నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరాం.:మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని


13.4.2020
విజయవాడ


విజయవాడ పౌరసరఫరాల శాఖా కార్యాలయం నుంచి మంత్రి శ్రీ కొడాలి  వెంకటేశ్వరరావు (నాని) ప్రెస్ మీట్...
1) కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖామంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ తో వీడియో కాన్ఫెరెన్స్ జరిగింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్, ఎండి సూర్యకుమారి కూడా వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్నారు. 


2) ప్రధానంగా రాష్ట్రానికి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరాం.


3) అలాగే రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు బియ్యం  కార్డులు వున్నాయి. కానీ కేంద్రం మాత్రం 92 లక్షల కార్డులనే గుర్తించింది. వాటికి మాత్రమే ప్రధానమంత్రి ప్రకటించిన ఉచిత బియ్యం అందుతుంది. మిగిలిన 55 లక్షల మందికి రాష్ట్రప్రభుత్వమే ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు అందిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లాం. 


4) 55 మంది లక్షల పేదలకు రాష్ట్రం అందిస్తున్న బియ్యం, ఇతర సరుకులను కూడా కేంద్రం నుంచి రాష్ట్రంకు రీ బ్యాక్ చేయాలని కేంద్రమంత్రిని కోరాం. 


5) సివిల్ సప్లయిస్ ధాన్యం కొనుగోళ్ళకు రైతులకు చెల్లించాల్సిన సుమారు ఆరువేల కోట్లను గతంలో చంద్రబాబు పసుపుకుంకుమ పథకంకు మళ్లించాడు. ఆ నిధులను కూడా మేం రైతులకు చెల్లించాం.


6) మే నెల నాటికి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతాయని, అందుకోసం కేంద్రం నుంచి 45వేల బెయిళ్ళ గన్నీ బ్యాగ్ లు రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రమంత్రిని కోరాం. 
7) ఈ అంశాలపై కేంద్రప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలియచేశారు. 


8) మార్చి 29 నుంచి నేటి వరకు రాష్ట్రంలో కరోనా వల్ల పేద కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యం, కందిపప్పును 1.35 కోట్ల కుటుంబాలు తీసుకున్నాయి. దీనిలో సివిల్ సప్లయిస్ శాఖ, రేషన్ షాప్ లు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేశారు. వారిని ఈ సందర్బంగా అభినందిస్తున్నాను.


9) చిన్నచిన్న సంఘటనలు జరిగితే మాకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు, బూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలు వీటిని పట్టించుకోరు. 


10) పదహారో తేదీ నుంచి రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది. 29వేల రేషన్ షాప్ ల ద్వారా కార్డులో పేరు వున్న ప్రతి వ్యక్తికి అయిదు కేజీల బియ్యం, ఒక కార్డుకు కేజీ శనగలు అందించబోతున్నాం. 


11) కారోనా వల్ల భౌతికదూరం పాటించాల్సి వుంటుంది. అందుకే ఎక్కువ రేషన్ కార్డులు వున్నదుకాణాలను గుర్తించాం. 14వేల షాప్ లకు అదనపు కౌంటర్లు పెట్టి, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, సివిల్ సప్లయిస్ ఎంప్లయిస్ లను బాధ్యులుగా నియమించి సరుకులు పంపిణీ చేస్తాం.  


12) ఈ సారి టోకేన్ విధానంను అమలు చేస్తున్నాం. బియ్యం, శనగలు తీసుకునే కార్డుదారులు  ఏ సమయాల్లో చౌకదుకాణంకు రావాలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో రావాల్సిన వారికి సమయాలను సూచించేలా టోకేన్లను అందిస్తాం. చౌకదుకాణాల్లో రద్దీ లేకుండా సరుకులు తీసుకోవాలని రేషన్ కార్డు దారులకు మనవి. రెండు విడతలుగా గోడవున్ ల నుంచి రేషన్ షాప్ లకు సరుకులు పంపిస్తాం.


13) గూడ్స్ రైళ్ళ ద్వారా గతంలో 15,600 మెట్రిక్ టన్నులు రవాణా చేస్తే, ఇప్పుడు 65వేల మెట్రిక్ టన్నుల వరకు బియ్యం రవాణా జరుగుతోంది. దీనిని నిర్వహించేందుకు 550 కు పైగా వున్న గిడ్డంగుల్లో వున్న ఉద్యోగులు, హమాలీలు, రవాణా సిబ్బంది, వారి ఆరోగ్యంను రిస్క్ లో పెట్టి  మరీ ప్రజల కోసం కష్టపడుతున్నారు. 


14) ఎ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని, సీఎం వైస్ జగన్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరికీ సరుకును అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. కరోనా వైరస్ విపత్తు నుంచి బయపడేవరకు ఇలాగే కష్టపడాలని కోరుతున్నాం.


15) రాష్ట్రంలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారు. 33 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లయిస్ ద్వారా సేకరించాల్సి వుంది. దానిలో 51 వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే సేకరించాం. గ్రామ సచివాలయాల వద్ద రైతులు తమ పేర్లు నమోదు చేయించుకుని, వివరాలు ఇస్తే, సివిల్ సప్లయిస్ అధికారులే రైతు వద్దకువచ్చి ధాన్యంను అక్కడే కొనుగోలు చేస్తాం. 


*రాష్ట్ర సివిల్ సప్లయిస్ కమిషనర్ శ్రీ కోన శశిధర్ కామెంట్స్*


16) కేంద్రమంత్రి శ్రీ రాంవిలాస్ పాశ్వాన్  వీడియో కాన్ఫెరెన్స్ లో రాష్ట్రంలో కరోనా సమయంలో ప్రజలకు అందిస్తున్న ఆహార సరుకులపై వివరించాం. గత మార్చి 29 నుంచి నేటి వరకు పిడిఎస్ పంపిణీ ద్వారా అన్ని రేషన్ దుకాణాల్లో ప్రజలకు ప్రతి కార్డులోని సభ్యుడికి అయిదు కిలోలు, ఒక కేజీ కందిపప్పు అందించాం. వచ్చే పదహారో తేదీ నుంచి రెండో విడత ఉచిత పంపిణీ ప్రారంభిస్తున్నాం.


17) రబీ ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభమయ్యాయి. 51 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంను, 993 కేంద్రాల ద్వారా సేకరించాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో డీ సెంట్రలైజ్ ప్రోక్యూర్ మెంట్ కు సీఎంగారు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ప్రతి గ్రామ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా కొనగోళ్లు జరిగేలా చర్యలు తీసుకున్నాం. 


18) కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ధాన్యంను మనరాష్ట్రంకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నాం. సరిహద్దుల వద్దే ధాన్యంను అడ్డుకుంటున్నాం. ఎంఎస్ పి ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో ఎక్కువగానే కొనుగోళ్ళు జరుగుతున్నాయి.


19) కరోనా విపత్తు సమయంలో హెల్త్, శానిటేషన్, పోలీస్ శాఖలతో పాటు సివిల్ సప్లయిస్ శాఖ కూడా ప్రజలను ఆదుకునే చర్యలను చపట్టింది. ఎల్ పిజి, పెట్రోలియం అవుట్ లెట్ లను కూడా పర్యవేక్షిస్తున్నాం. ప్రధానంగా గిడ్డంగుల వద్ద వుండే హమాలీలు, 30 నుంచి 40 శాతం ఉద్యోగులతోనే డిపార్ట్ మెంట్ పనిచేస్తోంది. 


20) చౌకదుకాణాలకు పదిహేను రోజులు జరిగే సరుకుల రవాణాను వారం రోజుల్లో పూర్తి చేశాం. అటు రైల్వేలు, ఇటు డిపార్ట్ మెంట్, హమాలీలు, ఉద్యోగులు, డీలర్లతో సమన్వయం చేసుకుంటున్నాం. ప్రతి డీలర్ వద్ద విఆర్ ఓ ను నామినీ ఆఫీసర్ గా పెట్టాం.


21) పదహారో తేదీ నుంచి సరుకుల పంపిణీకి ప్రత్యేక విధానం, కూపన్ విధానంను కూడా అమలు చేస్తాం. మందుగానే కార్డుదారులకు కూపన్లు ఇస్తాం, భౌతికదూరంను పాటించాలి, అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తాం. సరుకులకు ఎక్కడా కొరత లేదు, ఒకేసారి గుమిగూడకుండా సరుకులను పొందాలని కోరుతున్నాం.


22) గ్రామస్థాయిలోనే రైతులు ధాన్యం అమ్మకాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు పోస్టర్ లను కూడా ప్రింట్ చేసి, గ్రామసచివాలయాలకు పంపించాం. ఈసారి ఖచ్చితంగా ఈ క్రాప్ డేటా ఆధారంగా రిజిస్ట్రేషన్లు, ధాన్యం కొనుగోళ్ళు చేయాలని నిర్ణయించాం. ఎక్కడా అక్రమాలు జరగకూడదని, వేరే రాష్ట్రాల నుంచి స్టాక్ రాకూడదని చర్యలు తీసుకుంటున్నాం. కౌలురైతులు, పట్టాదారుల పేర్లు ఈ క్రాప్ ద్వారా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లు నమోదు చేశారు. 


23) ఎక్కడైనా సమస్యలు వుంటే మండల వ్యవసాయశాఖ అధికారి దృష్టికి తీసుకువెడితే వారు పరిష్కారం చేస్తారు. రైతులు మద్దతుధరకు తక్కువగా తమ ధాన్యంను విక్రయించాల్సిన  అవసరం లేదు. కోవిడ్ సమస్య వున్నప్పటికీ 29 వేల రేషన్ షాప్ లకు సకాలంలో సరుకులు అందించాం, అలాగే ధాన్యం కొనుగోళ్లు కూడా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.


24) పదహారో తేదీ నుంచి ఒక కుటుంబానికి కేజీ శనగలు, కార్డులోని సభ్యులకు ఒక్కొక్కరికీ అయిదు కేజీల బియ్యం ఉచితంగా అందిస్తాం. గతంలో కందిపప్పు ఇచ్చాం. మే ఒకటిన మళ్లీ కందిపప్పు ఇస్తాం. ప్రజలు సురక్షితంగా వుండాలని రేషన్ దుకాణాల వద్ద భౌతికదూరంను పాటిస్తే, సరుకులు తీసుకోవాలి. వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. వచ్చిన వారి ఫోటోగ్రాఫ్ కలెక్ట్ చేస్తారు. 


25) రేషన్ షాప్ సమయాలను స్థానికంగా వున్ కలెక్టర్, ఎస్పీలు నిర్ణిస్తారు. 1902 కాల్ సెంటర్ కు సమస్యలు వుంటే కాల్ చేయవచ్చు.


26) పాత రేషన్ కార్డు దారులకు రేషన్ అందిస్తున్నాం. అలాగే సీఎంగారి ఆదేశాల మేరకు అర్హత వున్న ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం.కార్డు లేని అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతలను బట్టి సరుకులను అందిస్తాం.  


27) ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పోర్టబిలిటీ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. 33 లక్షల మంది పోర్టబిలిటీ వారికి కూడా వారికి కూడా కూపన్లు అందిస్తున్నాం.


28) ఎంఎస్పి సరిగ్గా రాకపోయినా, దళారులు మోసం చేస్తున్నారనే అనుమానం కలిగితే రైతులు 1902 కి ఫోన్ చేయవచ్చు. 


29) ప్రతిరోజూ ఆన్ లైన్ ఫీడ్ బ్యాక్ ను అగ్రికల్చర్ విభాగం ప్రవేశపెట్టింది. ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు, ఎంఎస్ పి సమస్యలపై రోజువారీ ఫీడ్ బ్యాక్ తీసుకునే యాప్ వారు తయారు చేశారు. దాని ద్వారా ధాన్యంకు సంబంధించిన వివరాలను తీసుకుంటున్నాం. సమస్యలు వుంటే రైతులు అగ్రికల్చర్ అసిస్టెంట్ లకు తెలియచేయవచ్చు. 


30) రాష్ట్రంలో 29,783 చౌకదుకాణాలు వున్నాయి, వాటికి 14,315 అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. శ్రీకాకుళంలో ఇప్పటికే డోర్ డెలివరీ జరుగుతోంది. 8 వేల దుకాణలకు సింగిల్ కౌంటర్, 3800 దుకాణాలకు 2 , 500 షాప్ లకు 3  కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వాటికి తూకం యంత్రాలను కూడా సమకూర్చాల్సి వుంది. 


31) ఎక్కడైనా రేషన్ దుకాణాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే  ప్రత్యామ్నాయంగా రేషన్ ప్రజలకు ఇచ్చే లా చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైతే డ్వాక్రా సంఘాలకు కూడా దానిని కేటాయించేలా ఆదేశాలు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
ఇదీ వాటర్‌ గ్రిడ్‌
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు.