వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు కొనుగోలు, సరఫరా,


  విజయవాడ తేదీ: 03.04.2020


డాక్టర్లు, నర్సులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు కలసి వారి సంఘీభావాన్ని తెలపడాని ముందుకు వచ్చారు   ….. మంత్రుల బృందం


మంత్రులు బృందం, ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారం తో ఈ విపత్తు నుంచి బయట పడగలుగుతామని మంత్రుల బృందం ఛైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.


విజయవాడలో ని ఆర్ అండ్ బి రాష్ట్ర భవన సముదాయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మంత్రులు బృందం సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని,  మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జలరామకృష్ణారెడ్డి, బి. సాంబశివ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఎపిఎమ్ఐడీసీ ఛైర్మన్  చంద్రశేఖర్ రెడ్డి లు పాల్గొన్నారు.


సమావేశంలో భాగంగా క్షేత్రస్థాయిలో కోవిడ్19 కు సంబంధించిన వివరాలు, క్వారెంటైన్ ఏర్పాట్లు, స్వీయ నియంత్రణ, హోమ్ క్వారెంటైన్, స్పెషల్ ఆఫీసర్ లు, నిత్యావసర సరుకుల పంపిణీ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు కొనుగోలు, సరఫరా, హమాలీలు, రైతు కూలీలు తదితర అంశాలపై చర్చించారు. కోవిడ్ 19 నిర్ధారణ వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు సంబంధించి విడి విడిగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.  ప్రముఖ వైద్యులను, సంస్థలను కోరడం జరిగిందన్నారు. ప్రవేటు హాస్పిటల్ ద్వారా టెలి మెడిసిన్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సమావేశంలో చర్చించారు.
 రాష్ట్రంలో కాకినాడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కడప, విశాఖపట్నం ప్రాంతంలో ల్యాబ్ లను అందుబాటులో ఉంచుకోవడం జరుగుతున్న దని అధికారులు తెలిపారు. కోవిడ్ నివారణకు అవసరమైన పరికరాలు సేకరణ కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విధుల్లో భాగస్వామ్యం అవుతున్న డాక్టర్లుకు అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకోవడం జరుగుతున్న ట్లు తెలిపారు. ఎన్95, సాధారణ మాస్క్ లు, పి పి ఎ లను సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సర్వే బృందాలను ఏర్పాటు చెయ్యడం తో పాటు ఆ బృందానికి అనుబంధం గా డాక్టర్లు ను అనుసంధానం చెయ్యడం జరుగుతుందని తెలిపారు.  ర్యాపిడ్ టెస్టింగ్ పరికరాలను అందుబాటులో కి తీసుకుని రావడం కోసం వాటి నాణ్యత, సామర్ధ్యం పరిశీలించి వీలైనంత త్వరగా వాటిని అందుబాటులో కి తీసుకుని వొస్తామన్నారు. విఆర్డీ పరీక్షలు జరుపగలుగుతాము. అవసరమైన మందులను కూడా అందుబాటులో కి తీసుకుని రావడం జరుగుతుందన్నారు.  డాక్టర్, నర్సులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు కలసి వారి సంఘీభావాన్ని తెలపడాని ముందుకు వచ్చారనివారి సేవలను  వినియోగించు కుంటామన్నారు. మంత్రులు బృందం, ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారం తో ఈ విపత్తు నుంచి బయట పడగలుగుతామని మంత్రుల బృందం ఛైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.


ఈ 21 రోజుల లాక్ డౌన్ ఒక సువర్ణ అవకాశం, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం వొచ్చిందని, అనుమానాస్పద స్థితిలో ఉన్న వారి వివరాలు ఎప్పటికప్పుడు అధికారులకు104, 1092 నెంబర్ లకు , జిల్లాలో అందుబాటులో ఉన్న కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించేందుకు కృషి చేయాలన్నారు. ఇప్పటికే ఎటువంటి అవాంతరాలు ఏర్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. క్వారెంటైన్ కేంద్రలలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు
అనంతరం నిత్యావసర సరుకుల పంపిణీ పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 1 కోటి 47 లక్షల కుటుంబాలకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేయడం జరుగు తొందని, మొదటి 3 రోజులు ఎక్కువ మంది సరుకుల కోసం రావడం జరిగిందన్నారు. రద్దీని నివారించేందుకు ఇంటింటికి కుపన్ లు అందించి ఎప్పుడు సరుకులు తీసుకుని వెళ్ళాలో వాలంటీర్లు ద్వారా తెలియచెయ్యడం జరగాలని తెలిపారు.  మలి విడత లో పంపిణీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు సన్నాహాలు ఇప్పటినుంచే చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హత ఉన్న లభ్డిదారులకు బియ్యం అందించాలని, వెయ్యి రూపాయల ఆర్థిక చేయూత అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 15 నుంచి గ్రామ స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు  ఏర్పాటు చేయండం జరుగుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో, క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి అక్కడే ధాన్యం నాణ్యత, మాయచ్చర్ ను తనిఖీ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తామన్నారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image