పారిశుద్ధ్య కార్మికులకు మాసాంతం జీ.పి.ఆర్ చేయూత - 30 మందికి నిత్యం అల్పాహారం అందజేత

*పారిశుద్ధ్య కార్మికులకు మాసాంతం జీ.పి.ఆర్ చేయూత* 30 మందికి నిత్యం అల్పాహారం అందజేత.... వింజమూరు, ఏప్రిల్ 27 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షులు గున్నం.ప్రసాద్ రెడ్డి ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో తన ఉదారతను చాటుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వింజమూరు మేజర్ పంచాయితీలో ప్రతినిత్యం 30 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు నిత్యం వింజమూరులో పారిశుద్ధ్యమును మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారు. గతంలో పరిస్థితులు ఎలాగున్నా ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో మాత్రం కార్మికులు పారిశుద్ధ్య పనుల విషయంలో నిరంతరం సేవలు అందిస్తున్నారని చెప్పవచ్చు. లాక్ డౌన్ లో భాగంగా టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు సైతం మూతపడ్డాయి. పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ తెల్లవారు జామునే విధుల్లోకి వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న  బి.జె.పి నేత గున్నం.ప్రసాద్ రెడ్డి తన స్వంత నిధులతో నెల రోజులుగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా తయారు చేయించిన అల్పాహారం ప్యాకెట్లును అందజేస్తూ వారికి ఉదయం పూట ఆకలి దప్పులను తీర్చుతున్నారు. అంతేగాక ఇటీవల కూడా స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో మండల బి.జె.పి నేతల సమన్వయంతో జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులకు భారీ స్థాయిలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ చైనాలోని ఊహాన్ సిటీలో రూపాంతరం చెంది ఖండాంతరాలు దాటి ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ మానవాళి మనుగడకు పెను సవాల్ గా మారడం విచారించదగిన విషయమన్నారు. భారతదేశంలో ఈ వైరస్ నియంత్రణకు మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు.  జనతా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ కావడంతో ప్రజలను కరోనా రక్కసి కబంధ హస్తాల నుండి రక్షించుకునేందుకు ఏకైక మార్గంగా లాక్ డౌన్ ప్రక్రియకు ప్రధానమంత్రి వ్యూహం రచించడం జరిగిందన్నారు. దీనితో కరోనాను మన దేశంలో కొంతమేర కట్టడి చేసినట్లయిందన్నారు. అభివృద్ధి చెందిన పలు దేశాలు ముందుచూపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ చోటుకున్న విషాదకర సంఘటనలను మనం నిత్యం ప్రసార సాధనాల ద్వారా వీక్షిస్తూనే ఉన్నామన్నారు. కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాత్రం కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న ముందు జాగ్రత్త విధానాలతోనే కరోనా వ్యాప్తిని నియంత్రించినట్లవుతున్నదన్నారు. అసలే అంతంత మాత్రంగా ఉంటున్న మన దేశ ఆర్ధిక వ్యవస్థ లాక్ డౌన్ వలన ఆర్ధిక మూలాలు పతనమవుతున్నప్పటికీ లెక్కచేయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన దేశ ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తుండటం దేశ ప్రజల అదృష్టమని గున్నం.ప్రసాద్ రెడ్డి అన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image