కేంద్ర ప్రభుత్వం 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది - బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు

కోవిడ్ - 19 భాగంగా కేంద్ర ప్రభుత్వం 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది - బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు


అమరావతి, 10 ఏప్రిల్ : 


కోవిడ్‌ -19 గురించి విలేకరుల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూప రాణి, బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావులు పాల్గొన్నారు.
ఈ సందర్భముగా స్వరూప రాణి మాట్లాడుతూ కోవిడ్‌ -19  భాగంగా DRDO దేశ వ్యాప్తముగా పంచిన మెడికల్ కిట్లలో భారీగా అవినీతి జరిగిందని, దేశ వ్యాప్తముగా పంచిన మెడికల్ కిట్లలో
భాగంగా ఆంధ్రప్రదేశ్ కి 1000 కిట్లను సరఫరా చేసిందని,  మరియు AMTZ వైజాగ్ (మెడ్ టెక్ పార్క్) లో తయారు చేసినట్లుగా లేబుల్ చేయబడిందని తెలిపారు.
పాత, కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే భాటలో నడుస్తున్నాయనడానికి ఇదో నిదర్శనమన్నారు. ఇది అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడం అని అన్నారు.
స్థానిక పత్రికా ప్రతినిధులు మరియు స్థానిక బిజెపి ఎమ్మెల్సీ పి.వి.యన్. మాధవ్ తో ఒక ప్రతినిధి బృందాన్ని పంపి, కిట్లు మరియు వెంటిలేటర్ల తయారు  చేసే యూనిట్ ను చూడటానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ రాహత్ భార్గవ్ వైజాగ్ కలెక్టర్ యోని యూనిట్లను సందర్శించాలని ఆదేశిస్తే, అప్పుడు లూబన్ యూనిట్‌ను సందర్శించవద్దని కలెక్టర్‌ను కోరారన్నారు. దీని పై వెంటనే హై పవర్ కమిటీ వేయాలని కోరారు.


బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు మాట్లాడుతూ కోవిడ్ - 19 భాగంగా కేంద్ర ప్రభుత్వం 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుందని తెలిపారు. ఈ పధకాన్ని  రాష్ట్రంలో ఉన్న లబ్దిదారులు ఉపయోగించుకోవచ్చన్నారు.
కానీ, దురదృష్టవశాత్తు ఉజ్జ్వాలా గ్యాస్ కనెక్షన్ కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు ఈ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ కనెక్షన్  ఇవ్వవలసి ఉండగా, అప్పుడు  చంద్రబాబు నాయుడు గారు అదే గ్యాస్ కనెక్షన్‌ను దీపం పథకం కింద మార్చిఇచ్చారని,  అప్పుడు రాష్ట్ర ఖజానాకు కొన్ని వందల కోట్ల రూపాయలు భారం పడిందని తెలిపారు.
దేశంలోని మిగిలిన ప్రాంతాలు ఉజ్జ్వాలా గ్యాస్ పథకాన్ని ఉపయోగించుకున్నాయని తెలియజేశారు. ఇప్పుడు భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉజ్జ్వాలా కనెక్షన్ ఉన్నవారు మాత్రమే ఈ ఉచిత గ్యాస్ పధకం కోసం అర్హులు అని సుబ్బారావు ఈ సందర్భంగా తెలిపారు. అందువల్ల అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయం  వలన రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడటమే కాకుండా అసలైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కొక్క గ్యాస్ డీలర్‌ దగ్గర ఉజ్జ్వాలా కింద కేవలం పదుల సంఖ్యలో కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని అదే  దీపం పధకం క్రింద ఇచ్చిన కనెక్షన్లు వేల సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అసలైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ పొందే అవకాశాన్ని కల్పించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు కోరారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image