దయచేసి ఎక్కడి వారు అక్కడే ఉండండి: సీఎం వైయస్.జగన్ విజ్ఞప్తి

*26.03.2020*
*అమరావతి*


*కోవిడ్‌–19 వైరస్‌ నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌*


*సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం – ముఖ్యాంశాలు:*


*దయచేసి ఎక్కడి వారు అక్కడే ఉండండి: సీఎం వైయస్.జగన్ విజ్ఞప్తి*
*కేవలం 3 వారాల పాటు ఇళ్లలో ఉండిపొండి : సీఎం*
*అప్పుడే ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడతాం: సీఎం*
*దయచేసి అర్ధం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను: సీఎం వైయస్‌.జగన్‌*


- ఇలాంటి వ్యాధులు 100 ఏళ్లకు ఒకసారి కూడా వస్తాయో? రావో?. మన జనరేషన్‌లో చూస్తామో? లేదో?
-దీన్ని కేవలం క్రమశిక్షణతోనే నివారించగలం
- నిర్లక్ష్యం చేస్తే ఏం జరిగిందో కొన్ని దేశాల్లో చూశాం


*కొన్ని నిర్ణయాలు తప్పవు*
– అందుకే కొన్ని నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోతే, అనర్థం జరుగుతుందన్న భయం కూడా ఉంది
- కాబట్టి అందరూ సహకరించాలి
-నిన్న రాత్రి జరిగన కొన్ని ఘటనలు మనసును కలిచి వేశాయి
- మన వాళ్లను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదని బాధనిపించింది
 -కానీ అందరం ఒక్కసారి ఆలోచన చేయాలి
 -ఇవాళ అందరం ఇళ్లకే పరిమితం కాకపోతే వ్యాధిని అదుపు చేయలేం.
 -ఇవాళ కూడా పొందుగుల, దాచేపల్లి, నాగార్జునసాగర్‌ సరిహద్దుల్లో ఇదే పరిస్థితి
– ఒకసారి ప్రదేశం మారితే, వారు ఎందరితోనో  కాంటాక్ట్‌లోకి వస్తున్నారు వారు ఇంకా ఎంత మందితో కాంటాక్ట్‌లోకి వెళ్తారో తెలియదు
 వారిని ట్రేస్‌ చేయడం చాలా కష్టం
 ఏప్రిల్‌ 14 వరకు మనం ఎక్కడికీ వెళ్లకుండా, ఇళ్లలోనే ఉంటే, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఈజీగా తెలుస్తుంది
 వ్యాధి సోకిన వారిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించవచ్చు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కానీ, ఇక్కడ కూడా ఒక ఊరి నుంచి మరో ఊరుకు పోవద్దు
 మూడు వారాల పాటు నియంత్రణ పాటించండి
 ఎక్కడి వారు అక్కడే ఉండమని కోరుతున్నాను
 మన వాళ్లను మనమే ఆపాల్సి రావడం బాధనిపిస్తోంది.
 నిన్న కూడా 44 మందిని, మార్కాపూర్, కందుకూరు వద్ద 152 మందిని అనుమతి ఇచ్చాం.
 వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచక తప్పదు.
 ఎందుకంటే వారు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు, ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నారో తెలియదు
 వారిని మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చినా వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచక తప్పదు
 కాబట్టి పరిస్థితి అర్ధం చేసుకోండి.


*తెలంగాణ సీఎం సానుకూల స్పందన*
- తెలంగాణ  సీఎం కేసీఆర్‌ గారితో మాట్లాడాం    ఆయన కూడా చాలా పాజిటివ్‌గా స్పందించారు
- ఎవరికి అవసరమైనా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే, వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది
 -కేసీఆర్‌ గారు ఎంతో ఆప్యాయత చూపారు అందరినీ తాను చూసుకుంటానని చెప్పారు


*రాష్ట్రంలో ఎన్ని కేసులు?*
 రాష్ట్రంలో ఇప్పటికి 10 కేసులు పాజిటివ్‌గా తేలాయి, వదిలేస్తే అది ఎంత వరకు పోతుందో తెలియదు.
ఈ 10 కేసులు పెరగకుండా ఉండాలంటే అందరూ సమష్టిగా కృషి చేయాలి


*విదేశాల నుంచి ఎందరొచ్చారు?*
 విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని సర్వే చేసి ట్రాక్‌లో పెట్టడం జరిగింది. 
– మొత్తం 27,819 మంది రాగా, వారిని నిఘాలో పెట్టాం.
 వారు ఎందరితో కాంటాక్ట్‌లో ఉన్నారో.. వారు ఇంకా ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నారో ఆలోచించాలి.


*వారి సేవలు అభినందనీయం*
– గ్రామ స్థాయిలో వలంటీర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లకు హ్యాట్సాఫ్‌. 
– ఎవరూ చేయని పని వారు చేస్తున్నారు. అందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు.
– ఇంటింటికి తిరిగి సర్వే  ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేయడం వల్లనే కేవలం 10 కేసులకే పరిమితం కాగలిగాం.
– ఇదే సమయంలో మనమూ స్వయం క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించకపోతే ఇబ్బంది పడతాం.


*అన్ని చోట్ల వైద్య సదుపాయాలు*
– విశాఖ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి.. 4 చోట్ల క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రుల ఏర్పాటు చేశాం.
– ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లతో పాటు, అదనపు బెడ్లు అందుబాటులో ఉన్నాయి.
– ప్రతి జిల్లాలో 200 బెడ్లతో చికిత్స కేంద్రాలు (క్వారంటైన్‌ సెంటర్లు)  ఏర్పాటు.
– అలాగే ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం.
– ప్రైవేటు సెక్టార్‌లో కూడా వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ విధంగా అన్ని విధాలుగా సిద్థంగా ఉన్నాం.


*1902 హెల్ప్‌లైన్‌.*
– ఎవరికి ఏ రకమైన అవసరం ఉన్నా, ఇబ్బంది వచ్చినా కాల్‌ చేయండి.
– సీనియర్‌ ఐఏఎస్‌ కృష్ణబాబుతో పాటు, మరో 10 మంది ఉన్నతాధికారులను ఏర్పాటు చేశాం.
– ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలకు 104 నెంబర్‌ కూడా అందుబాటులో ఉంది.


*కంట్రోల్‌ రూమ్‌లు*
– రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు.
– రాష్ట్ర కంట్రోల్‌ రూమ్‌లో పదిమంది సీనియర్ అధికారులతో పాటు ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు నుంచి మరో ముగ్గురు అధికారులు ఉంటారు.                                                                                       - ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లు. 
– జిల్లా మంత్రులు జిల్లా కంట్రోల్‌ రూమ్‌లలో భాగస్వాములవుతారు. అక్కడ కూడా వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు ఉంటారు. ఎవరికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారు చూస్తారు.


*ఎవరికీ ఏ లోటూ ఉండదు*
– ఎవరికీ ఆహారం, వసతి ఇతర సౌకర్యాల లోటు లేకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం.
– మీకు ఏ ఇబ్బంది ఉన్నా 1902 కు ఫోన్‌ చేయండి. వెంటనే కలెక్టర్‌ యాక్టివేట్‌ అవుతారు. మీ సమస్యలు పరిష్కరిస్తారు. కాబట్టి ఎక్కడికి కదలకండి.
– సరుకుల రవాణా వాహనాలకు అనుమతి ఇచ్చాం. నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు.
– రైతు బజార్లను విస్తరిస్తున్నాం. ప్రజల సంఖ్య, వారి అవసరాలు గుర్తించి కేవలం 2 నుంచి 3 కి.మీ పరిధిలో రైతు బజార్లతో పాటు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి.
– ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నీ తెరిచి ఉంటాయి. కాబట్టి అవసరమైనవి తీసుకుని, ఆ తర్వాత ఇళ్లలోనే ఉండండి.


*రైతులకూ సోషల్‌ డిస్టెన్స్‌*
– పంటలు కోతకు వస్తున్నాయి. కాబట్టి తప్పదు అనుకుంటే రైతులు, రైతు కూలీలు పనులకు వెళ్లండి. కానీ అక్కడ తప్పనిసరిగా సామాజిక దూరం మెయిన్‌టెయిన్‌ చేయమని విజ్ఞప్తి.
– గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం. పంచాయతీ రాజ్, పురపాలక పరిపాలన శాఖలకు నిర్దేశించాం.


*రేషన్‌ సరుకులు–ఆర్థిక సహాయం*
– బియ్యం, పప్పు ఈనెల 29 నుంచి రేషన్‌ షాపుల్లో అందుబాటులోకి వస్తాయి.
– ఏప్రిల్‌ 4న ప్రతి కుటుంబానికి రూ.1000 డోర్‌ డెలివరీ చేస్తాం.


– ఇలాంటి పరిస్థితి 100 ఏళ్లకు ఒకసారి కూడా వస్తుందో లేదో తెలియదు. కాబట్టి అందరం కలిసి పని చేయాలి. 
– ప్రభుత్వం నుంచి ఏ లోటూ రాకుండా చూస్తాం.
 మరొక్కసారి విజ్ణప్తి చేస్తున్నా, _మూడు వారాల పాటు ఎక్కడివారు అక్కడే ఆగిపోండి


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image