సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం : టి.టి.డి


  తిరుపతి  2020 ఎప్రిల్ 28    


సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం.  
                       రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మ కర్తల మండలితో చర్చించి తిరుమల శ్రీ వారి ఆలయంలో జూన్ 30 వతేదీ దాకా భక్తులకు దర్శనం నిలిపి వేయాలని  సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.  భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించే విషయం పై ధర్మకర్తల మండలి  తగు నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్యం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది.