కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి అరా

*30.04.2020*
*అమరావతి*


*అమరావతి: కరోనాపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష


కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చ.ఇది చాలా అమానవీయమని పేర్కొన్న సమావేశం.కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చు: సీఎం.


అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చు : సీఎం


అంటరాని వాళ్లుగా చూడ్డం కరెక్టుకాదు :సీఎం


అలాంటి పరిస్థితుల్లో వారిమీద ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం కరెక్టుకాదు:


అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్టు కాదు:


అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చు:


మనకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో.. అలాగే స్పందించాలి:


బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు అడ్డుకోవడం సరికాదు:


ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీకి సూచించిన సీఎం


కరోనా వస్తే.. మందులు తీసుకుంటే.. అది పోతుంది:కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడ్డం సరికాదు:తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్టు అవుతుంది:కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, కేసులుకూడా పెట్టొచ్చు: అధికారులుకరోనా వస్తే అది భయానకమనో, అది సోకినవారిని అంటరాని తనంగా చూడ్డం సరికాదు:కరోనా అన్నది సోకితే , మందులు తీసుకుంటే పోతుంది:రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారు?:


నయం అయితేనే కదా... డిశ్చార్జి అయ్యేది?:తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నంచేయొద్దు : సీఎం.దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్టే కదా?:అదికూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుంది: