వింజమూరులో దాతల సహకారం ప్రశంసనీయం :ఎస్.ఐ బాజిరెడ్డి


వింజమూరు, ఏప్రిల్ 24 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో దాతలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎస్.ఐ బాజిరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో వి.యస్.ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత వనిపెంట.సుబ్బారెడ్డి ప్రభుత్వ శాఖల సిబ్బందికి భోజనాలు అందించే కార్యక్రమానికి ఎస్.ఐ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనిపెంట.సుబ్బారెడ్డి ఇప్పటికే వింజమూరులోని పలు ప్రాంతాలలో పేద ప్రజలకు విరివిగా కూరగాయలను పంపిణీ చేస్తూ తన దాతృత్వమును చాటుకుంటుండటం గొప్ప విషయమన్నారు. తాజాగా ప్రస్తుత కరోనా వైరస్ నియంత్రణ దిశగా పని చేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి వారి వారి కార్యాలయాలకే భోజనాలు చేర్చి అన్నదాతగా కీర్తి గడించారన్నారు. మండల వ్యాప్తంగా దాతలు చేస్తున్న సేవలు మరువరానివన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, రెవిన్యూ తదితర శాఖలతో పాటు జర్నలిస్టులకు సైతం సుబ్బారెడ్డి భోజన ప్యాకెట్లును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి, ప్రభుత్వ వైధ్యాధికారి హరిక్రిష్ణ, బి.జె.పి నియోజకవర్గ ఇంచార్జ్ యల్లాల.రఘురామిరెడ్డి, పి.సి.సి సభ్యులు మద్దూరు.రాజగోపాల్ రెడ్డి, వై.సి.పి నేతలు గణపం.రమేష్ రెడ్డి, కైపు.సుబ్బారెడ్డి, నీలం.సంజీవరెడ్డి, ముస్లిం హెల్పింగ్ హ్యాండ్స్ బృందం ప్రతినిధులు ఎస్.కె.రఫి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image