కస్తూరీబాయ్ 1869 ఏప్రిల్ 11 న జన్మించారు

కస్తూరీబాయ్  మఖాన్ జి కపాడియా 11-4-1869 లో ఏ రాష్ట్రం కతియవాడ్  ఏజెన్సీ బొంబాయ్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం గుజరాత్ భారతదేశం) లో జన్మించారు. తండ్రి గోకుల్ దాస్ మెకంజీ కపాడియా, తల్లి వ్రజ్  కున్వర్ బా కపాడియా దంపతులకు జన్మించింది.  వృత్తిరీత్యా కుటుంబమైన గోకుల్ దాస్ మఖాన్ జి కపాడియా మరియు కరమ్  చంద్ గాంధీ  ఇరువురు ఇరుగుపొరుగు నా నివసిస్తూ ప్రాణ స్నేహితులు గా ఉండటం వల్ల వారి స్నేహం బలపడేందుకు కస్తూర్బా, గాంధీలవివాహం 1876లో పదేళ్ళ వయసులో మోహన్‌దాస్ గాంధీ -కస్తూర్ మఖాంజీ కపాడియాల నిశ్చితార్థం జరిగింది. 13 ఏట 1882 లో వారి వివాహం సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిగింది.ఆడపిల్లలు చదువుకోవడం, మగ పిల్లలతో కలసి ఆడుకోవడం పోర్‌బందరు బనియాలలో చాలా దోషం. అంతే కాదు ఏడేళ్ళు దాటగానే పెళ్ళి చేయడం సంప్రదాయం. అందువల్ల ఆమె అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యురాలిలానే పెరిగింది.   ఆమె అత్తగారు పుత్లీబాయి హిందూ-ముస్లిం ఉమ్మడి ప్రార్థనలకు సంబంధించిన మత సంప్రదాయం పేరు "ప్రణామీ" సంప్రదాయాన్నీ ఆచరించేవారు.  అత్తగారి ఆచారాలను, భర్త ఆంక్షలతో అనేక ఆటుపోట్ల ఎదుర్కొని, తన ఒంటి మీద బంగారాన్ని అమ్మి గాంధీజీని చదువుకు లండన్ కి పంపి తిరిగి వచ్చేవరకూ అత్తగారింట్లో  గడిపారు. భారతదేశంలో గాంధీకి  ప్లీడరుగా అనేక అడ్డంకులు కారణంగా అబ్దుల్లా కంపెనీకి వకీలుగా దక్షిణాఫ్రికా వెళ్ళేటప్పటికి ఇద్దరు పిల్లల తల్లి బాధ్యత వహిస్తూ ఏడాది తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడ గాంధీ గారి ఉద్యమాలలో చేదోడువాదోడుగా ఉంటూ,  ఫినిక్స్ , టాల్స్టాయ్ ఆశ్రమాలలో ముఖ్య పాత్ర వహిస్తూ,ఆశ్రమంలో నివసిస్తున్న సభ్యులందరితో సఖ్యతవహిస్తూ,ఆశ్రమ జీవితం గడిపారు.ఇంటికి వచ్చిన అతిధులకు సేవలు చేస్తూ,అనేక అవమానాలను ఎదుర్కొంటూ, ఒకానొక సమయంలో గాంధీగారు "బా"ని గెంటి వేసిన సందర్భంలో ఆవిడ కంటినీరు చూసిన సన్నివేశం,నేనే కనుక చిత్రకారుని అయితే ఒక తైలవర్ణ చిత్రాన్నివేసేవాణ్ని అని,ఆమె వహించిన ఓర్పు తర్వాతి కాలంలో సత్యాగ్రహానికి ఉపయోగపడిందని,అనేక సందర్భాలలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా మాంసాహారం స్వీకరించకుండా ప్రకృతి వైద్యం తోనే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శ జీవితం గడిపారని ఆత్మకథలో గాంధీగారు తెలిపారు.  దక్షిణాఫ్రికాలోనే కస్తూరిబా ఉద్యమాలకు  పునాది ఏర్పడింది.దంపతులకు నలుగురు సంతానం హరిలాల్, మణిలాల్ దేవదాస్, రామ్ దాస్ ల  చదువుల విషయంలో ఇద్దరి మధ్య అనేక విభేదాలు ఏర్పడినవి. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వస్తూ వెల కట్టలేని గౌరవ అభిమానాన్ని పొంది 1915లో భారతదేశానికి తిరిగి వచ్చారు. తర్వాత కోచ్రోరోబ్ ఆశ్రమాన్ని నెలకొల్పి, ఆడపిల్లలు లేని కారణంగా లక్ష్మీ అనే దళిత కుటుంబీకుల బిడ్డను దత్తత చేసుకుని, కూతురు గా భావించి ఎంత ప్రేమగా పెంచారు.ఆ దత్తత అనేక వివాదాలు,విభేదాలకు కారణమై 1915 లో సబర్మతిఆశ్రమమాన్ని  స్థాపించడం, రాట్నం పై ఖాదీ వడకటం, ఖాదీ వస్త్రాలను ధరించడం జరిగింది.  విదేశీ వస్త్ర బహిష్కరణ కాలంలో దాదాబాయ్ నౌరోజీ గారు ఇచ్చిన విదేశీ చీర తగులపెట్టాల్సి వచ్చినపుడు తానెంతో మనస్తాపం చెందిన ని అలాంటి సందర్భం తన జీవితంలో మొట్టమొదటిసారి జరిగిందని,ఆశ్రమంలో గాంధీ గారిపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన కస్తూరిబా గాంధీ ఎలాంటి అపోహలకులోను కాకుండా ఆశ్రమవాసులు ని సమాధాన పరిచటం,  అక్కడి మహిళలందరూ సమాయత్త పరచి చురుకుగా కార్యక్రమాలు చేయించేవారని సుశీలా నాయర్ ఒక పుస్తకంలో తెలిపారు.భారత దేశమంతా పర్యటిస్తూ  మహాత్మా గాంధీ1921లో పినాకిని సత్యాగ్రహఆశ్రమం స్థాపించిన తర్వాత 1929లో మే 11వ తేదీన కనకమ్మ గారు బాలికల పాఠశాలకు గాంధీ గారిచే  శంకుస్థాపన చేయించి కస్తూరిబా బాలికల పాఠశాల అని నామకరణం చేశారు. అదే రోజు దంపతులిద్దరూ  పల్లిపాడు,పినాకినీ సత్యాగ్రహఆశ్రమంలో ఒకరోజు రాత్రి నిద్రచేశారని, 1935లో సేవాగ్రామ్ ఆశ్రమం స్థాపించాక  ఎక్కువ కాలం అక్కడే  గడపడం జరిగింది. 1920-22 సంవత్సరాలలో సహాయ నిరాకరణ ఉద్యమం,1930-32 సంవత్సరాలలో ఉప్పు సత్యాగ్రహం,1940-42 సంవత్సరాలలో క్విట్‌ఇండియాఉద్యమాలలో పాల్గొనడమే కాకుండా ఆరు సార్లు అరెస్టై జైలులో గడిపారు.ఆగాఖాన్ ప్యాలస్ లో ఉండగా "ఏమైనా తీరని కోరిక ఉండిపోయిందా?" అని గాంధీ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ "బడికి వెళ్ళి చదువుకోవడం" తన తీరని కోరికని తెలియజేసింది. అదే తడవుగా ఆగాఖాన్ ప్యాలస్ బడిగా మారిపోయింది. భర్త గాంధీజీ ఉపాద్యాయుడు అయ్యాడు. మహదేవ్ దేశాయ్ తో కలిసి, గురువుల  సహాయంతో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించారు.
 కస్తూరిబా, మహాత్మా గాంధీ భార్య గా,గాంధీ చే ప్రభావితురాలై,భారత రాజకీయ కార్యకర్తగా, 62 ఏళ్ల పాటు అతనితో కలిసి జీవించి తన భర్త, కుమారులతో పాటు,సహచరులు సుశీల నాయర్ సరోజినీ నాయుడు, మహదేవ్ దేశాయ్ వంటి వారితో ఆమె భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది.  దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ, భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొని  అనేక నిర్భంధాలను కలిసి ఎదుర్కొన్నది.  "ప్రపంచంలోని ఏ మహిళ కదిలించే లేనంతగా కస్తూరిబా నన్ను కదిలించింది"అని గాంధీజీ అన్నా "ప్రపంచంలోని ఏ స్త్రీకి నాకు ఉన్నంత ఉన్నంతటిగొప్ప భర్త లేడు"అనే కస్తూరిభా అన్నా అందుకు నిదర్శనం వారిద్దరి మధ్య బలమైన ప్రేమ బంధాన్ని తెలుపుతుంది. ఆమె భారత దేశానికి స్వాతంత్ర్యం రాక పూర్వమే పూణే లోని ఆగాఖాన్ ప్యాలస్ లో 1944 ఫిబ్రవరి 22న  గాంధీ గారు స్వయంగా నేసిన ఖద్దరు చీరను ధరించి ఆయన ఒడిలోనే కన్నుమూసింది.                                          గూడూరు లక్ష్మి                           MA(Gandhian Thoughts),(LLB)               గాంధేయవాది, సమాజ సేవకురాలు                అధ్యక్షులు: శ్రీ కళాలయ చారిటబుల్ ట్రస్ట్, పొగతోట,నెల్లూరు.9441638900,    Email: kalalayalakshmi@gmail.com


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image