కౌలు రైతు కి పుట్టెడు కష్టాలు

కౌలు రైతు కి పుట్టెడు కష్టాలు
ఉదయగిరి:    నియోజకవర్గం లోని వరికుంటపాడు మండలం లో కౌలు రైతు లు పుట్టెడు కష్టాలు తో అల్లాడుతున్నారు.  సుమారు నెల రోజులు గా జొన్న, వరి, శెనగ పంట లను కోసి ఇళ్లలో చేర్చుకున్నారు, తీరా ధాన్యాన్ని అమ్ముకోడానికి అగచాట్లు పడుతున్నారు. వరికుంటపాడు, ఉదయగిరి, సీతారాంపురం మండలాలకు సంబందించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని దుత్తలూరు లో ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి వెళ్లిన కౌలు రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ అభ్యర్దించగా కౌలు రైతు ల సంబందించిన పూర్తి వివరాలు అందుబాటులో లేవు అని పూర్తి వివరాలు వచ్చిన తరువాత నే కొనుగోలు చేస్తాం అని అక్కడి అధికారులు తేల్చి చెప్పారు, దీంతో దిక్కు తోచని స్థితి లో కౌలు రైతులు నలిగి పోతున్నారు. ఆరుగాలం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యాన్ని సకాలం లో అమ్ముకోలేకపోతున్నాం అని బెంగ పడుతున్నారు. నెలల తరబడి ఇళ్లలో ఉండిపోవడం తో ధాన్యం  బరువు తగ్గిపోవడం తో పాటు నాణ్యత కూడా దిగజారే ప్రమాదం ఉందని వాపోతున్నారు. మండలం లోని కాంచెరువు, గొల్లపల్లి, ఎర్రంరెడ్డిపల్లి, పాపనగారిపల్లి, మహ్మదాపురం, విరువూరు, తూర్పు పాలెం, కృష్ణంరాజు పల్లి, కొండాయపాలెం, తొడుగుపల్లి గ్రామాల్లోని జొన్న, వేరుశెనగ, మినుములు ఇళ్లలోనే ఉండిపోయాయి, పండించిన ధాన్యం కళ్ళముందే ఉంచుకున్న కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వరికుంటపాడు మండల వ్యవసాయ అధికారి శ్రీహరి ని వివరణ కోరగా కౌలు రైతుల సమస్య లు తమ దృష్టి కి వచ్చాయని కౌలు రైతుల కార్డు లకి సంబందించి సాంకేతిక సమస్య ఏర్పడింది అని ఈ విషయం ఉన్నత అధికారులు కి తెలియజేసాం అని త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది అని ఆయన తెలిపారు.