12 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ? :కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ  సూటి ప్రశ్న


విజయవాడ,ఏప్రిల్ 23 (అంతిమ తీర్పు) :ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లు కొనే ముందు ICMR ను సంప్రదించారా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ .కిట్లు కొనుగోలు విషయంలో 8 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్మోహనరెడ్డి గారి ప్రభుత్వము ఇప్పుడు ఏమి సమధానం చెబుతుంది .ICMR తాజా నిర్ణయంతో జగన్ సర్కారు గొంతులో పడిన పచ్చి వెలక్కాయ అని అన్నారు.12 కోట్లు పెట్టి ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కిట్లు కొనుగోలు చేసిన జగన్‌ ప్రభుత్వం.ఇప్పుడు ఈ నిర్ణయంతో.. బూడిదలో పోసిన 12 కోట్లు.కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం కేవలం RT-PCR పరీక్షలు మాత్రమే చేయాలని, దాని స్థానంలో ర్యాపిడ్‌ యంటి బాడీ టెస్టులు చేయవద్దని భారత వైద్య పరిశోధన  మండలి-ICMR రాష్ట్రాలకు మరోసారి సూచించింది. 


కరోనా రోగ నిర్ధారణ కోసం ముక్కులు, గొంతు నుంచి తీసుకునే స్వాబ్‌ ఆధారంగా RT-PCR టెస్టులు మాత్రమే చేయాలని కోరారు. వైరస్‌కు గురైన వ్యక్తి శరీరంలో రోగ నిరోధక శక్తులు- యాంటీబాడీలు ఎంతవరకు తయారయ్యాయని తెలుసుకోవడానికి మాత్రమే యాంటీబాడీ టెస్టులు చేస్తారని.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతోందన్న ఇకంర్.ఎట్టిపరిస్థితుల్లోనూ.. RT-PCR కిట్ల స్థానంలో యాంటిబాడీ టెస్టింగ్‌ కిట్లు ఉపయోగించకూడదని తేల్చిచెప్పిన ICMR.రాష్ట్రాలన్నీ.. ర్యాపిడ్ టెస్టుల వినియోగ విషయంలో ICMR జారీ చేసిన ప్రోటోకాల్‌ను అనుసరించాలని, కరోనా వైరస్‌ నియంత్రణ కోసం RT-PCR పరీక్షలను మాత్రమే కొనసాగించాలని స్పష్టమైన మార్గదర్శకాలు  వైద్య పరిశోధన మండలి జారీ చేసినట్లు తెలిపారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image