కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

 


28–03–2020
అమరావతి


  *కోవిడ్‌–19 నివారణపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం
డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు.


రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తీరు, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అమలు అంశాలపై చర్చ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తీరు, అలాగే ఆయా కేసుల నివారణ కోసం అందిస్తున్న వైద్య విధానాలు, డేటా విశ్లేషణ ద్వారా చేపట్టాల్సిన ప్రణాళికపై సమావేశంలో విస్తృత చర్చ


రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న తీరును సీఎంకు వివరించిన సీఎస్‌ నీలం సాహ్ని
లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసరాలు సమకూర్చుకునేందుకు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటలవరకూ ఉన్న సమయాన్ని తగ్గించాలన్న అంశంపై అధికారుల ప్రస్తావన
నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు, వారి సంఖ్యకు తగినట్టుగా రైతు బజార్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉన్నాయా?లేవా? అవి వారికి అందుబాటులో ఉన్నాయా? అన్నదానిపై ముందు పరిశీలన చేయాలని సీఎం ఆదేశం
శాస్త్రీయంగా పరిశీలించి, వాటిని మ్యాపింగ్‌ చేయాలన్న సీఎం
ఈ ప్రక్రియ పూరై్తన తర్వాత ఒక అవగాహనకు రావాలన్న సీఎం
ప్రజలకు సరిపడా రైతుజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులోకి తెచ్చిన తర్వాత సమయాన్ని తగ్గించే ఆలోచనలు చేయండి:
ఆ ఆలోచన చేసేముందు ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోండి:
చర్యలు తీసుకున్న తర్వాతే పరిశీలనచేసి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాత మాత్రమే సమయం తగ్గించడంపై నిర్ణయాలు తీసుకోండి: సీఎం


పొరుగు రాష్ట్రాలనుంచి ఏపీకి చెందిన కొందరు కూలీలు, కార్మికులు తరలిరావడంపై సమావేశంల విస్తృత చర్చ
ఎక్కడివారు అక్కడే ఉండాలంటూ కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించిన అధికారులు
ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు వీరి బాగోగులు చూసేలా మార్గదర్శకాలు ఉన్నాయన్న అధికారులు
వివిధ జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఎక్కడి వారు అక్కడే ఉండేలా చూడాలని సమావేశంలో నిర్ణయం
ఈ  మేరకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మాట్లాడాలని సీఎం ఆదేశం
అక్కడ ఉన్న మన ప్రజలకు అందేలా చూడాలంటూ ఆదేశాలు జారీచేసిన సీఎం
పొరుగురాష్ట్రాల్లో ఏపీ ప్రజల బాగోగులను చూసేందుకు, ఆయా రాష్ట్రాల అధికారులు, ప్రధాన కార్యదర్శులతో సమన్వయం చేయడానికి, అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన వారి బాగోగులు చూసుకోవడానికి ఐఏఎస్‌ అ«ధికారులు సతీష్‌ చంద్ర, మనీష్‌ కుమార్‌లను నియమించిన సీఎం
ఈ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి
14రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడే వారికే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వండి:
వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పించండి:
అలాగే ఇతర రాష్ట్రాలనుంచి వచ్చి సరిహద్దుల్లో ఉన్న వారికి వసతులను ఏర్పాటు చేయాలని, వారిని బాగా చూసుకోవాలని ఆదేశం
ఏర్పాట్లు చేయడానికి,  వారి బాగోగులు చూసుకోవడానికి ప్రతి క్యాంపుకూ ఒక అధికారిని నియమించాలని సీఎం స్పష్టీకరణ
ఇతరరాష్ట్రాల్లో ఉన్న మన వారి బాగోగులు చూసుకోవడానికి, ఎక్కడి వారు అక్కడ ఉండేలా చూడ్డానికి, వారికి సదుపాయాలు అందేలా చూడ్డంకోసం ఆయారాష్ట్రాల అధికారులు, సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడే బాధ్యతలను ఒక ఐఏఎస్‌ అధికారికి అప్పగించాలన్న ముఖ్యమంత్రి
అలాగే సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన, ఏర్పాటు చేయాల్సిన క్యాంపులు, అక్కడ క్వారంటైన్‌ సదుపాయాలు, అందులో ఉన్న వారికి భోజన, వసతి సదుపాయాలు తదితర అంశాలకు సంబంధించిన బాధ్యతలను మరొక ఐఏఎస్‌ అధికారికి అప్పగించాలన్న సీఎం
వారిని బాగా చూసుకోవడలేదనే మాట రాకూడదు:
సరిహద్దుల్లో అందుబాటులో ఉన్నకళ్యాణ మండపాలు, హోటళ్లు తదితర వాటిని గుర్తించి వాటిని శానిటైజ్‌ చేసి, అందుబాటులోకి తీసుకురావాన్న సీఎం


వాలంటీర్ల సర్వే...:


వాలంటీర్లు చేసిన రెండో సర్వే, ఫలితాల ఆధారంగా తీసుకుంటున్న చర్యలపై ఆరాతీసిన సీఎం
జిల్లాల్లో కోవిడ్‌ –19 నివారణ చర్యలకోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే డాక్టర్లను గుర్తించి వారి సేవలను తీసుకోవాలని సీఎం ఆదేశం
తమ సర్వే ద్వారా వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు గుర్తించిన వారిని డాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి... నిర్దేశించుకున్న ప్రోటోకాల్‌ ప్రకారం వారికి వైద్యం అందించేలా చేయాలని సీఎం ఆదేశం
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులకు సంబంధించి 10 కేసుల్లో 9 కేసులు అర్బన్‌లో, రూరల్‌లో 1 కేసు లెక్కన నమోదవుతున్నాయన్న అధికారులు 
అందుకే అర్బన్‌ ఏరియాలపై మరింత దృష్టిసారిస్తున్నామన్న అధికారులు


వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయం
వైరస్‌ విస్తరించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత పటిష్టంగా నివారణా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయం
ఇదే సమయంలో ప్రజలకు నిత్యావసరాలు, తాగునీరు, మందులు, పారిశుద్ధ్యం తదితర ఇబ్బందులు రాకుండా పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని సీఎం ఆదేశం
వీటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత మరిన్ని చర్యలపై ముందుకు వెళ్తామన్న అధికారులు


వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా వీలైనంత మంది ఎక్కడు వైద్యులను సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావడంపై సమావేశంలో చర్చ 
కోవిడ్‌నివారణా చర్యలకోసం హౌస్‌ సర్జన్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి పర్యవేక్షణలో ఉన్న ప్రతి 10 మందికీ ఒక డాక్టరు కేటాయింపు, వీరిపైన పల్మనాలజిస్ట్‌ల పర్యవేక్షణ
వీరి పని సాఫీగా సాగేందుకు, అనువైన సలహాలు, సూచనలు, వైద్య ప్రక్రియలపై అవగాహనకు డాక్టర్లు, స్పెషలిస్టులు మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశం
ప్రతి యాభై ఇళ్ల తాలూకు పరిస్థితులను ఎప్పటికప్పుడు వాలంటీర్లు నమోదు చేసేలా, ఆ విధానాన్ని నిరంతరం కొనసాగించాలన్న సీఎం
వాలంటీర్లు, ఆశావర్కర్లు. వైద్యులకు వైరస్‌ సోకకుండా వారికి కావాల్సిన ప్రొటెక్షన్‌ సూట్లు, పరికరాలు అందించాలని సీఎం ఆదేశం
కరోనా కేసుల టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచడంపైన కూడా దృష్టిపెట్టాలన్న సీఎం
ఎవరికి లక్షణాలు కలించినా వారిని ఐసోలేషన్‌లో పెట్టాలన్న సీఎం


గూడ్స్, నిత్యావసర వస్తువుల వాహనాలను నిలిపేస్తున్నారంటూ ఫీడ్‌ బ్యాంకు వస్తోందన్న సీఎం
దీనిపై వెంటనే దృష్టిపెట్టాలని డీజీపీకి ఆదేశం
గూడ్స్, వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ రంగాలకు సంబంధించిన వాహనాలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆక్వాకు సంబంధించి కరోనా కారణంగా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
సంబంధిత శాఖాధికారులు దీనిపై దృష్టిపెట్టాలన్న సీఎం
ఉదయం 6 నుంచి 1 గంటవరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో, సామాజిక దూరంతో వ్యవసాయ కార్యకలాపాలు చేసుకునేవారికి అవకాశం కల్పించాలన్న సీఎం
ఈ సమయంలో సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించేలా చూడాలన్న సీఎం