వింజమూరులో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు:  యం.పి.డి.ఓ కనక దుర్గా భవాని

వింజమూరులో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు:  యం.పి.డి.ఓ కనక దుర్గా భవాని


: వింజమూరు, ఏప్రిల్ 12 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): మేజర్ పంచాయితీ అయిన వింజమూరులో ఈ వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సమృద్ధిగా నీటిని అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్.కనకధుర్గా భవానీ పేర్కొన్నారు. ఇందుకు గానూ ఆమె గత వారం రోజుల నుండి పంచాయితీ పరిధిలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు, మినీ రక్షిత మంచినీటి పధకాలను పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో పరిశీలిస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో పంచాయితీ సిబ్బందిని అప్రమత్తం చేసి ఓవర్ హెడ్ ట్యాంకులలో క్లోరినేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. అందుకు అవసరమైన బ్లీచింగ్ ను ఇప్పటికే పెద్ద మొత్తంలో మండల పరిషత్ కార్యాలయంలో సిద్ధం చేసి ఉన్నారు. సాక్షాత్తూ యం.పి.డి.ఓ తరలి పంచాయితీ కార్యదర్శిని వెంటబెట్టుకుని క్షేత్ర స్థాయిలో తాగునీటి పధకాల వద్దకు వెళుతుండటంతో ఆయా శాఖలకు చెందిన సిబ్బంది సైతం పరుగులు పెడుతున్నారు. 20,639 మంది జనాభా కలిగిన వింజమూరు మేజర్ పంచాయితీ పరిధిలోని పలు ప్రాంతాలలో దాదాపుగా 100కు పైగా మినీ రక్షిత మంచినీటి పధకాలు (డైరెక్ట్ పంపింగ్ స్కీములు), 20 వేల నుండి 45 వేల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన 8 ఓవర్ హెడ్ ట్యాంకులు నీటి అవసరాల నిమిత్తం పని చేస్తుండగా వాటిలో కొన్ని చిన్న చిన్న మరమ్మత్తులతో మొండికేస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పడు వస్తారో తెలియని పరిస్థితులు వింజమూరులో సర్వ సాధారణమైపోయాయి. ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించిన సంధర్భాలలో మాత్రమే తళుక్కుమంటూ తరువాత
 ముఖం చాటేస్తున్నారనే విమర్శలున్నాయి. గత వేసవిలో వింజమూరు ప్రజలు తాగునీటి కోసం భగీరధ ప్రయత్నాలు చేసి ఏకంగా రిలే నిరాహార దీక్షలకు దిగారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో నూతనంగా భాధ్యతలు చేపట్టిన యం.పి.డి.ఓ తనదైన శైలిలో ఇప్పటికే ప్రజల తాగునీటి అవసరాలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకుని నిత్యం ఏదో ఒక ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న కనకదుర్గా భవానీ ఇప్పటికే తమ స్వీయ పర్యవేక్షణలో ఉన్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను అప్రమత్తం చేస్తూ ఆయా గ్రామల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image