖ అధికారులు, ఉపాద్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు వర్షం వచ్చినా లెక్కచేయకుండా  పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


 


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image