ప్లాస్టిక్ నిషేధంలో  టీటీడీ ముందంజను ప్రశంసించిన  - 'నేషనల్ ఎర్త్ నెట్ వర్క్'

25.02.20, తాడేపల్లి
...............
ప్లాస్టిక్ నిషేధంలో  టీటీడీ ముందంజను ప్రశంసించిన 
- 'నేషనల్ ఎర్త్ నెట్ వర్క్'


పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ ను నిషేధించడంలో టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) పలు చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో ప్రత్యామ్నాయాలను  చేపట్టింది... టిటిడి ప్లాస్టిక్ నిషేధం కోసం చేపట్టిన చర్యలపై  ఢిల్లీకి చెందిన స్వచ్చంద సంస్థ నేషనల్ ఎర్త్ నెట్ వర్క్ ప్రశంసలు కురిపించారు...


మంగళవారం తాడేపల్లిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ సమన్వయకర్త జి.అక్షయ్, ఏపీ టీమ్ సభ్యులు రిఖీ, భరత్ చంద్ కలిసి ప్రసంసాపత్రాన్ని (certificate of appreciation) అందజేశారు. ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం టిటిడి అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాగా భక్తులు  తిరుమలకు ఎక్కువ భాగం బస్సుల్లో చేరుకుంటారని దీనితో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపేటనున్నట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తోందని ఆయన చెప్పారు. తిరుమలతోపాటు తిరుపతిలో కూడా ప్లాస్టిక్ నిషేధం పూర్తి స్థాయిలో అములు చేసేందుకు టిటిడి అన్ని వేళాల ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణపై ఎనలేని కృషి చేస్తున్న నేషనల్ ఎర్త్ నెట్ వర్క్' టీటీడీ చర్యలను ప్రశంసించడంతో దేవస్థానం  బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు