కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

 


28–03–2020
అమరావతి


  *కోవిడ్‌–19 నివారణపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం
డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు.


రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తీరు, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అమలు అంశాలపై చర్చ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తీరు, అలాగే ఆయా కేసుల నివారణ కోసం అందిస్తున్న వైద్య విధానాలు, డేటా విశ్లేషణ ద్వారా చేపట్టాల్సిన ప్రణాళికపై సమావేశంలో విస్తృత చర్చ


రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తీరును సీఎంకు వివరించిన సీఎస్‌ నీలం సాహ్ని
లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసరాలు సమకూర్చుకునేందుకు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటలవరకూ ఉన్న సమయాన్ని తగ్గించాలన్న అంశంపై అధికారుల ప్రస్తావన
నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు, వారి సంఖ్యకు తగినట్టుగా రైతు బజార్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉన్నాయా?లేవా? అవి వారికి అందుబాటులో ఉన్నాయా? అన్నదానిపై ముందు పరిశీలన చేయాలని సీఎం ఆదేశం
శాస్త్రీయంగా పరిశీలించి, వాటిని మ్యాపింగ్‌ చేయాలన్న సీఎం
ఈ ప్రక్రియ పూరై్తన తర్వాత ఒక అవగాహనకు రావాలన్న సీఎం
ప్రజలకు సరిపడా రైతుజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులోకి తెచ్చిన తర్వాత సమయాన్ని తగ్గించే ఆలోచనలు చేయండి:
ఆ ఆలోచన చేసేముందు ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోండి:
చర్యలు తీసుకున్న తర్వాతే పరిశీలనచేసి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాత మాత్రమే సమయం తగ్గించడంపై నిర్ణయాలు తీసుకోండి: సీఎం


పొరుగు రాష్ట్రాలనుంచి ఏపీకి చెందిన కొందరు కూలీలు, కార్మికులు తరలిరావడంపై సమావేశంల విస్తృత చర్చ
ఎక్కడివారు అక్కడే ఉండాలంటూ కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించిన అధికారులు
ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు వీరి బాగోగులు చూసేలా మార్గదర్శకాలు ఉన్నాయన్న అధికారులు
వివిధ జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఎక్కడి వారు అక్కడే ఉండేలా చూడాలని సమావేశంలో నిర్ణయం
ఈ  మేరకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మాట్లాడాలని సీఎం ఆదేశం
అక్కడ ఉన్న మన ప్రజలకు అందేలా చూడాలంటూ ఆదేశాలు జారీచేసిన సీఎం
పొరుగురాష్ట్రాల్లో ఏపీ ప్రజల బాగోగులను చూసేందుకు, ఆయా రాష్ట్రాల అధికారులు, ప్రధాన కార్యదర్శులతో సమన్వయం చేయడానికి, అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన వారి బాగోగులు చూసుకోవడానికి ఐఏఎస్‌ అ«ధికారులు సతీష్‌ చంద్ర, మనీష్‌ కుమార్‌లను నియమించిన సీఎం
ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి
14రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడే వారికే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వండి:
వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పించండి:
అలాగే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి సరిహద్దుల్లో ఉన్న వారికి వసతులను ఏర్పాటు చేయాలని, వారిని బాగా చూసుకోవాలని ఆదేశం
ఏర్పాట్లు చేయడానికి,  వారి బాగోగులు చూసుకోవడానికి ప్రతి క్యాంపుకూ ఒక అధికారిని నియమించాలని సీఎం స్పష్టీకరణ
ఇతరరాష్ట్రాల్లో ఉన్న మన వారి బాగోగులు చూసుకోవడానికి, ఎక్కడి వారు అక్కడ ఉండేలా చూడ్డానికి, వారికి సదుపాయాలు అందేలా చూడ్డంకోసం ఆయారాష్ట్రాల అధికారులు, సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడే బాధ్యతలను ఒక ఐఏఎస్‌ అధికారికి అప్పగించాలన్న ముఖ్యమంత్రి
అలాగే సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన, ఏర్పాటు చేయాల్సిన క్యాంపులు, అక్కడ క్వారంటైన్‌ సదుపాయాలు, అందులో ఉన్న వారికి భోజన, వసతి సదుపాయాలు తదితర అంశాలకు సంబంధించిన బాధ్యతలను మరొక ఐఏఎస్‌ అధికారికి అప్పగించాలన్న సీఎం
వారిని బాగా చూసుకోవడలేదనే మాట రాకూడదు:
సరిహద్దుల్లో అందుబాటులో ఉన్నకళ్యాణ మండపాలు, హోటళ్లు తదితర వాటిని గుర్తించి వాటిని శానిటైజ్‌ చేసి, అందుబాటులోకి తీసుకురావాన్న సీఎం


వాలంటీర్ల సర్వే...:


వాలంటీర్లు చేసిన రెండో సర్వే, ఫలితాల ఆధారంగా తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసిన సీఎం
జిల్లాల్లో కోవిడ్‌ –19 నివారణ చర్యలకోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే డాక్టర్లను గుర్తించి వారి సేవలను తీసుకోవాలని సీఎం ఆదేశం
తమ సర్వే ద్వారా వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు గుర్తించిన వారిని డాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి... నిర్దేశించుకున్న ప్రోటోకాల్‌ ప్రకారం వారికి వైద్యం అందించేలా చేయాలని సీఎం ఆదేశం
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులకు సంబంధించి 10 కేసుల్లో 9 కేసులు అర్బన్‌లో, రూరల్‌లో 1 కేసు లెక్కన నమోదవుతున్నాయన్న అధికారులు 
అందుకే అర్బన్‌ ఏరియాలపై మరింత దృష్టిసారిస్తున్నామన్న అధికారులు


వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయం
వైరస్‌ విస్తరించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత పటిష్టంగా నివారణా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయం
ఇదే సమయంలో ప్రజలకు నిత్యావసరాలు, తాగునీరు, మందులు, పారిశుద్ధ్యం తదితర ఇబ్బందులు రాకుండా పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని సీఎం ఆదేశం
వీటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత మరిన్ని చర్యలపై ముందుకు వెళ్తామన్న అధికారులు


వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా వీలైనంత మంది ఎక్కడు వైద్యులను సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావడంపై సమావేశంలో చర్చ 
కోవిడ్‌నివారణా చర్యలకోసం హౌస్‌ సర్జన్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి పర్యవేక్షణలో ఉన్న ప్రతి 10 మందికీ ఒక డాక్టరు కేటాయింపు, వీరిపైన పల్మనాలజిస్ట్‌ల పర్యవేక్షణ
వీరి పని సాఫీగా సాగేందుకు, అనువైన సలహాలు, సూచనలు, వైద్య ప్రక్రియలపై అవగాహనకు డాక్టర్లు, స్పెషలిస్టులు మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశం
ప్రతి యాభై ఇళ్ల తాలూకు పరిస్థితులను ఎప్పటికప్పుడు వాలంటీర్లు నమోదు చేసేలా, ఆ విధానాన్ని నిరంతరం కొనసాగించాలన్న సీఎం
వాలంటీర్లు, ఆశావర్కర్లు. వైద్యులకు వైరస్‌ సోకకుండా వారికి కావాల్సిన ప్రొటెక్షన్‌ సూట్లు, పరికరాలు అందించాలని సీఎం ఆదేశం
కరోనా కేసుల టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచడంపైన కూడా దృష్టిపెట్టాలన్న సీఎం
ఎవరికి లక్షణాలు కలించినా వారిని ఐసోలేషన్‌లో పెట్టాలన్న సీఎం


గూడ్స్, నిత్యావసర వస్తువుల వాహనాలను నిలిపేస్తున్నారంటూ ఫీడ్‌ బ్యాంకు వస్తోందన్న సీఎం
దీనిపై వెంటనే దృష్టిపెట్టాలని డీజీపీకి ఆదేశం
గూడ్స్, వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ రంగాలకు సంబంధించిన వాహనాలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆక్వాకు సంబంధించి కరోనా కారణంగా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
సంబంధిత శాఖాధికారులు దీనిపై దృష్టిపెట్టాలన్న సీఎం
ఉదయం 6 నుంచి 1 గంటవరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో, సామాజిక దూరంతో వ్యవసాయ కార్యకలాపాలు చేసుకునేవారికి అవకాశం కల్పించాలన్న సీఎం
ఈ సమయంలో సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలన్న సీఎం


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image