*ఇప్పటి వరకు 391 శ్యాంపిల్స్ సేకరణ. : చిత్తూరు జిల్లా కలెక్టర్ 


💐 *కుల, మతాలకతీతంగా కరోనా కట్టడికి సహకరించండి* 
💐 *నిత్యం శ్యాంపిల్ ల సేకరణ* 
💐 *అందరి సమిష్టి కృషితో ముందుకు . . .*  
💐 *సమర్థవంతంగా కరోనా ను నియంత్రిద్దాం* 
💐 *ఇప్పటి వరకు 391 శ్యాంపిల్స్ సేకరణ* 
 *: జిల్లా కలెక్టర్*  
 *చిత్తూరు, మార్చి 7:* ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న చాలా కీలక సమయం . . కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలందరూ సహకరించాలి. వైద్య పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా నోడల్ అధికారి మరియు జెసి2 చంద్రమౌళి, డిఎం అండ్ హెచ్ ఓ డా.పెంచులయ్యతో కలసి జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందని, ఇందులో 14 కేసులు ఢిల్లీ మర్కజ్ మసీదు జమాత్ తో సంబంధం కలిగిన వారని, ఒక కేసు విదేశాల నుండి వచ్చిన వారని మరియు 2 కేసుల్లో వీరికి ట్రావెల్ హిస్టరి ఉన్నదని వీరు తిరుపతికి సంబంధించిన వారని తెలిపారు. జిల్లాలో మొత్తం 391 శ్యాంపిల్స్ సేకరించగా నిన్నటి వరకు 323 ఫలితాలు రాగా ఉదయం 40 శ్యాంపిల్స్ పరీక్ష చేయగా నెగెటివ్ రావడం జరిగిందని మొత్తం దాదాపుగా 360 శ్యాంపిల్స్ నెగెటివ్ జరిగిందని తెలిపారు. 65 సంవత్సరాలు పైబడి, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లైతే వారందరికీ శ్యాంపిల్స్ సేకరణ చేయడం జరుగుతున్నదని, ముందస్తు జాగ్రతల్లో భాగంగా రోజుకు నియోజకవర్గాల పి.హెచ్.సి ల  వారీగా 100 శ్యాంపిల్స్ సేకరణ చేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో గల 20  ట్రూ నాట్ మెషిన్ల ను వినియోగించి ప్రాథమికంగా టెస్ట్ చేసిన యెడల పాజిటివ్ వస్తే మరళా తిరుపతిలో టెస్ట్ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఫారిన్ రిటర్న్స్, డిల్లీ జమాత్ రిటర్న్స్ అందరినీ గుర్తించడం జరిగిందని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి ఒక్కొక్కరికీ విడివిడిగా మరుగుదొడ్లు లేకపోవడంతో కలికిరి జె ఎన్ టి యు, పలమనేరు మదర్ థెరీశా కాలేజీ లను ఖాళీ చేసి అక్కడ ఉన్న వారిని తరలించడం జరిగిందని తెలిపారు. స్వాప్ టెస్టింగ్ తిరుపతితో పాటు చిత్తూరు, పీలేరు, పలమనేరు లో కూడా చేయడం జరుగుతున్నదని తెలిపారు.   
 కాణిపాకంలోని క్వారంటైన్ సెంటర్ కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అసంబద్ధమైనదని, నిజానికి దూరంగా కలదని తెలిపారు. క్వారంటైన్ సెంటర్లుగా కళ్యాణ మండపాలను, స్కూల్ లను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను వివరిస్తూ క్వారంటైన్ సెంటర్లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని 14 రోజుల పాటు ఉంచడం జరుగుతుందని, 14 రోజుల తరువాత పరీక్షల చేసినట్లైతే వారికి పాజిటివ్ లేదా నెగెటివ్ రిపోర్ట్ తేలుతుంది కాబట్టి ఈ సమయంలో కూడా వారిని విడివిడిగా ఉంచడం జరుగుతుందని, ఇందులో భాగంగానే కాణిపాకం దేవస్థానంకు 400 మీటర్ల దూరంలో గల గణేశ్ సదన్ ను క్వారంటైన్ సెంటర్ గా ఎంచుకోవడం జరిగిందని ఇందులో 86 రూములు కలవని తెలిపారు. ఐసొలేషన్ వార్డు అనగా పాజిటివ్ వచ్చిన వారందరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఐరాల తహశీల్దార్, కాణిపాకం ఇఓ వారు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో గురించి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అన్నీ మతాల నమ్మకాలను విశ్వసించడం జరుగుతుందని, మతాల నమ్మకాలను వమ్ము చేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కాణిపాకం గణేశ్ సదన్ తో పాటు శ్రీకాళహస్తిలో గల దేవస్థానం గదులను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు.
 టిటిడి వారు ఈ విపత్కర పరిస్థితుల్లో అన్నదానం చేస్తున్నారని, స్విమ్స్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ గా ఉన్నందున టిటిడి వారు రూ.19 కోట్లు మంజూరు చేసి అత్యవసరంగా అవసరమైన పరికరాల కొనుగులుకు వినియోగించాల్సిందిగా తెలుపడమైనదని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరం కలసి కట్టుగా పని చేసి కుల, మతాలకతీతంగా పని చేయాలని తెలిపారు. దేవస్థానం, చర్చ్, మసీదుల పవిత్రతలను కాపాడతామని తెలిపారు. 
 ఈ విలేకరుల సమావేశం లో భాగంగా విలేకరులకు స్యానిటైజర్లు, మాస్క్ లను జిల్లా కలెక్టర్, జెసి 2 పంపిణీ చేశారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image