25.02.20, తాడేపల్లి
...............
ప్లాస్టిక్ నిషేధంలో టీటీడీ ముందంజను ప్రశంసించిన
- 'నేషనల్ ఎర్త్ నెట్ వర్క్'
పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ ను నిషేధించడంలో టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) పలు చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో ప్రత్యామ్నాయాలను చేపట్టింది... టిటిడి ప్లాస్టిక్ నిషేధం కోసం చేపట్టిన చర్యలపై ఢిల్లీకి చెందిన స్వచ్చంద సంస్థ నేషనల్ ఎర్త్ నెట్ వర్క్ ప్రశంసలు కురిపించారు...
మంగళవారం తాడేపల్లిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ సమన్వయకర్త జి.అక్షయ్, ఏపీ టీమ్ సభ్యులు రిఖీ, భరత్ చంద్ కలిసి ప్రసంసాపత్రాన్ని (certificate of appreciation) అందజేశారు. ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం టిటిడి అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాగా భక్తులు తిరుమలకు ఎక్కువ భాగం బస్సుల్లో చేరుకుంటారని దీనితో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపేటనున్నట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తోందని ఆయన చెప్పారు. తిరుమలతోపాటు తిరుపతిలో కూడా ప్లాస్టిక్ నిషేధం పూర్తి స్థాయిలో అములు చేసేందుకు టిటిడి అన్ని వేళాల ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణపై ఎనలేని కృషి చేస్తున్న నేషనల్ ఎర్త్ నెట్ వర్క్' టీటీడీ చర్యలను ప్రశంసించడంతో దేవస్థానం బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు.