అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకోండి :డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

*14.04.2020*
*అమరావతి*


*అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకోండి


*రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచన*


*ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–పాస్‌ల జారీకి చర్యలు*


*జిల్లాల వారీగా పాస్‌ల కోసం వాట్సప్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం*


రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు.


*దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ.*


► లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్‌ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం.
► జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
► వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది.
► పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి.
► పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. 


*ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id'S*
S.No
Unit Name
WHATSAPP 
Mobile Number
e-mail ID's


1
SRIKAKULAM
 
6309990933
dail100srikakulam@gmail.com


2
VIZIANAGARAM


9989207326
spofvzm@gmail.com


3
VISAKHAPATNAM RURAL


9440904229
vizagsp@gmail.com


4
VISAKHAPATNAM CITY
9493336633
cpvspc@gmail.com


5
EAST GODAVAI (KAKINADA)


9494933233
sp@eg.appolice.gov.in


6
RAJAHMUNDRY URBAN
9490760794
sp@rjyu.appolice.gov.in


7
WEST GODAVARI


8332959175
policecontrolroomeluruwg@gmail.com


8
KRISHNA (MACHILIPATNAM)


9182990135
sp@kri.appolice.gov.in


9
VIJAYAWADA CITY
7328909090
cp@vza.appolice.gov.in


10
GUNTUR RURAL
9440796184
Dail100gunturrural@gmail.com


11
GUNTUR URBAN


8688831568
guntururbansp@gmail.com


12
PRAKASHAM
9121102109
spongole@gmail.com


13
NELLORE
9440796383
nelloresp@gmail.com


14
CHITTOOR


9440900005
spchittoor@gmail.com


15
TIRUPATHI URBAN
9491074537
sptpturban@gmail.com


16
ANANTHAPURAM
9989819191
spatp1@gmail.com


17
KADAPA


9121100531
spkadapa2014@gmail.com


18
KURNOOL


7777877722
spkurnool.kur@gmail.com


                                  
*అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క  వాట్సప్‌ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్‌ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు. మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పనిసరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.*


Popular posts
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి