కొవిడ్ యుద్దం లో పరీక్ష చేసే వైద్యసిబ్బంది !

AP FIGHTS COVID 19.
COMMAND CONTROL
*****************************
యుద్దం లో సైనికులు!! 


కొవిడ్ యుద్దం లో పరీక్ష చేసే వైద్యసిబ్బంది !!! 


కరోనా పరీక్ష నిమిత్తము రాష్ట్ర ప్రభుత్వము 7 RTPCR/VDRL లాబ్ లను నెలకొల్పింది. 


వీటితోపాటు ట్రునాట్ ల్యాబ్, Chemilucency లాబ్  లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కో వి డ్ పరీక్షలు నిమిత్తమై ఏర్పాటు చేశారు తద్వారా ఈనాడు రోజుకి ఆరు వేల పైచిలుకు శాంపిల్స్ను పరీక్ష చేయగలుగుతున్నాము దేశంలోనే మన రాష్ట్రం పరీక్షల విషయంలో అగ్రగామిగా నిలిచింది.


ఇందులో రాష్ట్రవ్యాప్తంగా వచ్చినటువంటి శాంపుల్ లను పరీక్ష చేసి నిర్ధారణ చేస్తారు పాజిటివ్ గా లేదా నెగిటివ్ అని


ఒక్క విజయవాడలోనే రమారమి రోజుకు వెయ్యి శాంపుల్ టెస్ట్ చేసే సామర్థ్యము కలదు. 


ఈ ల్యాబ్ లో ఎక్కువశాతం పాజిటివ్ ఉన్న శాంపిల్స్ను ఎగ్జామ్ చేయటంలో ధైర్యంగా సాహసోపేతంగా రాత్రింబవళ్ళు వైద్య సిబ్బంది పని చేస్తున్నారు.


చిన్న పొరపాటు జరిగితే వారికి ఈ వైరస్ సోకుతుంది.  హైరిస్క్ ప్రదేశంలో ఉండి ప్రజల యొక్క క్షేమం గురించి రేయింబవళ్ళు తమకు రిస్కు ఉన్నది అని తెలిసినా కూడా చిరునవ్వుతో దేహం అంతా personal protective equipment తో పూర్తిగా కప్పుకొని ఎంతో ధైర్యంతో ఈ టెస్ట్లను నిర్వహిస్తూ ఉంటారు.


ఒక కరోనా పాజిటివ్ కేసు ఉన్నది అంటేనే ఆ ఇల్లు ఆ చుట్టుపక్కల వారు గడగడలాడి పోతూ ఉంటారు. అలాంటిది ఇది ప్రతి శాంపుల్ లో వైరస్ ఉంది/  ఉంటుంది అని తెలిసి కూడా మనోధైర్యంతో హైరిస్క్ జోన్లో పని చేస్తున్నటువంటి ఈ వైద్య సిబ్బందికి మనమందరం ఎంతైనా రుణపడి ఉన్నాము.


ఈరోజు ఈ లేబరేటరీలో  రేయింబవళ్ళు గత ముప్పై తొమ్మిది రోజులుగా అలసట లేకుండా బాహ్య ప్రపంచంతో  సంబంధం లేకుండా పనిచేస్తున్న వీరందరిని చూసిన తర్వాత 


 ప్రతినిత్యం కుటుంబం కంటే సమాజ సేవే ముఖ్యం అని వీరు చెప్తుంటే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క రూ యుద్ధములో శత్రువు ని ఎదిరుస్తున్న వీర సైనికుడు లాగా కనిపిస్తున్నారు.


క రోనా పైన ప్రత్యక్షంగా ముందుండి తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వీరందరికీ మన అందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు!!! 


మనందరం భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంటిలో ఉండటమే మనం వీరందరికీ ఇవ్వగలిగిన నిజమైన కృతజ్ఞతాభివందన ములు!!  
___________________________
డాక్టర్ అర్జా శ్రీకాంత్ 
Covid స్టేట్ నోడల్ ఆఫీసర్


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image