రోజుకు 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు :ముఖ్యమంత్రి

*19–04–2020*
*అమరావతి*


అమరావతి: సీఎం నివాసంలో కోవిడ్‌ –19 పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
నిన్న ఒక్కరోజే కరోనా 5400 టెస్టులు
జనాభా ప్రాతిపదికన ప్రతి 10 లక్షల మందికి అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో 2వ స్థానానికి చేరుకున్న ఏపీ
రాజస్థాన్ 685 చేస్తుండగా, 539 పరీక్షలతో రెండో స్థానంలో  ఏపీ
ర్యాపిడ్‌ కిట్స్‌ వినియోగించకుండానే ఈ స్థాయికి 
మరో 3–4 రోజుల్లో మరిన్ని టెస్టులు చేసే సంఖ్య బాగా పెరుగుతుందన్న అధికారులు
రోజుకు 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు
కుటుంబ సర్వేలద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షలు
కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశం
కరోనా బీమా కిందకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, వీరితోపాటు ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారిని చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలన్న సీఎం
ప్రతి 2–3 రోజులకోసారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలన్న సీఎం
తర్వాత ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా వ్యవస్థను తయారుచేయాలన్న సీఎం
మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారుచేసిన మాస్కులను పరిశీలించిన సీఎం
రెడ్‌జోన్లకు ముందస్తుగా పంపిణీచేస్తున్నామన్న అధికారులు
ప్రతి మనిషికి 3 చొప్పున మాస్కులు పంపిణీ