జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: గంట్ల శ్రీనుబాబు

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి
ప్రత్యేక వేతనం మంజూరు చేయాలి
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
గంట్ల శ్రీనుబాబు
విశాఖపట్నం... సమాజం కోసం పాటుపడుతున్న జర్నలిస్టుల సంక్షేమమే  లక్ష్యంగా పని చేస్తున్నామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి .. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు... సోమవారం ఇక్కడ బాలయ్య శాస్త్రి లేఔట్ లో పలువురు జర్నలిస్టులకు...
ఉప  సంపాదకులకు,, తాను సొంతంగా సమకూర్చిన నిత్యవసర వస్తువులను శ్రీనుబాబు  చేతులు మీదుగా అందజేశారు.,, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని జర్నలిస్టులకు తన వంతు చేయూతను  అందించాలని భావించామన్నారు.. .. ఇప్పటి వరకూ తన సొంత నిధులతోనే మూడు విడతలుగా జర్నలిస్టులకు నిత్యవసర వస్తువులు అందజేశామన్నారు,.. మరో రెండు దశల్లో మరికొంతమందికి చేయూతను అందిస్తామన్నారు,.... ఇప్పటివరకూ 204 మందికి , తాను సాయం అందించడం జరిగిందన్నారు,..జర్నలిస్ట్ ల కు 50 లక్షలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని.. ఈసమయం లో ప్రతేక వేతనం మంజూరు చెయ్యాలని కోరారు.. .. ఈ కార్యక్రమంలో గంట్ల హర్షవర్ధన్... పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు