గ్రామీణ ప్రాంత ప్రజలకు అండగా చేగువేర ఫౌండేషన్

*గ్రామీణ ప్రాంత ప్రజలకు అండగా చేగువేర ఫౌండేషన్



          గుడూరు :     ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీ .2000 కుటుంభాలకు చేయూత అంధిస్తాం...చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైఎస్ఆర్ కాంగ్రేస్ యువ నేత మండ్ల సురేష్ బాబు.ముఖ్య అతిధి గా గుడూరు తహశీల్దార్ లీలారాణి  



*కోవిడ్-19 కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యం తో చేగువేర ఫౌండేషన్ నిరాశ్రయులకు,పేద ప్రజలకు అండగా ఉండి అందుకోవడం జరుతుందని చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైఎస్ఆర్ కాంగ్రెస్స్ యువ నేత మండ్ల సురేష్ బాబు అన్నారు.లాక్ డౌన్ విధించిన నాటి నుంచి చేగువేర ఫౌండేషన్ ప్రభుత్వ ఆశ్రయ కేంద్రాల్లో ఉన్న వలస కూలీలకు, పట్టణ శివారులలో ఉన్న పేదలకు ఆహారం అందిస్తోంది. మరో పక్క పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం పట్టణ పురవీధులలో క్లోరినేషన్, శానిటేషన్ చేయడం జరిగింది.సేవ కార్యక్రమాల్లో భాగంగా గూడూరు గ్రామీణ ప్రాంతాల్లో శనివారం (18/04/2020)నుంచి ఈదలపల్లి,పగడాలపల్లి గ్రామాల్లో తహసిల్దార్ లీలరాణి ఆదేశాలతో ప్రజలకు ఇంటింటి వెళ్లి నిత్యవసర సరుకులను అందజేయడం జరిగింది.గూడూరు *హొండ్ షోరూం అధినేత కె.సురేష్ కుమార్ రెడ్డి*  *దాన్‌ ఫౌండేషన్‌ గుడూరు వారు మరియుచేగువేర పైలట్ టీమ్ సభ్యుల దాతృత్వంతో ఒక్కొక్క కుటంభానికి 5కేజీల బియ్యం,మూడు కేజీల కూరగాయలు,500ఎం.ఎల్ నూనె,500గ్రా కందిపప్పు,పసుపు,సాల్ట్,500గ్రా పెసర పప్పును 100 కుటుంబాలకు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా తహసీల్దార్ లీలరాణి హాజరై  నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజా సేవే లక్ష్యంగా చేగువేర ఫౌండేషన్ పనిచేయడం మంచి పరిణామం అన్నారు.ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ చేగువేర ఫౌండేషన్ ప్రజల మన్ననలు పొందడం జరిగిందన్నారు.చేగువేర ఫౌండేషన్ వ్యవస్థాపకులు,వైఎస్ఆర్ కాంగ్రెస్స్ యువనేత మండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో 2000మంది నిరుపేద ప్రజానీకానికి తమ వంతు సాయంగా నిత్యవసర సరుకులను అందిస్తున్నామన్నారు.ప్రజలు ప్రభుత్వానికి సహకరించి ఇంటి నుంచి అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కోరారు.కోవిడ్-19ను సమర్ధవంతంగా పరిశుభ్రతా,సామాజిక దూరం పాటించి ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.అనంతరం గ్రామ రెవెన్యూ అధికారి పుల్లయ్య,గ్రామ కార్యదర్శి నిశాంతిల పర్యవేక్షణలో చేగువేర పైలట్ టీమ్ సభ్యులు ఇంటింటికి వెళ్లి నిత్యవసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేగువేర ఫౌండేషన్ అధ్యక్షులు అన్సర్ భాష,ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్,,మధు రెడ్డి,వినోద్ పవన్‌ మౌనేష్‌ మరియు దాన్‌ ఫౌండేషన్‌ అధ్య కులు వెంకచేష్‌   శ్రీకాంత్‌రెడ్డి, రాజ్యవర్ధన్  రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image