డిక్లరేషన్‌ విషయంలో జగన్‌ తనతప్పు తెలుసుకోవాలి

డిక్లరేషన్‌ విషయంలో జగన్‌ తనతప్పు తెలుసుకోవాలి
* ప్రభుత్వ విధానాలపై, ప్రజా సమస్యలపై మాట్లాడిన చంద్రబాబుపై దుష్ప్రచారమా?
* మంత్రిని తక్షణమే తనపదవి నుంచి, జగన్‌ బర్తరఫ్‌ చేయాలి
* మసీదులు, గురుద్వారాల్లో జగన్‌ ఇలానే ప్రవర్తిస్తాడా 
* పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వ‌ర్ల రామ‌య్య‌
గుంటూరు: ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్త్యమైన, పవిత్రమైన తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వెళ్లి, డిక్లరేషన్‌ ఇవ్వకుండా, ఆలయ సాంప్రదాయాలను మంటగలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైఖరిని సమర్థిస్తూ, మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను చూసి రాష్ట్ర ప్రజలంతా అసహ్యంతో ఈసడించుకుంటున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. గురువారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌ సూర్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొడాలి నాని ఎలాంటి వ్యక్తో, అతని ప్రవర్తనేమిటో తెలుసుకోకుండా మంత్రిపదవి ఇచ్చిన జగన్‌, తిరుమల ఆలయం గురించి మంత్రి హోదాలో నాని వాడిన బూతు పురాణంపై ఎందుకు స్పందించడం లేదని రామయ్య నిలదీశారు. తన కేబినెట్‌ సహచరుల్ని ఎంచుకోవడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి, వారు చేసే వ్యాఖ్యలతో ఏంచేయాలో పాలుపోక, దిక్కుతోచని స్థితిలో పడిపోయాడని, చివరకు నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణరక్షణ కోసం గడ్డిపోచపట్టుకున్నట్లుగా ముఖ్యమంత్రి పరిస్థితి తయారైందన్నారు. నాని వ్యాఖ్యలతో ప్రభుత్వ గౌరవం దెబ్బతినడంతో, దాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై దుష్ప్రచారానికి వైసీపీ, జ‌గ‌న్ సొంత మీడియా తెరతీసిందని రామయ్య తెలిపారు. ప్రభుత్వ విధానాలపై, ప్రజల కష్టాలపై   చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల ప్రసాదమైన లడ్డూ ధరలు పెంచారని, అదేవిధంగా మద్యం ధరలు కూడా ఇష్టానుసారం పెంచి ప్రజల్ని   దోచుకుంటున్నారని చెబితే, ఆయన  తిరుమల లడ్డూప్రసాదాన్ని, మద్యంతో పోల్చాడంటూ విషప్రచారం చేయడం దుర్మార్గం కాదా అని రామయ్య ధ్వజమెత్తారు. బూతుపంచాంగం పఠించేవాడికి మంత్రిపదవి ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి, డిక్లరేషన్‌ ఇవ్వకుండా తిరుమల పవిత్రతను మంటగలిపింది గాక, మంత్రితో ఇష్టానుసారం మాట్లాడిస్తూ తన చర్యను సమర్థించుకోవాలని చూడటం దారుణ మన్నారు. తిరుమల ఆలయ గురించి మంత్రి వాడిన భాషపై, కొందరు ఫిర్యాదు చేస్తే, దానికి ప్రతిగా చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల స్పష్టంచేశారు. తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే అన్యమతాల వారందరూ వేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మక ముందని డిక్లరేషన్‌ ఇచ్చాకే ఆయన్ని దర్శించుకుంటారని, అందుకు పూర్తివిరుద్ధంగా ప్రవర్తించిన జగన్మోహన్‌రెడ్డి తాను చేసింది తప్పని ఒప్పుకొని, ఇకముందు ఇలాంటి పొరపాట్లు చేయనని బహిరంగంగా రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు. డిక్లరేషన్‌ ఇవ్వని జగన్మోహన్‌రెడ్డిని, బంధుప్రీతితో, ముఖ్యమంత్రనే సాకుతో నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి దర్శనానికి అనుమతించిన టీటీడీ చైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డి కూడా తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలన్నారు. తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వకుండా ముఖ్యమంత్రి చట్టాన్ని అతిక్రమిస్తే, అన్యమతస్తుడి నుంచి డిక్లరేషన్‌ తీసుకోనందుకు సుబ్బారెడ్డి, జగన్‌ని వెనకేసుకొస్తూ మాట్లాడినందుకు మంత్రి కొడాలినాని, తమ తప్పులు తెలుసుకొని వేంకటేశ్వరస్వామిని క్షమాపణ వేడుకోవాలని రామయ్య డిమాండ్‌చేశారు. జగన్‌ చర్యని ప్రశ్నించే హక్కు ప్రతి హిందువుకి ఉంటుందని, హైందవుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి నానీని తక్షణమే కేబినెట్‌నుంచి ముఖ్యమంత్రి బర్తరఫ్‌ చేయాలని వర్ల సూచించారు. చేసిన తప్పుని తెలుసుకొని, క్షమాపణ కోరడం విజ్ఞుల లక్షణమని, ముఖ్యమంత్రిజగన్‌, వై.వీ.సుబ్బారెడ్డి, కొడాలినాని విజ్ఞతేమిటో వారి విచక్షణకే వదిలేస్తున్నట్లు రామయ్య తెలిపారు.


మసీదులు, గురుద్వారాల్లో ఇలానే ప్రవర్తిస్తారా..?: ఆనంద్‌సూర్య
తన చర్యలతో, అహంకారంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసిన రాష్ట్రముఖ్యమంత్రి, మసీదుల్లో, గురుద్వారాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి, ఆయామత సంప్రదాయాలను ఉల్లంఘించగలరా అని రాష్ట్రబ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌సూర్య నిలదీశారు. సుమారు 138 ఏళ్ల క్రితమే, 1890లో ఆనాటి బ్రిటీష్‌ రాజకీయవేత్త విలియం కేన్స్‌ తను రాసిన పుస్తకంలో తిరుమల వేంకటేశ్వరస్వామి మహిమను ప్రస్తావించాడన్నారు. అధికారంలో ఉన్నామని, ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే సమాజం చూస్తూ ఊరుకోదనే విషయాన్ని జగన్మోహన్‌రెడ్డి గ్రహించాలని ఆనంద్‌సూర్య హితవు పలికారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image