ఇబ్బందుల్లో ఉన్నారు.. కనీసం రూ.5వేలివ్వండి

ఇబ్బందుల్లో ఉన్నారు.. కనీసం రూ.5వేలివ్వండి
ప్రభుత్వం వాస్తవాలు దాచకూడదు
రైతు కుదేలయ్యే పరిస్థితి తేవొద్దు
మీడియా సమావేశంలో  తెదేపా అధినేత చంద్రబాబు
హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వల్ల అందరూ బాధపడుతున్నారని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును అందుకొని ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై సంఘీభావం తెలిపారన్నారు. మనం పరిశుభ్రంగా ఉంటూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. వారంలో ప్రపంచవ్యాప్తంగా 62 శాతంకరోనా వైరస్‌ కేసులు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. గత వారం రోజుల్లో మన దేశంలో 222 శాతం కరోనా కేసులు పెరిగాయన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రంలో అత్యధికంగా ఒక్క వారంలో వెయ్యి శాతానికి పైగా కరోనా పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పివారిని మరింత సమాయత్తం చేయాలి. ప్రజలు కూడా ప్రభుత్వాల సూచనలు పాటించాలి. భౌతిక దూరం పాటించాలి. మత, రాజకీయపరమైన సదస్సులు వాయిదా వేసుకోవాలి’’ అని సూచించారు. 
భయపడనక్కర్లేదు.. జాగ్రత్తగా ఉంటే చాలు..!
‘‘కరోనా వైరస్‌ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తలు తీసుకుంటే చాలు. దీనిపై దుష్ప్రచారాలను నమ్మకూడదు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు యోగా, ధ్యానం చేయాలి. రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలో ఆలోచించాలి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.. ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలి. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అత్యవసర సేవల సిబ్బందికి కావాల్సినవన్నీ ఇచ్చేలా చూడాలి’’  


రైతుబజార్లు విరివిగా ఏర్పాటు చేయాలి
‘‘పరీక్షలు తక్కువ చేస్తే కేసులు మరిన్ని ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. పరీక్షలు ఎక్కువ చేస్తే కేసులు బయటపడతాయి. వాటికి అనుగుణంగా వెంటిలేటర్లు ఉంచాలి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం సరికాదు. కరోనా పాజిటివ్‌ వచ్చినవారందరినీ వేరు చేయాల్సిన అవసరం ఉంది. వైద్యులు, క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి రక్షణ పరికరాలు వెంటనే అందజేయాలి.  ఇలాంటి క్లిష్ట సమయాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మొబైల్‌ రైతు బజార్లు విరివిగా ఏర్పాటు చేయాలి. ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని కోరారు. 


ఆ నగదు అభ్యర్థులు పంచడమేంటి?
‘‘రాష్ట్రంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిచేస్తే గానీ పూటగడవని ఎంతోమంది పేద ప్రజలను ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాయి. దిల్లీ ప్రభుత్వం రూ.5వేలు ఇస్తోంది. అలాగే, ఏపీలో కూడా పేదలకు తొలివిడతగా కనీసం రూ.5వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలి. రాష్ట్రంలో రూ.1000 చొప్పున ఇస్తున్న నగదును వైకాపా అభ్యర్థులు పంచడమేంటి? రేషన్‌, పింఛన్లలో అనేకమందికి కోత విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు కుదేలయ్యే పరిస్థితి తీసుకురావొద్దు. అరటి, మామిడి, బత్తాయి, టమాటా రైతులను ఆదుకోవాలి. కూరగాయలు, పండ్ల తోటల రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరినీ ఆదుకోవాలి’’ అని చంద్రబాబు కోరారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image