గిట్టుబాటు ధరను సద్వినియోగం చేసుకోండి ;మందలపు

గిట్టుబాటు ధరను సద్వినియోగం చేసుకోండి ;మందలపు
వరికుంటపాడు ,:.       ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం వాళ్ళని ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధర కల్పించింది అని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వరికుంటపాడు మండల వైసీపీ కన్వీనర్ మందలపు తిరుపతినాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతు ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తో వరికుంటపాడు, దుత్తలూరు మండలాల రైతులను ఆదుకునేందుకు దుత్తలూరు లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసారని అక్కడ ప్రభుత్వం కేటాయించిన మద్దత్తు ధర తో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని వివరించారు. దళారుల బెడద లేకుండా నేరుగా అమ్మకాలు చేసుకునేందుకు ఎంతో అనుకూలము గా ఉంటుందని తెలిపారు. వరికుంటపాడు మండలం లోని విరువూరు, మహ్మదాపురం, వరికుంటపాడు పంచాయతీ ల పరిది లో శెనగలు అమ్ముడు అయ్యాయి అని అదే కొనుగోలు కేంద్రం లో జొన్నలు, మొక్కజొన్నలు, పెసలు ప్రభుత్వ మద్దతు ధరకే కొనుగోలు చేస్తారని రైతులు ఈ అవకాశాన్ని పొందాలన్నారు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలీ అహ్మద్, వరికుంటపాడు సింగిల్ విండో అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు రైతుల మేలుకోసం అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ చేసుకోవాలని మందలపు తిరుపతి నాయుడు తెలిపారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image