అత్యంత క్లిష్ట స‌మ‌యంలోనూ ప్ర‌యాణికుల ఆరోగ్య‌భ‌ద్ర‌త‌కు ద‌.మ రైల్వే పెద్ద‌పీట

ఐసోలేష‌న్ వార్డులుగా మారిన రైల్వే కోచ్‌లు...
* కోవిడ్‌-19 నియంత్ర‌ణ‌కు ద‌.మ రైల్వే ప్ర‌త్యేక చ‌ర్య‌లు 
* రైల్వేబోర్డు సూచించిన లక్ష్యానికి అనుగుణంగా 486 రైలు కోచ్‌లు మార్పు 
* అత్యంత క్లిష్ట స‌మ‌యంలోనూ ప్ర‌యాణికుల ఆరోగ్య‌భ‌ద్ర‌త‌కు ద‌.మ రైల్వే పెద్ద‌పీట
హైైదరాబాద్  ఏప్రిల్ 24:  కోవిడ్-19తో జరిగే పోరాటంలో జాతి ప్రయత్నాలకు దోహదంగా క‌రోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశలో భారతీయ రైల్వే బహుముఖ వ్యూహాలను అమలుచేస్తూ ముందడుగు వేస్తుంది. ఈ ప్రయత్నాలలో భాగంగా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా ఐదు వేల నాన్ ఏసి ప్రయాణికుల కోచ్‌ల‌ను ఐసోలేషన్ వార్డులుగా మార్చాల‌ని అన్ని రైల్వే జోన్‌ల‌కు సూచించింది. ఈ క్ర‌మంలో 5000 నాన్ ఏసి కోచ్‌ల సంఖ్యలో దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క లక్ష్యంగా 486 కోచ్‌లు తయారు చేయాలని రైల్వే బోర్డు సూచించింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ఆదేశాల మేర‌కు అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. నిర్దేశించిన లక్ష్యంలోగా ఆయా కోచ్‌ల‌ను ఐసోలేష‌న్ వార్డులుగా మార్చాల‌ని సంకల్పించారు. చేపట్టిన కార్యాన్ని త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసేందుకు కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయాల‌ని లాలాగూడ మరియు తిరుపతి వర్క్‌షాప్‌ల‌కు సూచిస్తూ జోన్‌లోని 6 డివిజన్లు, 2 వర్క్‌షాప్‌లు ఈ కార్యభారాన్ని పంచుకోవాలని ఆదేశించారు. అదుకు అనుగుణంగా సికింద్రాబాద్ డివిజన్ ప‌రిధిలో 120 కోచ్‌లు, హైదరాబాద్ డివిజన్ ప‌రిధిలో 40 కోచ్‌లు, విజయవాడ డివిజన్ ప‌రిధిలో 50 కోచ్‌లు, గుంతకల్లు డివిజన్ ప‌రిధిలో 61 కోచ్‌లు, నాందేడ్ డివిజన్ ప‌రిధిలో 30 కోచ్‌లు, గుంటూరు డివిజన్ ప‌రిధిలో 25 కోచ్‌లు చొప్పున లాలాగూడ‌ వర్క్‌షాప్‌లో 76 కోచ్‌లు, తిరుపతి వర్క్‌షాప్‌లో 84 కోచ్‌ల‌ను ఐసోలేషన్ వార్డులుగా మార్పు చేశారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దక్షిణ మధ్య రైల్వే రంగంలోకి దిగ‌డంతో పాటు శాఖాప‌రంగా సూచించిన లక్ష్యంలోగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని 486 కోచ్‌ల‌ను ఐసోలేషన్ వార్డులుగా మార్పు చేసింది. ప్రతి ఐసోలేషన్ వార్డులో క‌రోనా  బాధితుల కోసం 8 కూపేలు మరియు వైద్య సిబ్బంది కోసం ఒక కూపే ఉంటాయి. రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని కోచ్‌ల‌లో స్నానాల గది, 3 టాయిలెట్లు, కూపేల మధ్య తెరలు, అవసరమైన ఎలక్ట్రిక్ మరియు వైద్య పరికరాలు కూడా అమర్చారు. ఆయా కోచ్‌ల‌ను ఐసోలేషన్ వార్డులుగా నిర్దేశించిన లక్ష్యంలోగా రూపొందించ‌డంలో కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ముఖ్యంగా మెకానికల్ విభాగాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్ర‌త్యేకంగా అభినందించారు.


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image