ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా?: చంద్రబాబు

ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యమా?: చంద్రబాబు
అమరావతి: స్థానిక ఎన్నికల వాయిదాపై సీఎం జగన్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మీడియా సమావేశం ద్వారా అజ్ఞానాన్ని ఆయన బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కరోనా వైరస్‌ మహమ్మారిగా మారిందని.. దీని బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటిందని.. 5వేల మందికి పైగా చనిపోయారని చెప్పారు. చైనా, ఇటలీ దేశాల్లో ఔషధ దుకాణాలు తప్ప అన్నింటినీ మూసివేశారన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి అమెరికా రూ.3.50లక్షల కోట్లు కేటాయించిందని చంద్రబాబు వివరించారు. ఈ మహమ్మారి ప్రభావంతో లండన్‌లోనూ స్థానిక ఎన్నికలను నిలిపివేశారని ఆయన గుర్తు చేశారు. పరిస్థితి ఈ స్థాయిలో ఉన్నా జగన్‌ ఎస్‌ఈసీపై ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ఎవరు చెప్పినా వినరు అనేదానిపై సీఎం జగన్‌ వ్యాఖ్యలే ఉదాహరణ అని ఆక్షేపించారు. 
ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారా?
కరోనా వైరస్‌ చాలా ప్రమాదకరమని అన్ని దేశాలు హెచ్చరిస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. కరోనా వ్యాప్తి చెందితే మనదేశంలో ఆస్పత్రులు కూడా సరిపోవని.. గ్రామాలన్నీ క్వారంటైన్లు మారిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు ఈ సీఎంకు లేదని.. కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా? అని జగన్‌ను ప్రశ్నించారు. ‘‘ఏ ఒక్క రాష్ట్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా దేశం మొత్తానికి ప్రమాదం. ఒక సీఎం ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారా? జగన్‌కు సర్వాధికారాలు ఎవరిచ్చారు? రాజ్యాంగం నుంచే ఆయనకు అధికారాలు వచ్చాయి. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ. ఎన్నికల నియమాలు అన్ని పార్టీలకు ఒకే విధంగా ఉంటాయి. రాజకీయాలు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి ఈ సీఎంకు పట్టడం లేదు’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. 
రమేశ్‌కుమార్‌ను మేం నియమించలేదు
స్థానిక ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలను బెదిరించి ఏకగ్రీవం చేసుకుంటే తాము గౌరవించాలా? అని ప్రశ్నించారు. తెదేపా నేతల ఇంటికి తెల్లవారుజామునే వెళ్లి బెదిరించారని.. 111 మంది తెదేపా అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని చెప్పారు. పులివెందుల రాజకీయాన్ని రాష్ట్ర మొత్తం చేస్తానంటే ఊరుకోనని హెచ్చరించారు. ‘‘నేను అధికారంలో ఉన్నప్పుడూ ఇలాగే చేసి ఉంటే వైకాపా పరిస్థితి ఎలా ఉండేది? ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను మేం నియమించలేదు. నేను సీఆర్‌ బిశ్వను ఎస్‌ఈసీగా ప్రతిపాదించా. అప్పటి గవర్నర్‌ గవర్నర్‌ నరసింహన్‌ మాత్రం రమేశ్‌కుమార్‌ను ప్రతిపాదించారు. ఆవిధంగా రమేశ్‌కుమార్‌ నియామకం జరిగింది. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు ఆయన నియామకాన్ని జగన్‌ నాకు ఆపాదిస్తున్నారు’’ అని తెదేపా అధినేత వివరించారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image